మెకానికల్ను మార్చేద్దాం
ఒకవైపు పరిశ్రమలు ఆటోమేషన్ వైపు శరవేగంగా మారిపోతుంటే అందుకు తగ్గట్లు మెకానికల్ ఇంజినీరింగ్ సిలబస్ మారడం లేదు. ఫలితంగా కొత్తవారికి కొలువులు దక్కడంలేదు. ఉద్యోగాలు చేస్తున్నవారిని
ఆటోమేషన్కు తగ్గట్లు సిలబస్ మార్పు
ఐటీ సంబంధ అంశాలతో కొత్త పాఠ్య ప్రణాళిక
విద్యా, పరిశ్రమల నిపుణులతో కమిటీని నియమించిన ఏఐసీటీఈ
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం
గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తుంటే మెకానికల్ ఇంజినీరింగ్లో మన విద్యార్థులు ఇంకా స్టీమ్ ఇంజిన్తో నడిచే రైళ్ల గురించి చదువుకుంటున్నారు. మన అవసరాలు ఒకటైతే... తరగతి గదిలో చెప్పేదొకటి ఉంటోంది
-2019లో జేఎన్టీయూహెచ్లో సిలబస్పై జరిగిన సదస్సులో అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య ఎం.పి.పూనియా ఆవేదన ఇది..
ఒకవైపు పరిశ్రమలు ఆటోమేషన్ వైపు శరవేగంగా మారిపోతుంటే అందుకు తగ్గట్లు మెకానికల్ ఇంజినీరింగ్ సిలబస్ మారడం లేదు. ఫలితంగా కొత్తవారికి కొలువులు దక్కడంలేదు. ఉద్యోగాలు చేస్తున్నవారిని ఇప్పటికాలానికి అనుగుణంగా నైపుణ్యాలు లేవని తొలగిస్తున్నాయి. అందుకే విద్యార్థులు బీటెక్ మెకానికల్ బ్రాంచి అంటే దూరం అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో ఏఐసీటీఈ అప్రమత్తమై మెకానికల్ ఇంజినీరింగ్ సిలబస్ను ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని నిర్ణయించింది. ఐఐటీ బాంబే మెకానికల్ బ్రాంచి ఆచార్యుడు బి.రవి ఛైర్మన్గా పలువురు నిపుణులతో ఇటీవల కమిటీని నియమించింది.
ఐటీ పరిశ్రమకూ పనికొచ్చేలా..
అన్నిరకాల పరిశ్రమలు యంత్రాలతో పనిచేసేలా ఆటోమేషన్ దిశగా మారిపోతున్నాయి. అలాంటిచోట్ల సిబ్బంది పనిచేయాల్సి వస్తే పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసిన వారు సరిపోతారు. పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాలుంటే అప్పుడు ఇంజినీర్లను నియమించుకుంటాయి. అందుకే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్(క్యాడ్), మెకట్రానిక్స్, 3డీ ప్రింటింగ్, డ్రోన్ల తయారీ, సాంకేతికతతో పాటు సాఫ్ట్వేర్ నైపుణ్యం ఉండేలా ఐటీ సంబంధ అంశాలను అధికంగా మార్చాలన్నది ఏఐసీటీఈ ఆలోచన. మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమల్లోనే కాకుండా ఐటీ పరిశ్రమల్లోనూ బీటెక్ మెకానికల్ ఇంజినీర్లను అధికంగా నియమించుకునేలా సిలబస్ను మార్చాలని మండలి భావిస్తోంది. అందుకే ఐఐటీలు, ఐఐఎస్సీ బెంగళూరు ఆచార్యులతో పాటు పరిశ్రమల నిపుణులను కూడా కమిటీలో నియమించింది. వచ్చే విద్యాసంవత్సరం(2022-23) నుంచే కొత్త సిలబస్ను అమలు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.
మూడో వంతూ నిండటం లేదు!
దేశవ్యాప్తంగా మెకానికల్ బ్రాంచిలో మూడో వంతు సీట్లు నిండటం గగనంగా మారింది. 2017-18 విద్యాసంవత్సరం దేశవ్యాప్తంగా 3,41,621 మెకానికల్ సీట్లు ఉండగా.. అందులో 1,59,920(46.80 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. నాలుగేళ్ల కిందటే ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు భర్తీ శాతం 35కి పడిపోయి ఉంటుందని నిపుణుల అంచనా. తెలంగాణలో 2018-19లో సీట్లు, 2021-22 విద్యాసంవత్సరంలో సీట్లతో పోల్చుకుంటే దాదాపు 40 శాతం తగ్గిపోయాయి. ప్రవేశాలు పొందినవారు ఈసారి 32.57 శాతం మాత్రమే. అదీ కన్వీనర్ కోటాలో.. యాజమాన్య కోటా సీట్లను కలుపుకొని చూస్తే నాలుగో వంతు కూడా నిండవని స్పష్టమవుతోంది. రాష్ట్రంలోనే కాదు.. ఎన్ఐటీల్లోనూ మెకానికల్ సీట్లు భారీగా మిగిలిపోయాయి. జోసా కౌన్సెలింగ్ తర్వాత ఎన్ఐటీ వరంగల్, ఏపీలో ఒక్కోచోట కూడా 15 సీట్లు భర్తీ కాలేదు. వాటికోసం మరో రెండుసార్లు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ‘అందరూ కంప్యూటర్ సైన్స్ కోరుకుంటుండటంతో జేఎన్టీయూహెచ్ అన్ని బ్రాంచీల్లో మేజర్, మైనర్ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెడుతోంది. బీటెక్ మూడో ఏడాది నుంచి మెకానికల్ విద్యార్థి... కృత్రిమ మేధ, రోబోటిక్స్ తదితర ఆసక్తి ఉన్న కోర్సులను ఎంచుకోవచ్చని’ అని మెకానికల్ ఆచార్యుడు విజయకుమార్రెడ్డి చెప్పారు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం