మేడారం భక్తకోటికి సకల సౌకర్యాలు
ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రంగం సిద్ధమవుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే ఈ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర గిరిజన, మహిళా
ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మహాజాతర
రూ. 75 కోట్లతో అభివృద్ధి పనులు
గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రంగం సిద్ధమవుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే ఈ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోటిన్నర మందికి పైగా భక్తులొస్తారని ఆమె అన్నారు. అతిపెద్దదైన ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడం బాధాకరమన్నారు. జాతర ఏర్పాట్లను ఆమె ‘ఈనాడు’కు వివరించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
* మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఉత్సవాలకు రూ. 75 కోట్లు మంజూరు చేశారు. ఈ నెలాఖరుకు పనులన్నీ పూర్తి చేస్తాం. ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ సీఎం కేసీఆర్, మంత్రులు ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరినా స్పందన లేదు. ఈసారి జాతరకు రావాలని కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తాం. సీఎం కేసీఆర్ వచ్చే నెల 18న జాతరకు వచ్చే అవకాశం ఉంది. రామప్పకు యునెస్కో గుర్తింపు వల్ల ఈసారి దేశ, విదేశీ భక్తుల తాకిడి పెరుగుతుందని భావిస్తున్నాం.
* భక్తులకు అరగంటలోనే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రముఖుల పాస్లకూ నిర్ణీత సమయం (టైమింగ్ స్లాట్) ఇస్తాం. ట్రాఫిక్ నియంత్రణకు ప్రధాన రహదారులతో పాటు ఎడ్లబండ్ల బాటలను సైతం తీర్చిదిద్దుతున్నాం. దాదాపు 8 వేల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడికక్కడే మంచినీటి సరఫరా ఉంటుంది. వైద్యశిబిరాలూ నిర్వహిస్తాం.
* పెద్ద ఎత్తున స్నానఘట్టాలు నిర్మించాం. జంపన్నవాగు పొడవునా కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. షెడ్లతో పాటు మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు ఉంటాయి. భోజనాల కోసం కమ్యూనిటీ డైనింగ్ హాలును నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అతిథిగృహాలకు తోడు, మరో భారీ అతిథిగృహాన్ని నిర్మిస్తున్నాం.
* జాతరకు శాశ్వత సదుపాయాల కల్పనకు మరో 200 ఎకరాలు తీసుకోవాలని సీఎం చెప్పారు. దీని కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జాతర సందర్భంగా భూయజమానులు ఎవరూ నష్టపోరాదని, 1100 మంది రైతులకు నేరుగా ఎకరానికి రూ. 6 వేల చొప్పున సొమ్ము ఇస్తున్నాం.
* భక్తులు కరోనా నిబంధనలను విధిగా పాటించాలి. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రభుత్వం సైతం మాస్కులు పంపిణీ చేస్తుంది.
మేడారం జాతర తేదీలు ఇవే...
ఫిబ్రవరి 16 - సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలకు తీసుకొస్తారు.
17వ తేదీ - చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకొస్తారు.
18 - సమ్మక్క-సారలమ్మలకు ప్రజలకు మొక్కులు.
19 - అమ్మవార్ల వన ప్రవేశం, జాతర ముగింపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి