సొమ్ము రికవరీ ఎన్నడో?
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో సొమ్ము రికవరీ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు కలిపి ఒకటి, మిగతా 8 పాత ఉమ్మడి జిల్లాలకు కలిపి మరో 8 డీసీసీబీలు ఉన్నాయి. వీటిలో
డీసీసీబీల్లో అడ్డగోలుగా రుణాల పంపిణీ
నల్గొండ, వరంగల్, ఖమ్మం బ్యాంకుల్లో రూ.కోట్ల కుంభకోణాలు
ఇంకా పెండింగ్లోనే చర్యలు
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు
ఈనాడు, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో సొమ్ము రికవరీ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు కలిపి ఒకటి, మిగతా 8 పాత ఉమ్మడి జిల్లాలకు కలిపి మరో 8 డీసీసీబీలు ఉన్నాయి. వీటిలో నల్గొండ, వరంగల్, ఖమ్మం డీసీసీబీల్లో పాలకవర్గాలకు ఎన్నికైనవారు రాజకీయ నాయకుల అండతో విచ్చలవిడిగా రుణాలిప్పించగా.. అవి తిరిగి వసూలు కాలేదు. రూ.కోట్ల కుంభకోణాలు జరిగినా.. విచారణలు, చర్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా బ్యాంకులో రూ.6 కోట్ల దాకా గోల్మాల్ జరిగిందని సహకార శాఖ విచారణలో తేలింది. రికవరీ చేయవద్దంటూ పాలకవర్గంలోని కొందరు హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ బ్యాంకులో జరిగిన అక్రమాల్లో పాలకవర్గానికి సిబ్బంది కూడా సహకరించారని, వారిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ‘రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు’(టెస్కాబ్) నియమించిన కమిటీ తాజాగా తేల్చింది. దీంతో సిబ్బందిపై వేటు వేయాలని డీసీసీబీ ప్రస్తుత పాలకవర్గానికి టెస్కాబ్ లేఖ రాసింది. నల్గొండ డీసీసీబీలో అవినీతి సొమ్ము ఇంకా రికవరీ కాలేదు. వరంగల్ డీసీసీబీలో గత పాలకవర్గం రూ.7 కోట్ల వరకూ అవినీతికి పాల్పడటంతో దాన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సొమ్ము ఇంకా రికవరీ కాలేదు. ఈ వ్యవహారంలోనూ కోర్టు స్టే ఉంది.
తనఖా రుణాలపై దృష్టి
కొంతకాలంగా వరంగల్, మహబూబ్నగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల డీసీసీబీల్లో రుణాల పంపిణీ పెద్దఎత్తున జరుగుతోంది. ఇది పారదర్శకంగా జరుగుతోందా, అర్హులకే ఇస్తున్నారా, ఒకవేళ రుణాలు తిరిగి కట్టకపోతే.. తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తే అంత సొమ్ము తిరిగి వస్తుందా అనేది సరిగా పరిశీలిస్తున్నారా అనే అంశంపై నాబార్డు తాజాగా దృష్టి పెట్టింది. కొన్ని డీసీసీబీల్లో ఆస్తుల తనఖా రుణాలు ఇటీవల బాగా పెరిగాయి. తనఖా పెట్టే ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీసీసీబీలకు టెస్కాబ్ సూచించింది.
రిజర్వు బ్యాంకు చర్యలు నిబంధనలు ఉల్లంఘిస్తే..
డీసీసీబీల ఆర్థిక కార్యకలాపాలన్నీ కచ్చితంగా రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) నిబంధనల ప్రకారమే జరగాలని, తేడాలుంటే సాధారణ వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే కఠిన చర్యలుంటాయని కేంద్రం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని డీసీసీబీలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కనిపించడం లేదని సహకార బ్యాంకు అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. పాలకవర్గాలు తీవ్ర ఒత్తిడి తెచ్చి.. తమకు నచ్చినవారికి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇప్పిస్తున్నాయని, భవిష్యత్తులో అవి వసూలు కాకపోతే ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం డీసీసీబీ రోజువారీ విధుల్లో పాలకవర్గ సభ్యులు జోక్యం చేసుకోకూడదు. డీసీసీబీ కార్యనిర్వహణాధికారి(సీఈవో) పర్యవేక్షించాలి. కానీ, కొన్ని జిల్లాల్లో పాలకవర్గాల సభ్యులు నియంత్రిస్తున్నారు. డీసీసీబీల తీరుపై నాబార్డు ఏటా ఇచ్చే నివేదికల ఆధారంగా రిజర్వు బ్యాంకు, రాష్ట్ర సహకార శాఖ విచారణ జరిపి చర్యలు తీసుకుంటాయి. వరంగల్, ఖమ్మం డీసీసీబీల్లో అవినీతి, నిధుల రికవరీపై విచారణ నివేదిక అందిందని సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ వీరబ్రహ్మయ్య ‘ఈనాడు’కు చెప్పారు. స్టే ఎత్తివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశామని, అది తొలగిన తరవాత సొమ్ము రికవరీ చేస్తామని తెలిపారు. నల్గొండ డీసీసీబీపై విచారణ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?