ఇప్పటికే మూడో వంతు పాఠశాలల్లో...
రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది వేల ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమ బోధన కొనసాగుతోంది. అయినా చాలా పాఠశాలల్లో పేరుకే ఇంగ్లిషు మీడియం అన్నట్లుగా పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో వచ్చే విద్యా
చాలా చోట్ల పేరుకే... ప్రత్యేక ఉపాధ్యాయులు కరవు
తల్లిదండ్రులు కోరుకుంటే తెలుగు మాధ్యమం కూడా ఉండాల్సిందే?
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది వేల ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమ బోధన కొనసాగుతోంది. అయినా చాలా పాఠశాలల్లో పేరుకే ఇంగ్లిషు మీడియం అన్నట్లుగా పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 26 వేల సాధారణ ప్రభుత్వ బడులున్నాయి. వందల ఉన్నత పాఠశాలల్లో సక్సెస్ స్కూళ్ల పేరిట ఉమ్మడి రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం సెక్షన్లు ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత 2016లో ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమ బోధనకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా ఇప్పటి వరకు 8 వేల వరకు బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధన సాగుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అందులో 4 వేల ప్రాథమిక పాఠశాలలు కాగా మిగిలినవి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు.
చట్టం వస్తే?
ఇప్పటివరకు విద్యాకమిటీలు అడిగిన చోట...ఆంగ్ల మాధ్యమం బోధిస్తామని ఉపాధ్యాయులు అంగీకరించిన స్కూళ్లలో ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఆ తర్వాత ఉపాధ్యాయులు బదిలీ అయినప్పుడు మళ్లీ వారిని ఆంగ్ల మాధ్యమం ఉన్న పాఠశాలలకు పంపలేదు. దాంతో పేరుకే ఆంగ్ల మాధ్యమం ఉన్నట్లు చాలా చోట్ల పరిస్థితి మారింది. చట్టం అమలు చేస్తే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు(టీఆర్టీ) ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసి...నెగ్గిన వారే బోధించాలని నిబంధన పెట్టే అవకాశం ఉంది. టీఆర్టీలో ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కూడా పరీక్షించేలా వ్యాసరూప ప్రశ్నలు కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఉన్న వారిని తెలుగు? ఆంగ్ల మాధ్యమం? ఏదో ఒకటి ఎంచుకునేలా చేయవచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకు ఆంగ్ల మాధ్యమం? తెలుగు మాధ్యమం? బడులని ప్రత్యేకంగా లేవు. కొత్త చట్టం తర్వాత ఆ విషయాన్ని స్పష్టంచేయాల్సి ఉంటుంది.
సమర్ధంగా అమలు చేస్తేనే..
ఆంగ్ల మాధ్యమాన్ని సమర్ధంగా అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) పేర్కొంది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగు మాధ్యమాన్ని యథావిధిగా కొనసాగించాలని విద్యా వాలంటీర్ల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు శివానందమూర్తి ఒక ప్రకటనలో కోరారు. ఆంగ్ల మాధ్యమం కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించాలని ఆయన సూచించారు.
అడిగితే తెలుగు ఉండాల్సిందే
కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగిస్తామంటే న్యాయపరంగా చిక్కులు తప్పవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఉదాహరణకు ఏపీలో తప్పనిసరి ఆంగ్ల మాధ్యమం అమలును హైకోర్టు కొట్టివేసింది. తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలన్నది తల్లిదండ్రుల ఐచ్ఛికమని, వారు కోరుకుంటే అక్కడ మాతృభాషలో చదువుకు అవకాశం ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. మరో వైపు ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని, వీలైతే 8వ తరగతి వరకు ఉంటే మంచిదని జాతీయ నూతన విద్యా విధానం పేర్కొంది. ఇంకా గత ఆగస్టులో 50 మంది లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ సెక్షన్లు రద్దు చేస్తామని ప్రభుత్వం జీవో 25 జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో కొత్త చట్టంలో ఏమి నిబంధనలుంటాయో వేచిచూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!