వద్దు నిర్లక్ష్యం
కొవిడ్ మూడోదశ ఉద్ధృతి క్రమేణా పెరిగిపోతోంది. రాష్ట్రంలో రోజుకు దాదాపుగా 3000-3500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 24 వేల మందికి పైగా కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈనెల 1 నుంచి 12 వరకూ గణాంకాలను పరిశీలిస్తే..
3-5 రోజులైనా తీవ్రత తగ్గకపోతే ఆసుపత్రిలో చేరక తప్పదు
స్వల్ప లక్షణాలుంటే మాత్రం ఇంటి వద్దే చికిత్స
10 రోజుల్లోపే రెమ్డెసివిర్ అందజేస్తే మెరుగైన ఫలితం
కరోనా చికిత్సపై ఐసీఎంఆర్- ఎయిమ్స్ మార్గదర్శకాలు
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ మూడోదశ ఉద్ధృతి క్రమేణా పెరిగిపోతోంది. రాష్ట్రంలో రోజుకు దాదాపుగా 3000-3500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 24 వేల మందికి పైగా కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈనెల 1 నుంచి 12 వరకూ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరికలు 3 శాతం పెరిగాయి. తొలుత స్వల్ప లక్షణాలతో మొదలైనా.. కొందరిలో 5-6 రోజుల్లో లక్షణాలు తీవ్రమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో చికిత్సపై ప్రజలకు అవగాహన అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాల తీవ్రతను ఎలా గుర్తించాలి? ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలి? ఎవరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి? తదితర మార్గదర్శకాలను ఐసీఎంఆర్-దిల్లీ ఎయిమ్స్లు సంయుక్తంగా విడుదల చేశాయి.
కొవిడ్పై నిర్లక్ష్యం తగదు
కొవిడ్ను ఐసీఎంఆర్ మూడు దశలుగా విభజించింది. స్వల లక్షణాలతో కూడిన వ్యాధి.. మధ్యస్థ వ్యాధి.. తీవ్ర వ్యాధిగా పరిగణించి.. జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వీటిని పాటించడం ద్వారా కొవిడ్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
స్వల్ప వ్యాధి
లక్షణాలు: జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి
చికిత్స: ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి. తేలికపాటి దగ్గు, జ్వరం ఐదు రోజులకు మించి వస్తుంటే.. వైద్యుడి సలహా మేరకు ఔషధాలను వాడాలి.
జాగ్రత్తలు
* భౌతిక దూరం పాటించాలి.
* ఇంట్లోనూ మాస్కు ధరించాలి.
* నీళ్లు తగినంతగా తాగాలి.
* రోజుకు 3సార్లు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ పరీక్షించుకోవాలి.
ఎప్పుడు అత్యవసరం?
* శ్వాస పీల్చుకోవడం కష్టమైనప్పుడు
* ఆక్సిజన్ శాతం 93 కంటే తగ్గినప్పుడు
* జ్వరం, దగ్గు తీవ్రమైనప్పుడు
* 5 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోతే
* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారైతే 3 రోజుల కంటే ఎక్కువగా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు
ఎవరికి ఎక్కువ ముప్పు?
60 ఏళ్లు దాటినవారు, మధుమేహులు, ఊబకాయులు, గుండె రక్తనాళాల జబ్బు, అధిక రక్తపోటు హెచ్ఐవీ, క్షయ, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ జబ్బులు, మెదడు, రక్తనాళాల జబ్బులతో చికిత్స పొందుతున్నవారు
మధ్యస్థ వ్యాధి
లక్షణాలు: నిమిషానికి 24 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, ఆయాసం, రక్తంలో ఆక్సిజన్ 90-93 శాతం మధ్యలో ఉండడం.
చికిత్స: * ఈ తరహా లక్షణాలున్నవారికి ఆసుపత్రిలో చికిత్స అందించాలి.
* రక్తంలో ఆక్సిజన్ శాతం కనీసం 92-96 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.
* కృత్రిమ ప్రాణవాయువును అందించాలి.
* స్టెరాయిడ్ చికిత్సను ఆసుపత్రిలోనే ప్రారంభించి, అక్కడే ముగించాలి. ఇంటికెళ్లాక కూడా స్టెరాయిడ్ వాడే విధానానికి స్వస్తి పలకాలి.
* దీర్ఘకాలం, అవసరానికి మించి స్టెరాయిడ్ చికిత్సను వినియోగించడం వల్ల మ్యూకర్ మైకోసిస్ తదితర జబ్బుల బారినపడే ప్రమాదముంది.
జాగ్రత్తలు
* శ్వాస తీరు ఎలా ఉందో పరీక్షిస్తూ ఉండాలి.
* ఆరోగ్య పరిస్థితి క్రమేణా క్షీణిస్తుంటేనే.. ఛాతీ ఎక్స్రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాలి.
* 2-3 రోజులకోసారి సీఆర్పీ, డీ డైమర్, షుగర్, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు చేయిస్తుండాలి.
తీవ్ర వ్యాధి
లక్షణాలు: నిమిషానికి 30 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, తీవ్ర ఆయాసం, రక్తంలో ఆక్సిజన్ శాతం 90 కంటే తగ్గిపోవడం.
చికిత్స: * ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాలి.
* పరికరాల ద్వారా ప్రాణవాయువును ఇవ్వాలి.
* వైద్యుడి సూచనల మేరకు స్టెరాయిడ్ ఔషధాలను, యాంటీ ఇన్ఫ్లమేటరీ చికిత్సను అందించాలి.
జాగ్రత్తలు
* నిర్ధారణ పరీక్షలను రోజూ చేయించనక్కర్లేదు. 2-3 రోజులకొకసారి సీఆర్పీ, డీ డైమర్, షుగర్, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు చేయిస్తుండాలి.
* దగ్గు 2-3 వారాల కంటే ఎక్కువగా వేధిస్తుంటే.. క్షయ ఇతర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించడం ముఖ్యం.
రెమ్డెసివిర్ ఎప్పుడు?
లక్షణాలు కనిపించిన 10 రోజుల్లోపు రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలి. ఇది మధ్యస్థ నుంచి తీవ్ర లక్షణాలున్న వారికి, ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్న వారికే ఇవ్వాలి. ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి, ప్రాణవాయువు అవసరం లేని వారికి ఇది ఇవ్వనక్కర్లే ేదు. వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న వారికి రెమ్డెసివిర్ ఇవ్వకూడదు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు కిడ్నీ, లివర్ పరీక్షలు చేయించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!