Carona:పండగ వేళ..పారాహుషార్!
రాష్ట్రంలో ఈనెలలో కేసులు భారీగా పెరిగాయి. ఒకటో తేదీ నాటికి ఒక్కటి కూడా లేని జిల్లాల్లో ప్రస్తుతం రోజూ 50 దాకా వస్తున్నాయి. హైదరాబాద్లో జనవరి 1 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 69గా ఉంటే... శుక్రవారానికి 1,233గా నమోదైంది. ఇదే తరహాలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రెండువందల చేరువలో కేసులు వచ్చాయి. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, సంక్రాంతి నేపథ్యంలో పట్టణాల నుంచి గ్రామాలకు
ఈ నెలలోనే కొత్తగా 23 వేల కొవిడ్ కేసులు
పల్లెల్లో వేగంగా వ్యాప్తి
తాజాగా రాష్ట్రంలో 2,398 పాజిటివ్లు
స్వీయ జాగ్రత్తలు ఎంతో ముఖ్యమంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెలలో కేసులు భారీగా పెరిగాయి. ఒకటో తేదీ నాటికి ఒక్కటి కూడా లేని జిల్లాల్లో ప్రస్తుతం రోజూ 50 దాకా వస్తున్నాయి. హైదరాబాద్లో జనవరి 1 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 69గా ఉంటే... శుక్రవారానికి 1,233గా నమోదైంది. ఇదే తరహాలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రెండువందల చేరువలో కేసులు వచ్చాయి. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, సంక్రాంతి నేపథ్యంలో పట్టణాల నుంచి గ్రామాలకు ప్రజలు వెళ్లడంతో వైరస్ వ్యాప్తి వేగం అవుతోంది. రెండు వారాల్లోనే ఈ కేసులు భారీగా పెరిగాయి. ఈనెల 1 నుంచి శుక్రవారం వరకు రోజుకి సగటున 1,650 మంది చొప్పున ఇప్పటికే 23వేల మందికిపైగా ప్రజలు మహమ్మారి బారిన పడ్డారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,398 కేసులు నమోదయ్యాయి. జనవరి ఒకటిన నమోదైనవి కేవలం 317. కొవిడ్ నిబంధనలు పాటించక పోవడంతో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. శనివారం సంక్రాంతి కావడంతో జనం గుంపులుగా చేరడం, మాస్కులు ధరించకపోవడం వంటి పరిస్థితులకు ఎక్కువగా ఆస్కారం ఉందని ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే కొవిడ్ మరింత విజృంభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
సూచనలు ఇలా...
* భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం. మనం ఎవరి సమీపానికి వెళ్లకపోవడమే కాదు.. ఎవరన్నా దగ్గరకు వస్తున్నారంటే మనమే దూరంగా జరగాలి. ఆ స్పృహ ఎంతో ముఖ్యం.
* బయట ఎట్టి పరిస్థితుల్లో మాస్కు ముక్కు జారకూడదు. కొందరు మాట్లాడుతూ ఎదుటి వారికి తన మాట అర్థం కావాలని మాస్కు కిందకు జరుపుతుంటారు. అంటే వారు మాస్కు ధరించిన ఉద్దేశాన్ని గాలికొదిలేసినట్టే.
* పండగకని ఊరికొచ్చిన వారు సాధారణంగా చుట్టుపక్కల ఇళ్లకు పలకరింపులకు వెళ్లడం సాధారణం. ఇలాంటి సందర్భాల్లో మాటామంతికి వెళ్లే వారు.. ఆ ఇంట్లోని వారు కూడా మాస్కులు ధరించడం, దూరం దూరంగా కూర్చోవడం చాలా ముఖ్యం.
* మాస్కుకు అదనంగా ఫేస్షీల్డ్ వంటివి ధరించవచ్చు.
68,525 మందికి పరీక్షలు
కరోనా లక్షణాలతో బాధపడుతున్న 68,525 మందికి శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,233, రంగారెడ్డిలో 192, మేడ్చల్లో 191, సంగారెడ్డిలో 75 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోవడంతో మృతుల సంఖ్య 4,052కు చేరింది. జనవరి 1న ఈ సంఖ్య 4,029గా ఉంది. కొవిడ్ నుంచి 1,181 మంది బయటపడడంతో కోలుకున్న వారి సంఖ్య 6,79,471గా నమోదైంది. ప్రస్తుతం మరో 21,676 మంది చికిత్స, ఐసొలేషన్లో ఉన్నారు. ఈ నెల 1న ఈ సంఖ్య 3,733గా ఉంది.
ఆసుపత్రుల్లో పెరుగుతున్న చేరికలు
గత రెండు వారాలుగా ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయి. జనవరి 1 నాటికి 1,229 మంది ఉంటే ప్రస్తుతం 2వేలకు చేరుకుంది. ఆక్సిజన్ పడకలపై బాధితులు దాదాపు రెండింతలయ్యారు. ఐసీయూ పడకల్లో బాధితులు 413 ఉంటే.. ప్రస్తుతం 492 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, హైదరాబాద్ మినహాయిస్తే రెండోదశలో రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో ఖమ్మం, మహబూబ్నగర్, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, హనుమకొండ, పెద్దపల్లి నిజామాబాద్ ఉన్నాయి. ప్రస్తుతం 30-60 మధ్య కేసులు నమోదవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే