అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ అరెస్టు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో సంపన్నులు, యువకులకు కొకైన్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాకు కొకైన్ సరఫరా
తొలిసారిగా వినియోగదారులూ అరెస్టు
నిందితుడు టోనీ (ముసుగు వేసిన వ్యక్తి) నుంచి స్వాధీనం చేసుకున్న కారు, సెల్ఫోన్లను చూపిస్తున్న సీపీ ఆనంద్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో సంపన్నులు, యువకులకు కొకైన్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ముంబయి కేంద్రంగా నాలుగేళ్లుగా డ్రగ్స్ రాకెట్ను నిర్వహిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చామని, అతడి నుంచి కారు, 10 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుని గురువారం జైలుకు తరలించామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉత్తర మండలం పోలీసులు పది రోజులుగా ముంబయిలో మకాం వేశారని, అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారని వెల్లడించారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్లో తొమ్మిది మంది డ్రగ్ వినియోగదారులను కూడా అరెస్టు చేశామని వివరించారు. దక్షిణాఫ్రికాలో ఉంటున్న స్టార్బాయ్ అనే వ్యక్తి నుంచి నౌకల ద్వారా డ్రగ్స్ టోనీకి చేరుతున్నాయన్నారు.
దుస్తుల వ్యాపారం పేరుతో ముంబయికి..
నైజీరియాకు చెందిన టోనీ అబియా మార్షా (37) తొమ్మిదేళ్ల క్రితం వ్యాపార వీసాతో ముంబయికి వచ్చాడు. తూర్పు అంధేరిలో ఓ చిన్న గదిలో నివసిస్తూ, అక్కడే ఉన్న నైజీరియన్లతో పరిచయం పెంచుకున్నాడు. లోదుస్తులు కొని నైజీరియాకు ఎగుమతి చేసేవాడు. అనంతరం మీరా భాండియార్, వాసైవిరార్ ప్రాంతాల్లోని నైజీరియన్ల వద్దకు వెళ్లాడు. వారిలో కొంతమంది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండడడంతో తానూ అదేబాట పట్టాడు. 2017 నుంచి సొంతంగా డ్రగ్స్ తెప్పించుకోవడం, నలుగురు ఏజెంట్లను నియమించుకోవడం, వారి ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్ ప్రాంతాలకు కొకైన్ సరఫరా చేయడం మొదలు పెట్టాడు. ముంబయిలో నైజీరియన్ యువతి లోవత్ యూసుఫ్తో సహజీవనం చేస్తున్నాడు. తన ఏజెంట్లు ఇమ్రాన్ బాబూ షేక్, నూర్మహ్మద్ ఖాన్ల ద్వారా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఆఫ్రికా నుంచి గ్రాము కొకైన్ రూ.3 వేలకు తెప్పించి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తున్నాడు.
ఎక్కడా కనిపించడు.. అంతా ఇంటర్నెట్ ఫోన్
టోనీ రూ.కోట్లలో కొకైన్ వ్యాపారం నిర్వహిస్తున్నా, తాను బయటపడడు. తన ఏజెంట్లు ఇమ్రాన్ బాబూ షేక్, నూర్ మహ్మద్ ఖాన్, అల్తాఫ్, పర్వేజ్, రహమత్, ఇర్ఫాన్, ఫిర్దోస్లకు నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కనిపించలేదు. డ్రగ్స్ విక్రయించినందుకు వారికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కమీషన్ ఇచ్చేవాడు. వారితో ఎప్పుడూ ఇంటర్నెట్ ఫోన్లోనే మాట్లాడేవాడు. హైదరాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ బాబూ షేక్, నూర్మహ్మద్లను అరెస్టు చేయగానే.. అతడి ఫోన్లలో సంభాషణలను తీసేశాడు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఇంటర్నెట్ ఫోన్ నెట్వర్క్ సంస్థలను సంప్రదించి అతడి కదలికలను తెలుసుకుని పట్టుకోగలిగారు.
వినియోగదారుల్లో బడా వ్యాపారులు
మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ సర్కారు కఠినంగా వ్యవహరిస్తోందన్న సందేశం బలంగా వెళ్లేందుకు పోలీసులు తొలిసారిగా డ్రగ్స్ వినియోగదారులను అరెస్టు చేశారు. టోనీపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు అతడిచ్చిన సమాచారం ఆధారంగా హిమాయత్నగర్లో ప్రముఖ రియల్టర్ నిరంజన్కుమార్ జైన్, బంజారాహిల్స్లో ఉంటున్న గుత్తేదారు శాశ్వత్జైన్, గౌలిపురా నివాసి యజ్ఞానంద్ అగర్వాల్తోపాటు దండు సూర్యసుమంత్రావు, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినీడి సాగర్, అలఘాని శ్రీకాంత్, గోడి సుబ్బారావులను అరెస్టు చేశారు. టోనీ నుంచి నిరంజన్కుమార్ జైన్ 30 సార్లు కొకైన్ తీసుకున్నాడని సీవీ ఆనంద్ తెలిపారు. నిరంజన్జైన్కు రూ.వెయ్యి కోట్ల వ్యాపారాలున్నాయని, మిగిలినవారు కూడా రూ.వందల కోట్లలో వ్యాపారాలు చేస్తున్నారని వివరించారు. నిరంజన్జైన్, శాశ్వత్జైన్లు వారి డ్రైవర్లు, ఆఫీస్బాయ్ల చరవాణులతో టోనీకి డిజిటల్ రూపంలో సొమ్ము చెల్లిస్తూ, ఏజెంట్ల ద్వారా కొకైన్ తీసుకుంటున్నారని చెప్పారు. డ్రగ్స్ వాడితే సినిమా పరిశ్రమకు చెందిన వారినీ వదలబోమని సీపీ అన్నారు. మరో నలుగురు నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)