అలహాబాద్ నరహంతకుడికి మద్రాసు శిక్ష!
స్కాట్లాండ్కు చెందిన కర్నల్ జేమ్స్ జార్జ్ నీల్ ఈస్టిండియా కంపెనీలో సైనికుడిగా చేరి, మద్రాసు రెజిమెంట్లో 30 ఏళ్లపాటు పనిచేశాడు. రెండో బర్మా యుద్ధం సందర్భంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అనంతరం ఐరోపాకు వెళ్లి
‘భారతదేశం సంస్థానాల చిక్కుముడి! ప్రాంతాలు, కులాలు, మతాలుగా చీలిపోయింది. ఎవరి ప్రయోజనాలు వారివే. పక్క రాజ్యంలో ఏం జరిగినా పట్టించుకోరు’ అని బ్రిటిషర్లు భారతీయులపై వేసిన అపవాదును చెన్నపట్నం (చెన్నై) వాసులు పటాపంచలు చేశారు. ఉత్తరాదిన ఉన్న అలహాబాద్లో ప్రథమ స్వాతంత్య్ర పోరాట సమయంలో భారతీయ సిపాయిలను ఊచకోత కోసిన తెల్లవాడి విగ్రహాన్ని తమ నగరంలో ఏర్పాటు చేయటాన్ని నిరసించారు. సత్యాగ్రహం చేసి మరీ... ఆంగ్లేయుల హయాంలోనే ఆంగ్లేయుడి విగ్రహాన్ని తొలగింపజేశారు.
స్కాట్లాండ్కు చెందిన కర్నల్ జేమ్స్ జార్జ్ నీల్ ఈస్టిండియా కంపెనీలో సైనికుడిగా చేరి, మద్రాసు రెజిమెంట్లో 30 ఏళ్లపాటు పనిచేశాడు. రెండో బర్మా యుద్ధం సందర్భంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అనంతరం ఐరోపాకు వెళ్లి క్రిమియన్ యుద్ధంలో పాల్గొన్నాడు. 1857లో కర్నల్ హోదాలో చెన్నై తిరిగొచ్చాడు. అదే సమయంలో దేశంలో ఉత్తరాదిన తొలి స్వాతంత్య్ర పోరాటం జోరుగా సాగుతోంది. కాన్పుర్, అలహాబాద్, అవధ్, మేరఠ్ సంస్థానాలను సిపాయిలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ పోరాటాన్ని అణచివేయడానికి దక్షిణాది నుంచి దిల్లీకి పంపిన దళాల్లో నీల్ సారథ్యం వహించిన మద్రాస్ రెజిమెంట్ ప్రధానమైంది. వీరు మార్గమధ్యలో ఉండగానే కాన్పుర్లో కొందరు బ్రిటిష్ సైనికులు, వారి కుటుంబ సభ్యులు తిరుగుబాటుదారుల చేతిలో హతమయ్యారు. విషయం తెలుసుకుని... తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఉత్తర భారతానికి చేరుకున్న నీల్ - కాన్పుర్, అలహాబాద్లలో మారణహోమం సృష్టించాడు. ఈ రెండు సంస్థానాలను తిరుగుబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈ క్రమంలో వేల మంది సిపాయిలతో పాటు సాధారణ భారతీయ పౌరులనూ హత్య చేయించాడు. యుద్ధ ఖైదీలను ఉరికొయ్యలకు వేలాడదీశాడు. అలహాబాద్లో తిరుగుబాటుకు సహకరించిన వారిని ఇళ్లలో ఉంచి సజీవ దహనం చేయించాడు. వారిలో నానా సాహిబ్ కుమార్తె కూడా ఉండటం గమనార్హం. నీల్ సారథ్యంలో జరిగిన ఈ మారణకాండలో దాదాపు 10 వేల మంది భారతీయులను హత్య చేశారు. అందుకే ఆయనకు ‘అలహాబాద్ నరహంతకుడు’ అనే పేరు పడిపోయింది. చివరికి యుద్ధం కొనసాగుతుండగానే లఖ్నవూలో 1858 సెప్టెంబరు 25న సిపాయిల చేతిలో తనూ అంతమయ్యాడు.
అమరత్వం ఆపాదింపు
కానీ.. సిపాయిల తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కొని... భారత్లో తమ పాలన స్థిరపడేందుకు కృషి చేసిన నీల్ సేవలకు గుర్తింపుగా బ్రిటిషర్లు అతడికి అమరత్వం ఆపాదించారు. మద్రాస్ రెజిమెంట్లో అతనితోపాటు కలిసి పనిచేసిన హారిస్ అనే సైనికాధికారి మద్రాస్ తిరిగి వచ్చాక... మౌంట్రోడ్డులో 1861లో పది అడుగుల నీల్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. లఖ్నవూ కంటోన్మెంట్లో ఒక వీధికి నీల్ లేన్ అని, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకదానికి నీల్ ఐలండ్ అని నామకరణం చేశారు. వీటి పేర్లు ఇప్పటికీ అలాగే కొనసాగుతుండటం గమనార్హం. ఉత్తర, దక్షిణాలతో పాటు అన్నిరకాల విభజనలతో తమ పాలనను సుస్థిరంగా సాగిస్తున్న తెల్లవారికి మద్రాసువాసులు మాత్రం షాకిచ్చారు. అలహాబాద్లో నీల్ అకృత్యాలను మరచిపోలేదని చాటి చెప్పారు. మద్రాసు మౌంట్రోడ్డులోని జార్జ్ నీల్ విగ్రహాన్ని తొలగించాలని నినదిస్తూ 1927 ఆగస్టు 11న స్థానికులు ఆందోళన ప్రారంభించారు. ఇద్దరు నిరసనకారులు విగ్రహాన్ని సుత్తితో బాది, గడ్డపారతో తవ్వి... ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశారు. మద్రాసు మహాజన సభ, కాంగ్రెస్కు చెందిన మద్రాస్ ప్రొవెన్షియల్ కమిటీలు సైతం విగ్రహం తొలగించాలని తీర్మానాలు చేశాయి. అలహాబాద్ హంతకుడు... మద్రాసులో ప్రధాన సమస్యగా మారాడు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆందోళనకారులకు జైలు శిక్షలు విధించింది. పట్టణ బహిష్కరణలు చేసింది. అయినా... ప్రజలు వెనక్కి తగ్గలేదు. వరుస ప్రదర్శనలు నిర్వహించారు. అప్పట్లో మద్రాసును సందర్శించిన మహాత్మాగాంధీ సైతం వీరి ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే... నిరసన పూర్తిగా అహింసా విధానంలోనే కొనసాగాలని సూచించారు. మద్రాసు నిరసనల హోరు లాహోర్ దాకా వినిపించింది. అయినా ఆంగ్లేయ ప్రభుత్వం చలించలేదు. 1928లో సైమన్ కమిషన్ రావడంతో ‘సైమన్ గోబ్యాక్’ నినాదాల వెల్లువలో... ఈ విగ్రహం తొలగింపు ఆందోళన సరిగా వినిపించలేదు. అంతర్లీనంగా మాత్రం స్థానికుల ఆకాంక్ష సజీవంగా కొనసాగింది. 1937లో జరిగిన ప్రొవెన్షియల్ ఎన్నికలలో సి.రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అదే అదనుగా నీల్ విగ్రహాన్ని తీసేయాలని మద్రాస్ కార్పొరేషన్లో ఉద్యమకారులు తీర్మానం చేయించారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం చివరకు నీల్ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేసి... మ్యూజియానికి తరలించింది. అలా అలహాబాద్ నరహంతకుడికి మద్రాసు వాసులు తమవంతు శిక్ష విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు