కొత్తగా 4,207 కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజులోనే కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,22,403కు పెరిగింది. ఒకేరోజున ఇంత
3.5 శాతంగా పాజిటివిటీ రేటు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజులోనే కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,22,403కు పెరిగింది. ఒకేరోజున ఇంత భారీ సంఖ్యలో కొత్త పాజిటివ్లు నమోదవడం గత ఏడాది మే తర్వాత ఇదే తొలిసారి. ఇదే క్రమంలో నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఒక్కరోజే 1,20,215 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.5 శాతంగా నమోదైంది. మహమ్మారి బారినపడి మరో ఇద్దరు మరణించారు. ఈ నెల 20న సాయంత్రం 5.30గంటల వరకూ నమోదైన కొవిడ్ సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసింది.
జిల్లాల్లో పెరుగుతున్న కేసులు..
కరోనాకు చికిత్స పొంది తాజాగా 1,825 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1,645 కేసులు నమోదవగా అన్ని జిల్లాల్లోనూ ఒక్కరోజు వ్యవధిలోనే సుమారు 30-40 శాతం కేసులు పెరిగాయి. మేడ్చల్ మల్కాజిగిరి(380), రంగారెడ్డి(336), హనుమకొండ(154), సంగారెడ్డి(107), ఖమ్మం(98), భద్రాద్రి కొత్తగూడెం(91), పెద్దపల్లి(87), వికారాబాద్(86), కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో 84 చొప్పున, మహబూబ్నగర్(81), మంచిర్యాల(80), యాదాద్రి భువనగిరి(78), నిజామాబాద్(74), సిద్దిపేట(70), మహబూబాబాద్(63), నాగర్కర్నూలు, సూర్యాపేట జిల్లాల్లో 52 చొప్పున పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 3,18,569 కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. ఇందులో తొలిడోసు పొందినవారు 71,875 మంది కాగా రెండోడోసు స్వీకరించినవారు 2,31,672 మంది, ముందస్తు నివారణ డోసు తీసుకున్నవారు 15,022 మంది ఉన్నారు.
ఏపీలో 12,615 కేసులు... అయిదుగురి మృతి
ఈనాడు, అమరావతి:ఏపీలో 20 రోజుల్లో కరోనా పాజిటివిటీ శాతం 26శాతానికి చేరింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల మధ్య 47,420 నమూనాలను పరీక్షిస్తే 12,615 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అయిదుగురు మృతిచెందారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కరోనా
ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కరోనా వైరస్ సోకింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్గా తేలినట్లు ఆయన గురువారం ఉదయం ట్విటర్ ద్వారా వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్లో ఏకాంతంగా ఉంటున్నట్లు చెప్పారు.
ఈ నెల 31 వరకు కరోనా ఆంక్షలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాని నియంత్రణకు చేపట్టిన ఆంక్షల అమలును ఈ నెల 31వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు (జీవో నం.12) జారీచేసింది. ఈ నెలాఖరు వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది.
రెండోడోసులో కరీంనగర్ ప్రథమస్థానం
కరీంనగర్ వైద్య విభాగం, న్యూస్టుడే: కరోనా రెండో డోసు ఇవ్వడంలో కరీంనగర్ జిల్లా మొదటిస్థానం పొందింది. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కరీంనగర్ జిల్లాలో 97 శాతం మంది రెండో డోసు టీకా తీసుకున్నారు. 89 శాతంతో ఖమ్మం, యాదాద్రి, భువనగిరి జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 56 శాతంతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!