11 క్లబ్బుల్లో అగ్నిమాపక వ్యవస్థే లేదు
సికింద్రాబాద్ క్లబ్లో జరిగిన భారీ అగ్నిప్రమాద నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జనం గుమిగూడటానికి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటిపైనా దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఫంక్షన్ హాళ్ల చిట్టా
సికింద్రాబాద్ క్లబ్ దుర్ఘటన నేపథ్యంలో తనిఖీలు
ఈనాడు, హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్లో జరిగిన భారీ అగ్నిప్రమాద నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జనం గుమిగూడటానికి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటిపైనా దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఫంక్షన్ హాళ్ల చిట్టా సేకరిస్తున్నారు. వాటిలో అగ్నిమాపక వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. దీంతోపాటు రాజధానిలోని ప్రధానక్లబ్బుల్లో ఒక్కదాంట్లోనూ సరైన అగ్నిమాపక వ్యవస్థ లేదని నిర్ధారించిన అధికారులు వాటన్నింటిపై చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఫోరెన్సిక్ నిపుణుల ఆరా!
షార్ట్సర్క్యూట్ కారణంగానే సికింద్రాబాద్ క్లబ్లో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నా అసలు కారణాలపై ఫోరెన్సిక్ నిపుణులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండే వాణిజ్య సముదాయాలు, 18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటే విద్యాసంస్థల భవనాలు, సినిమాహాళ్లు వంటి జనసమ్మర్ద కట్టడాలన్నీ కచ్చితంగా నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్.ఒ.సి.) తీసుకోవాలి. అయితే క్లబ్బులు, ఫంక్షన్హాళ్లు దీని పరిధిలోకి రావు. అయినప్పటికీ సికింద్రాబాద్ క్లబ్ ఉదంతం నేపథ్యంలో ఇప్పుడు అధికారులు వీటిపైనా దృష్టి సారించారు. ముఖ్యంగా ఫంక్షన్హాళ్లలో పెళ్లిళ్ల సీజన్లో వేల మంది జనం గుమిగూడుతుంటారు. ఏదైనా ఉపద్రవం తలెత్తితే లోపల ఉన్న వారందర్నీ తక్షణమే ఖాళీ చేయించడం సాధ్యంకాదు. అందుకే అధికారులు వీటిపై దృష్టి సారించారు.
ఉన్నతస్థాయి సమావేశం
సికింద్రాబాద్ క్లబ్ ప్రమాదం నేపథ్యంలో అగ్నిమాపక, విపత్తు నివారణశాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్కుమార్ జైన్ ఆధ్వర్యంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సినిమాహాళ్లు, ఆసుపత్రులతో పాటు అగ్నిప్రమాదాలు జరిగితే తీవ్ర నష్టానికి అవకాశం ఉన్న అన్ని కట్టడాలు, వాటిలో ఉన్న నివారణ ఏర్పాట్లపై చర్చించారు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
నోటీసులు జారీ
రాజధానిలో ముఖ్యమైన క్లబ్బులు 11 ఉన్నట్లు గుర్తించిన అగ్నిమాపక అధికారులు వాటన్నింటిలోనూ సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఒక్క దాంట్లో కూడా సరైన అగ్నిమాపక వ్యవస్థ లేదని తేలడంతో నివ్వెరపోయారు. కొన్ని చోట్ల కేవలం గ్యాస్ వెదజల్లే ఉపకరణాలు మాత్రమే ఉన్నాయి. ఏళ్లుగా వాటిని మార్చకపోవడంతో అవి కూడా పనిచేసే స్థితిలో లేవు. క్లబ్బుల్లో ఫంక్షన్లు జరుగుతుంటాయి. ఎక్కువ మంది జనం గుమిగూడుతుంటారు కాబట్టి వాటిలోనూ తప్పనిసరిగా పటిష్ఠమైన అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 11 క్లబ్బులకు నోటీసులు జారీ చేస్తున్నారు. వీటికి సమాధానాలు అందిన తర్వాత చర్యలు చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు