TRS: శీతాకాల సమావేశాల బహిష్కరణ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను తెరాస ఎంపీలు బహిష్కరించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల్లు, యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలంటూ ఉభయ సభల్లో చేసిన ...
ధాన్యం కొనుగోళ్లపై ప్రజాక్షేత్రంలో పోరాడతాం
స్పష్టం చేసిన తెరాస ఎంపీలు
పార్లమెంటు భవనం నుంచి బయటకు వస్తున్న తెరాస ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, పి.రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, వెంకటేష్ నేత, బి.బి.పాటిల్, సురేష్రెడ్డి, రంజిత్రెడ్డి, దయాకర్, లింగయ్య యాదవ్, మాలోత్ కవిత
ఈనాడు, దిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను తెరాస ఎంపీలు బహిష్కరించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల్లు, యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలంటూ ఉభయ సభల్లో చేసిన నిరసనలకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేశారు. క్షేత్రస్థాయి పోరాటాలతో ఈ సమస్యకు పరిష్కారం సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రధాని, కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ముందుగా ప్రకటించిన విధంగా నల్లచొక్కాలు ధరించిన తెరాస ఎంపీలు ఉభయ సభల్లో మంగళవారం కూడా ఆందోళనకు దిగారు. తెలంగాణ నుంచి పంట సేకరించకపోవడం, ఎఫ్సీఐ ధాన్యం తరలించకపోవడం, ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది టన్నుల వడ్లు మార్కెట్ యార్డుల్లో ఉండడం తదితర అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. తెలంగాణ సభ్యులతోపాటు ఇతర అంశాలపై పలు విపక్ష పార్టీల ఆందోళనతో అయిదు నిమిషాలకే రాజ్యసభ వాయిదా పడింది. మరోవైపు ఎమ్మెస్పీ చట్టం, జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానంపై చర్చించాలంటూ లోక్సభలో తెరాస పక్షనేత నామా నాగేశ్వరరావు నోటీసు ఇవ్వగా సభాపతి ఓం బిర్లా తిరస్కరించారు. నిరసనగా తెరాస సభ్యులు వెల్లో బైఠాయించి నినాదాలు చేశారు. సభాపతి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో, తెలంగాణ భవన్లో తెరాస ఎంపీలు విలేకరులతో మాట్లాడారు. పోరాడితేనే తెలంగాణ వచ్చిందని, అదే తీరున ధాన్యం సేకరణపైనా క్షేత్రస్థాయిలో పోరాడతామని కేశవరావు తెలిపారు. ప్రధాని మోదీని ప్రజాసామ్య వ్యతిరేకిగా అభివర్ణించిన ఆయన..తాము మోదీకి పూర్తివ్యతిరేకంగా ఉన్నామన్నారు. ‘‘ఇది ఫాసిస్ట్, ప్రజా, రైతు వ్యతిరేక, అహంకారపూరిత ప్రభుత్వం. నేటి నుంచి మా నినాదం మోదీని పంపించడమే(ఆజ్ సే హమారా నారా..మోదీ జారా)’’ అని కేకే స్పష్టంచేశారు. ‘ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తారా’ అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘ఆ ఆలోచన లేదని’ కేశవరావు బదులిచ్చారు.
నిరసనలు ఫలితమివ్వలేదు.. అందుకే బహిష్కరణ నిర్ణయం
ధాన్యం సేకరణే రాష్ట్రంలో అతిపెద్ద సమస్య. ఏళ్లుగా సాఫీగా సాగుతున్న ప్రక్రియను కొనసాగించాలని కోరాం. రాష్ట్రంలో మిగిలినపోయిన పారా బాయిల్డ్ రైస్ తీసుకోవాలని విన్నవించాం. గోదాములు నిండిపోయాయి. రైల్వే ర్యాక్లు ఇవ్వడం లేదు. సమస్యను వివరించినా వారికి అర్థం కావడం లేదు. పార్లమెంటులో ఎంతగా నిరసన తెలిపినా కేంద్రం పట్టించుకోలేదు. పంట కొనుగోలుపై మేం అడిగే ప్రశ్నపై కేంద్ర మంత్రి రూపాలాకు అవగాహన ఉంది. స్వతహాగా రైతు అయిన ఆయన ‘మీరు అడిగే దానిలో అర్థం ఉంది’ అని అన్నారు. మిగిలిన మంత్రులే అర్థం చేసుకోలేకున్నారు. ఇది పూర్తిగా రైతు, ప్రజా, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం. పార్లమెంటులో నిరసనలు ఫలించకపోవడంతో సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం. సమస్యను ప్రజలకు వివరిస్తాం
- కేశవరావు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత
రైతులను రోడ్లపై పడేసే కుట్ర
భాజపా నాయకులు తెలంగాణ రైతులను రోడ్లపై పడేసే కుట్రకు పాల్పడుతున్నారు. కేంద్ర మంత్రులు ఒక ప్రకటన చేస్తుంటే, భాజపా ఎంపీలు మరో ప్రకటన చేస్తున్నారు. రాష్ట్ర సమస్యపై సభలో మేం ఆందోళన చేస్తుంటే రాష్ట్రానికే చెందిన భాజపా, కాంగ్రెస్ ఎంపీలు కలిసి రావడం లేదు. పార్లమెంట్లో ఆ ఎంపీల వ్యవహార శైలిని ప్రజలు గుర్తించాలి. ధాన్యం సేకరణ అంశాన్ని పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశం, సభా కార్యకలాపాల కమిటీలోనూ లేవనెత్తాం. సభలు ప్రారంభమైనప్పట్నుంచి ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. యాసంగిలో వరి సాగుపై ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రశ్నకు సమాధానమిస్తే, యాసంగి పంట కొనమని వాణిజ్యశాఖ మంత్రి సమాధానమిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరగనందునే సమావేశాలు బహిష్కరిస్తున్నాం. భాజపా నాయకులు చెప్పే మాటలను రైతులు నమ్మొద్దు. కేసీఆర్ సూచనలను రైతులు పాటించాలి.
- నామా నాగేశ్వరరావు, తెరాస లోక్సభా పక్ష నేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)