కొత్త వస్త్రాలతో పోరులోకి..
ఆధునికత వైపు క్రమంగా అడుగులు వేస్తున్న భారత సైన్యం.. యూనిఫాం విషయంలోనూ కొత్త సొబగులు అద్దుకుంటోంది. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా 13 లక్షల మంది సైనికుల పోరాట దుస్తుల్లో మార్పు జరిగింది. జవాన్లకు మరింత సౌకర్యం
భారత సైన్యానికి కొత్త యూనిఫాం
ఆధునికత వైపు క్రమంగా అడుగులు వేస్తున్న భారత సైన్యం.. యూనిఫాం విషయంలోనూ కొత్త సొబగులు అద్దుకుంటోంది. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా 13 లక్షల మంది సైనికుల పోరాట దుస్తుల్లో మార్పు జరిగింది. జవాన్లకు మరింత సౌకర్యం కలిగించేలా, యుద్ధ క్షేత్రంలో శత్రువులను మెరుగ్గా ఏమార్చేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వీటిని తొలిసారి ప్రదర్శించనున్నారు.
సైనిక దళాలకు ప్రత్యేకత తెచ్చేది వారు ధరించే విలక్షణ యూనిఫామే. సందర్భానికి తగ్గట్లు దుస్తులు వేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న సైనిక ఆనవాయితీ. ఇందులో పోరాట యూనిఫాం (కంబాట్ డ్రెస్)కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. తీవ్ర వేడి, చలి నుంచి సైనికులను రక్షించడం, ఊసరవెల్లిలా పరిసరాలతో మెరుగ్గా కలిసిపోయి (కామోప్లాజ్) శత్రువులను తెలివిగా బోల్తా కొట్టించడం వీటి ఉద్దేశం. ఇందుకోసం వస్త్రంపై భిన్న వర్ణాలను ఒక పద్ధతిలో కలపడం ద్వారా ఒక ప్యాటర్న్ను ఏర్పరుస్తారు.
ఇప్పుడు మార్పు ఎందుకు?
ప్రస్తుతం సైన్యం వాడే పోరాట దుస్తులు బహిరంగ మార్కెట్లోనూ లభ్యమవుతున్నాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలోని భద్రతా విభాగాలూ వాటిని విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఆ శాఖల సిబ్బందిని కూడా సైనికులుగా ప్రజలు పొరబడుతున్నారు. దీంతో శాంతి భద్రతల విధుల్లో సైన్యాన్ని వాడుతున్నారన్న అపోహలు చెలరేగుతున్నాయి.
* ప్రస్తుతం పోరాట యూనిఫాం జీవితకాలం 18 నెలలుగా ఉంది. దీంతో మరింత మన్నిక కలిగిన, ఎక్కువ సౌకర్యంతో కూడిన ఆధునిక వస్త్రం అవసరమైంది.
ఎలా ఉంటుంది?
సైనికుల సౌకర్యం, వారు విధులు నిర్వర్తించే భిన్న భౌగోళిక ప్రదేశాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ రూపొందించారు. తీవ్ర వేడి, చలిని తట్టుకొనేలా పటిష్ఠత, తక్కువ బరువు కలిగిన వస్త్రాన్ని ఎంపిక చేశారు. ఇందులో 70 శాతం కాటన్, 30 శాతం పాలిస్టర్ను ఉపయోగించారు.
తీవ్ర వడపోత తర్వాతే..
పోరాట దుస్తుల రూపకల్పనకు భారత సైన్యం.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సేవలను వినియోగించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సైనిక యూనిఫారాలపై విస్తృత స్థాయి విశ్లేషణ, చర్చలు జరిగాయి. మొత్తం మీద 15 విభిన్న కామోఫ్లాజ్ పోకడలు, నాలుగు భిన్న డిజైన్లు, 8 రకాల వస్త్రాలను నిఫ్ట్ ప్రతిపాదించింది. వాటిని పరిశీలించిన సైన్యం.. నాలుగు కమోఫ్లాజ్ ప్యాటర్న్లు, మూడు డిజైన్లు, ఐదు రకాల వస్త్రాలను ఎంపిక చేసింది. వాటిని భిన్న మిశ్రమాల్లో యూనిఫారాలుగా తయారుచేసి, సైన్యంలోని 150 మంది సిబ్బందికి ఇచ్చారు. వారు వెలిబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా తుది ఎంపిక చేశారు. సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. దశలవారీగా వీటిని సైన్యానికి అందిస్తారు. సైనికులంతా ఈ యూనిఫాంలో కనిపించడానికి కనీసం రెండేళ్లు పట్టొచ్చు.
* ఈ కొత్త యూనిఫాం దీర్ఘకాలం మన్నుతుంది. వేసవి, శీతాకాలాల్లో ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది. ఉతికినప్పుడు త్వరగా ఆరిపోతుంది.
* ఈ డ్రెస్లో ‘డిస్రప్టివ్ డిజిటల్ ప్యాటర్న్’ ఉంటుంది. దీన్ని పిక్సెలేటెడ్ డిజైన్ అని కూడా పిలుస్తారు. ఇది ఆలీవ్, మట్టి వర్ణాల మిశ్రమం. లేత రంగులో కనిపిస్తుంది. భారత సైన్యం మోహరించే ప్రాంతాలకు అనుగుణంగా ప్యాటర్న్ను రూపొందించారు. గతంలో అటవీ, ఎడారి ప్రాంతాలకు భిన్నమైన పోరాట దుస్తులు ఉండేవి. కొత్త యూనిఫాంను అన్ని భౌగోళిక ప్రదేశాలకూ అనువుగా తీర్చిదిద్దారు. దీనివల్ల సైనికులు తమ పరిసరాలతో సులువుగా కలిసిపోతారు.
* ఈ కొత్త డ్రస్ను టక్ చేయరు. బెల్టు బయటకు కనిపించదు. లోపల టి షర్టు ధరించాలి. ప్యాంట్కు అదనపు జేబులు ఉంటాయి. ప్యాంట్ దిగువ భాగం.. బూట్లలోకి ఒదిగిపోతుంది.
* పోరాట దుస్తుల్లో ర్యాంకును సూచించే చిహ్నాలను భుజాలపై కాకుండా.. ముందు భాగంలో గుండీల వద్ద ప్రదర్శించే అవకాశం ఉంది. మెరుగైన కమోఫ్లాజ్ కోసం వాటిని నలుపు రంగులో ప్రదర్శిస్తారన్న అభిప్రాయమూ ఉంది.
* కొత్త యూనిఫాం 13 సైజుల్లో లభ్యమవుతుంది. వీటిని పూర్తిగా సైన్యానికే ప్రత్యేకించారు. భద్రతా కారణాల వల్ల పౌరులకు అందుబాటులో ఉంచరాదని ప్రభుత్వం నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!