ఆటో/క్యాబ్ ఎంత సురక్షితం?
మాదాపూర్లోని మైండ్స్పేస్ కూడలి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ‘అభయ’ను ఇద్దరు ఆగంతుకులు కారులో అపహరించుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టిన నేపథ్యంలో ఏడేళ్ల క్రితం ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్/నా వాహనం సురక్షితం’ అనే బృహత్కార్యానికి తెర లేచింది.
అంతంతగానే ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ కార్యక్రమం
ప్రైవేటు రవాణా వాహనాలపై నిలిచిన నిఘా
ముందు జాగ్రత్త మేలనే అభిప్రాయాలు
మహిళలు క్యాబ్ లేదా ఆటో ఎక్కితే ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ఇల్లుచేరొచ్చు.. వాటిల్లోని క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే డ్రైవర్, వాహనం సమగ్ర సమాచారం సెల్ఫోన్లో ప్రత్యక్షమవుతుంది.. ఏమాత్రం అనుమానమొచ్చినా ఎస్ఓఎస్ మీట నొక్కితే పోలీసులకు ఇట్టే సమాచారం చేరిపోతుంది.. క్షణాల్లో పోలీసు గస్తీ వాహనం వచ్చి వాలిపోతుంది..’
.. 2014లో సైబరాబాద్ పోలీసులు మహిళా ప్రయాణికులకు ఇచ్చిన అభయమిది.
ప్రయాణం చేస్తున్నప్పుడు అనుమానమొస్తే స్కాన్ చేసేందుకు క్యూఆర్ కోడ్ కానరాదు.. కనిపించినా దాని గడువు ముగిసిపోయి ఉంటోంది.. ఒకవేళ దాన్ని స్కాన్ చేస్తే వచ్చే డ్రైవర్ ఫొటోకు ఆ సమయంలో వాహనం నడిపే డ్రైవర్కు పోలికే ఉండదు....’
... ఇదీ ప్రస్తుతం ప్రైవేటు రవాణా వాహనాల్లోని భద్రత పరిస్థితి.
ఈనాడు, హైదరాబాద్: మాదాపూర్లోని మైండ్స్పేస్ కూడలి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ‘అభయ’ను ఇద్దరు ఆగంతుకులు కారులో అపహరించుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టిన నేపథ్యంలో ఏడేళ్ల క్రితం ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్/నా వాహనం సురక్షితం’ అనే బృహత్కార్యానికి తెర లేచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే క్యాబ్లు, ఆటోలన్నింటికీ పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్లను కేటాయించే ప్రణాళిక రూపుదిద్దుకొంది. అలా రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో వాహనం ధ్రువపత్రాలతోపాటు వాహన యజమాని, డ్రైవర్ ఆధారాలన్నింటితో డేటా తయారు చేశారు. అనంతరం ప్రతి వాహనంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్టిక్కర్లను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఒంటరి మహిళా ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించేందుకు డ్రైవర్లు జంకేవారు. తమ వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయనే భయం వారిలో కనిపించేది. ఏడాదికోసారి రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించేవారు. తద్వారా గ్రేటర్ పరిధిలో మహిళల ప్రయాణానికి పోలీసులు అభయమివ్వగలిగారు. ఆ సమయంలో క్యాబ్లకు పోలీసు రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చును సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) భరించింది. థింక్మాక్స్ కంపెనీ ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు డేటాను నిక్షిప్తం చేసే ప్రక్రియకు సహకారం అందించింది. గ్రేటర్లో దాదాపు 1.1లక్షల ఆటోలకు, 80వేల క్యాబ్లకు పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్లను కేటాయించగలిగారు. ట్రాఫిక్ పోలీసులు తరచూ ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి కొరడా ఝుళిపించడంతో దాదాపు వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్లు జరిగేవి. అలా క్రమేపీ నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, నల్గొండలకూ ఈ ప్రణాళిక విస్తరించింది.
పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..
2019 వరకు ఈ ప్రక్రియ సజావుగానే కొనసాగింది. కరోనా మహమ్మారి దెబ్బతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత పోలీసులు పట్టించుకోవడం మానేయడంతో కథ మొదటికొచ్చింది.
* ప్రస్తుతం చాలా వరకు వాహనాల్లో పోలీసు రిజిస్ట్రేషన్ స్టిక్కర్లే కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా 2020తో గడువు ముగిసి కనిపిస్తున్నాయి. మొత్తం వాహనాల్లో 85-90శాతం మంది డ్రైవర్లు ఆ ఊసే మరిచిపోయారు.
* ఓలా, ఉబర్ కార్యకలాపాలు ఊపందుకోవడంతోపాటు ఎస్సీఎస్సీ సంస్థ పక్కకు తప్పుకోవడంతో రిజిస్ట్రేషన్ భారం మొత్తం డ్రైవర్లపైనే పడింది. దీంతో పునరుద్ధరణ చేయించుకోవడం మానేశారు. పోలీసులూ ప్రత్యేక డ్రైవ్లు మరిచిపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.
* ప్రస్తుతం పోలీసుల రికార్డుల్లో ఉన్న వాహనాల వివరాలతో పోల్చితే చాలా వాహనాల యజమానులు, డ్రైవర్లు మారిపోయారు. కొత్త వారి వివరాలేవీ పోలీసుల డేటాలో లేకుండా పోయాయి. ఒకవేళ ఏదైనా వాహనంపై ఫిర్యాదొస్తే గతంలోలా తక్షణమే వివరాలు తెలిసే పరిస్థితి లేదు.
* విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వాహనాల వివరాలూ అందుబాటులో లేకుండా పోయాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే బదులు ముందు జాగ్రత్త పడటం మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు