రెండు భాగాలుగా ఒక్కో పాఠ్య పుస్తకం
రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం(2022-23) ఒక్కో సబ్జెక్టుకు రెండు పాఠ్య పుస్తకాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం
ప్రభుత్వ తాజా నిర్ణయంతో బడి సంచి బరువు పెరగకుండా మార్గం
భాషా సబ్జెక్టులు తప్ప మిగిలినవి రెండుగా ముద్రణ
సర్కారు బడుల్లో విద్యార్థులకు పంపిణీ
విక్రయ పుస్తకాలు మాత్రం యథావిధిగానే
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం(2022-23) ఒక్కో సబ్జెక్టుకు రెండు పాఠ్య పుస్తకాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. టర్మ్-1కు ఒక పుస్తకం, టర్మ్-2కు మరో పాఠ్య పుస్తకాన్ని పంపిణీ చేస్తారు. వచ్చే ఏడాది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెడుతున్న నేపథ్యంలో 1-7 తరగతుల విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒకే పాఠ్య పుస్తకం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉండాలని, ఒక వైపు తెలుగు, మరో వైపు ఆంగ్లం ఉండేలా ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రకరకాల పుస్తకాలు, మంచినీటి బాటిళ్లు, ఇతరత్రా సామగ్రితో బడి సంచి బరువు అధికంగా ఉంటోంది. ఈ విషయం సర్వేలోనూ స్పష్టమైంది. ఈ క్రమంలో తెలుగు, ఆంగ్లం రెండు భాషలతో పుస్తకాలను ముద్రించి ఇస్తే సంచి బరువు భారీగా పెరుగుతుందని, అది అంతిమంగా విద్యార్థుల శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం 1-10 తరగతులకు పరీక్షలు కూడా సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)-1, సమ్మేటివ్ అసెస్మెంట్-2 పేరిట జరుపుతున్నారు. కాకపోతే ఎస్ఏ-1కు సగం సిలబస్ ఉంటుంది. ఎస్ఏ-2కు మొత్తం సిలబస్తో పరీక్షలు జరుపుతారు. అదేవిధంగా ఎస్ఏ-1 సిలబస్కు ఒక పాఠ్య పుస్తకం, ఎస్ఏ-2కు మిగిలిన పాఠ్య ప్రణాళికతో మరో పుస్తకాన్ని టర్మ్-1, 2 పేరిట విద్యా శాఖ ముద్రించి ఇవ్వనుంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ)లో ఫైనల్ ప్రూఫ్ను సిద్ధం చేస్తున్నారు. అధికారులు తుది సీడీలను అప్పగిస్తే త్వరలోనే ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణా విభాగం పుస్తకాల ముద్రణ ప్రారంభించనుంది.
భాషేతర పుస్తకాలు మాత్రమే
ఒకటి, రెండు తరగతులకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులు, 3-5వ తరగతి వరకు వాటికి అదనంగా పరిశీలన విజ్ఞానం, గణితం సబ్జెక్టు ఉంటుంది. 6, 7 తరగతుల్లో తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు గణితం, జనరల్ సైన్స్, సాంఘికశాస్త్రం సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో భాషాపరమైన తెలుగు, ఆంగ్లం, హిందీ లాంటివి ఏ మాధ్యమం వారికైనా పుస్తకాలు ఒకటే. ఇక మిగిలిన సబ్జెక్టు పుస్తకాలను మాత్రమే రెండు మాధ్యమాల్లో, రెండు పుస్తకాలుగా ముద్రించి ఇస్తారు.
మరో 50 లక్షల పుస్తకాలు అధికం!
ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో 1-10 తరగతులు చదివే సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు 1.45 కోట్ల పాఠ్య పుస్తకాలను అందజేస్తున్నారు. ఇప్పుడు రెండు పుస్తకాల విధానం వల్ల 1-7 తరగతుల కోసం కనీసం మరో 50 లక్షలు పుస్తకాలను అధికంగా ముద్రించాల్సి ఉంటుంది. ఇక ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు వాటిని గతంలో మాదిరిగానే ముద్రిస్తారు. ప్రైవేట్లో ప్రస్తుతం 97 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..