సంకట స్థితిలో ‘సర్కారు’ విద్యార్థుల చదువు
సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల పరిస్థితి మళ్లీ డోలాయమానంలో పడింది. బడులు తెరిస్తే కేసులు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చా? లేదా? అనే అంశాన్ని సర్కారు ఇచ్చిన
బడుల మూసివేతపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
రెండు, మూడు రోజుల తర్వాత తెరుస్తామంటున్న ట్రస్మా
ఈనాడు, హైదరాబాద్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల పరిస్థితి మళ్లీ డోలాయమానంలో పడింది. బడులు తెరిస్తే కేసులు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చా? లేదా? అనే అంశాన్ని సర్కారు ఇచ్చిన జీవోలో స్పష్టంచేయలేదు. ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు మాత్రమే పేర్కొంది. అదే సమయంలో ఆ తర్వాత బడులు తెరుస్తారా? అన్నది అప్పటి కేసుల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ఇంటర్ విద్యాశాఖ టీవీ పాఠాలను ప్రసారం చేస్తూనే ఉంది. వర్సిటీలు కూడా పచ్చజెండా ఊపాయి. ఇంకా ప్రభుత్వం అనుమతించినా? ఇవ్వకున్నా ప్రైవేట్ పాఠశాలలను ఆన్లైన్ పాఠాలు నిర్వహించకుండా విద్యాశాఖ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విద్యా సంవత్సరం సెప్టెంబరు 1 నుంచి జనవరి 8వ తేదీ వరకే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. మొత్తానికి ఈసారి కూడా ప్రైవేట్ విద్యార్థులతో పోల్చుకుంటే సర్కారు బడుల పిల్లలు విద్యా అభ్యసనాల విషయంలో బాగా నష్టపోయారు. ఈసారి ఉపాధ్యాయులందరికీ టీకాలిచ్చారు. 15-18 ఏళ్ల వయసు విద్యార్థులకు కూడా 80 శాతం వరకు పూర్తయింది. పదో తరగతిలో 50 శాతం మేరకే సిలబస్ పూర్తయినందున కనీసం వారికైనా బడులు తెరవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సెలవుల పొడిగింపు సమంజసం కాదు: సంఘాలు
విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. కొవిడ్ మూడో దశ ప్రభావం రాష్ట్రంలో పరిమితంగానే ఉందని, సామూహిక, సామాజిక, వ్యాపార కార్యకలాపాలన్నీ యథావిధిగా నడుస్తున్నాయని, విద్యాసంస్థలను ఎందుకు మూసివేస్తున్నారని టీఎస్యూటీఎఫ్ ప్రశ్నించింది. ‘ప్రత్యక్ష తరగతులు కొనసాగించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేసింది.‘పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించడానికి అనుకూల పరిస్థితులు, అవసరమైన సౌకర్యాలను కల్పించడంపై దృష్టి పెట్టకుండా సెలవులు పొడిగించడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం’ అని టీపీటీఎఫ్ పేర్కొంది. విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులతో చర్చించకుండా సెలవులు ప్రకటించడం సరికాదని డీటీఎఫ్ పేర్కొంది.
తీవ్రంగా ఖండించిన ట్రస్మా
సెలవుల పొడిగింపును తెలంగాణ గుర్తింపు పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) ఖండించింది. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శించింది. ‘రెండు మూడు రోజులు చూసి సర్కారు అనుమతి ఇవ్వకున్నా బడులు తెరుద్దాం. మీరంతా సిద్ధంగా ఉండండి’ అని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు పాఠశాలల యజమానులకు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?