మీ సత్తా ఎంత?
బీటెక్లో చేరిన విద్యార్థులు ఆ చదువుకు తగ్గట్లు నైపుణ్యాలు సాధించలేకపోతే వారి భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. తొలి ఏడాది నుంచే వారు ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఎంత మేరకు అలవర్చుకుంటున్నారో
ఇంజినీరింగ్ విద్యార్థుల సామర్ధ్యాలను అంచనా వేసే పోర్టల్
‘స్టాన్ఫర్డ్’ సహకారంతో రూపొందించిన ఏఐసీటీఈ
ఈనాడు, హైదరాబాద్: బీటెక్లో చేరిన విద్యార్థులు ఆ చదువుకు తగ్గట్లు నైపుణ్యాలు సాధించలేకపోతే వారి భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. తొలి ఏడాది నుంచే వారు ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఎంత మేరకు అలవర్చుకుంటున్నారో పరీక్షిస్తే.. తాము ఇంకెన్ని అంశాలు నేర్చుకోవాలి?.. వేటిలో వెనుకబడ్డామో తెలుసుకోగలిగితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ ఆలోచనతోనే అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)- స్టూడెంట్ లెర్నింగ్ ఎబిలిటీ పేరిట ఆ సౌలభ్యానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులతోపాటు అధ్యాపకులు సైతం తమ నైపుణ్యాలను పరీక్షించుకునేందుకు ఓ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది.
స్టాన్ఫర్డ్లోనూ అమలు..
ఈ ప్రాజెక్టును అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం తమ విద్యార్థులకు అమలు చేసింది. తర్వాత దాన్ని అమెరికా, రష్యా, చైనాతోపాటు భారత్లో 50 కళాశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. తర్వాత ఆ వర్సిటీ భారత్లోని ఇంజినీరింగ్ విద్యార్థుల్లో లోపాలను గుర్తించి... వాటిని తొలగించేందుకు పలు సిఫారసులు చేసింది. వాటిని అధ్యయనం చేసిన ఏఐసీటీఈ నేషనల్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ (ఎన్పీఐయూ) సంయుక్త భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రారంభించింది. ఇటీవలే దీన్ని అందుబాటులోకి తీసుకురాగా, 85 వేల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో 58 వేల మంది తమను పరీక్షించుకున్నారు.
పరీక్షించుకోవాల్సిన అంశాలు...
యూజీతోపాటు పీజీ విద్యార్థులు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. విద్యార్థుల్లో ఆప్టిట్యూడ్ను పరీక్షించేలా సమస్యలను గుర్తించడం, పరిష్కరించడం, క్రిటికల్ థింకింగ్, ఇన్నోవేషన్ తదితర వాటిని పెంచేలా ఉన్నత స్థాయి ఆలోచనా నైపుణ్యాలు (హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్- హెచ్ఓటీఎస్), కోర్ సబ్జెక్టులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, సీఎస్ఈ, గణితం, భౌతిక, రసాయనశాస్త్రాలు, వివిధ డిమాండ్ ఉన్న అంశాలైన కృత్రిమ మేధ, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ తదితర అంశాలను పరీక్షిస్తారు.
ప్రస్తుతం పోర్టల్లో 2 లక్షల బహుళ ఐచ్ఛిక ప్రశ్నలున్నాయి. వాటిని సాధన చేయవచ్చు. ఉదాహరణకు బీటెక్లో చేరిన విద్యార్థి తాము చదివే ఏడాదికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొని తమ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. పరీక్ష పూర్తయిన తర్వాత నివేదిక అందుతుంది.
* పోర్టల్ చిరునామా: www.aslap.aicteindia.org
దీని ద్వారా ఆయా కళాశాలలు, అధ్యాపకులు, విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రశ్నలు ఆంగ్లంలో ఉన్నా వాటిని ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా తీసుకురానున్నారు. నూతన జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు