తెలంగాణలో పరిశ్రమ స్థాపించండి
ప్రసిద్ధ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్కు చెందిన అతిపెద్ద ప్రాంగణం ఎక్కడుందో తెలుసా? అని కేటీఆర్ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని ప్రాంగణ భారీ భవనం ఫోటోను ట్విటర్కు జత చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించి.. హైదరాబాద్ అని సమాధానమిచ్చారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్కు కేటీఆర్ ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో భారీ పెట్టుబడులతో పరిశ్రమను స్థాపించాలని ప్రపంచ అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అధినేత ఎలన్మస్క్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. భారత్లో సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ట్విటర్ ద్వారా కోరారు. భారత్ మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయని ఎలన్మస్క్ శనివారం చేసిన ట్వీట్పై ఆయన ఈ మేరకు స్పందించారు. టెస్లాతో కలిసి పనిచేయడం తమకు సంతోషదాయకమన్నారు. భారత్లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా, పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా కారును స్వయంగా నడిపిన ఫొటోను కేటీఆర్ తన ట్వీట్కు జత చేశారు. కారు బాగుందని, ఎలన్ మస్క్ కొత్తగా ఆలోచించారని అప్పట్లో చేసిన ట్వీట్ను సైతం ఆయన గుర్తు చేశారు. కాగా కేటీఆర్ ఆహ్వానంపై ఎలన్ స్పందించారు. కేంద్రంతో ఇంకా చర్చిస్తున్నామని, చర్చలు కొలిక్కి రాలేదంటూ ఆయన పేర్కొన్నారు. 2003లో టెక్సాస్లో ప్రారంభమైన టెస్లా ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల తయారీలో మొదటిస్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో 23 శాతం ఇవి తయారు చేస్తున్నవే. భారత్లో తమ తొలి యూనిట్ను స్థాపించేందుకు గత ఏడాది కాలంగా ఎలన్ సన్నాహాలు చేస్తున్నారు.
ఫార్ములా ఇ-రేస్ల నిర్వహణపై నేడు ఒప్పందం
తెలంగాణలో ఎలక్ట్రానిక్ వాహనాలతో ఫార్ములా రేస్ జాతీయస్థాయి వార్షిక పోటీల నిర్వహణకు హైదరాబాద్ వేదిక కానుంది. దీని కోసం ఫార్ములా ఇ-అసోసియేషన్తో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది.
మరో మూడు రాష్ట్రాలూ ఆహ్వానించాయ్..
చండీగఢ్: విద్యుత్ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల నేతలూ ఎలన్ మస్క్ను ఆహ్వానించారు. తాను ప్రతిపాదిస్తున్న ‘పంజాబ్ నమూనా’లో లూధియానా నగరం విద్యుత్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమకు హబ్గా ఎదుగుతుందని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావాలని మస్క్ను కోరారు. మహారాష్ట్రలో టెస్లా కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే పూర్తి తోడ్పాటు అందిస్తామని ఆ రాష్ట్ర మంత్రి జయంత్ పటేల్ హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ గులాం రబ్బానీ కూడా మస్క్కు ఇదే రకమైన ఆహ్వానాన్ని అందించారు.
ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ ప్రాంగణం ఎక్కడుంది?
ప్రసిద్ధ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్కు చెందిన అతిపెద్ద ప్రాంగణం ఎక్కడుందో తెలుసా? అని కేటీఆర్ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని ప్రాంగణ భారీ భవనం ఫోటోను ట్విటర్కు జత చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించి.. హైదరాబాద్ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో 15 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా బయట అమెజాన్ ఏర్పాటు చేసిన ప్రాంగణం ఇదే కావడం గమనార్హం. ఇటీవల పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి సైతం కేటీఆర్ ఇలాంటి ప్రశ్న వేసి సమాధానం రాబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్న జల్పల్లి, ఉమ్దాసాగర్ చెరువులతోపాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టు ఆవరణలో నిందితులకు సంకెళ్లపై వివరణ ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి జిల్లా కోర్టు ఆవరణలో నిందితులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
రేకుల డబ్బాలు కావు.. నివాస గృహాలే!
ఇక్కడ కనిపిస్తున్నవి రేకుల డబ్బాలు అనుకుంటే పొరపాటే. అవి నివాస గృహాలే. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని పేదలకు 2008లో అప్పటి ప్రభుత్వం పేదలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.