తప్పదు ‘పరీక్ష’.. నీకు నీవే రక్ష!
ఇప్పుడు కరోనా మూడోవేవ్ నడుస్తోంది. వైరస్ సోకిందా లేదా అని తనిఖీ మొదలు దాని నుంచి బయట పడేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువ మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.
ఇంట్లో ఈ పరికరాలు ఉన్నాయా?
జ్వరం.. బీపీ.. పల్స్.. ఆక్సిజన్ స్థాయులు తెలుసుకోండి
వేపరైజర్లను సిద్ధం చేసుకోండి
న్యూస్టుడే, కేపీహెచ్బీకాలనీ
ఇప్పుడు కరోనా మూడోవేవ్ నడుస్తోంది. వైరస్ సోకిందా లేదా అని తనిఖీ మొదలు దాని నుంచి బయట పడేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువ మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్ సోకిందా లేదా అనే అనుమానంతో సతమతమవుతున్నారు. జ్వరం మూడ్రోజుల్లో తగ్గకపోతే పరీక్ష తప్పదు. కిట్తో స్వీయ తనిఖీ కూడా చేసుకోవచ్చు. పాజిటివ్ అని తేలితే నిత్యం కొన్ని పరికరాలతో కుస్తీ పట్టాల్సిన అవసరం ఉంది. జ్వరం, రక్తపోటు, పల్స్, ఆక్సిజన్ స్థాయి, ఆవిరిపట్టుకోవడం..ఇలా అన్నింటికీ పరికరాలున్నాయి. కంపెనీలను బట్టి.. మార్కెట్, ఆన్లైన్ ధరలను బేరీజు వేసుకుని నాణ్యమైన వాటిని కొనుగోలు చేసి ప్రాథమిక చికిత్స చేసుకోవాలి. పరిస్థితి విషమిస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిందే.
థర్మల్ స్క్రీన్
ఎందుకంటే : మామూలు థర్మామీటర్, ఈ థర్మల్స్క్రీన్ పనితీరు ఒకటే. థర్మామీటర్ను చంకలో లేదా నాలిక కింద ఉంచి శరీర ఉష్ణోగ్రత కొలుస్తారు. కరోనా నేపథ్యంలో ఒకరు వాడిన థర్మామీటర్ను మరొకరు వాడటం శ్రేయస్కరంకాదు.
ఎలా పనిచేస్తుంది : థర్మల్స్క్రీన్లోని ఇన్ఫ్రా రెడ్ లైట్ 5 సెం.మీ. దూరం నుంచే శరీరంలోని ఉష్ణోగ్రతను చూపిస్తుంది. సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ లేదా 98.7 ఫారెన్హీట్ దాటిందంటే అప్రమత్తమవ్వాలి.
మార్కెట్ ధర : రూ.750-రూ.3 వేల వరకు. (కంపెనీ ఆధారంగా సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ రేటు : రూ.800-రూ.2000 వరకు. రూ.50 వేలకుపైగా ధర పలికేవీ ఉన్నాయి. వీటిని కంప్యూటర్కి కూడా లింక్ చేసుకోవచ్చు.
పల్స్ ఆక్సీమీటర్
ఎందుకంటే : నాడి (పల్స్), శరీరంలోని ఆక్సిజన్ శాతం (ఆక్సీ) తెలుసుకునేందుకు
ఎలా పనిచేస్తుంది : ఈ పరికరంలోని లైట్ సోర్స్ ద్వారా శరీరంలోని ఆక్సిజన్ శాతం, నాడి, గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసుకోవచ్చు.
పల్స్ సాధారణ స్థాయి : నిమిషానికి 72 సార్లు. రోగి పరిస్థితిని బట్టి కొందరిలో 72-80-90 వరకు... జ్వరం వచ్చిన వారిలో 100 వరకు కూడా ఉంటుంది.
ఆక్సిజన్ శాతం సాధారణ స్థాయి : ఆరోగ్యవంతులకు 95-100. ఛాతీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కొంత తక్కువ కూడా ఉండొచ్చు. 95 కంటే తక్కువైతే వైద్యుడిని సంప్రదించాలి
మార్కెట్ ధర : రూ.950-రూ.2500 వరకు. (కంపెనీ ఆధారంగా సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ ధర : రూ.500-రూ.2 వేల వరకు
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్
ఎవరు వాడాలి : శరీరంలో ఆక్సిజన్ శాతం 95 కంటే బాగా తక్కువగా ఉంటే ఈ పరికరాన్ని వాడాలి.
ఎలా పనిచేస్తుంది : ఈ పరికరంలో ఉంటే బాక్సులో పోసిన నీటికి.. అప్పటికే యంత్రానికి విద్యుత్తు సరఫరా ద్వారా ఏర్పడే గాలి తోడై శరీరానికి కాన్సన్ట్రేటర్ స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తుంది. అవసరమైతే అద్దెకు తెచ్చుకోవచ్చు. లేదంటే కొనుగోలు చేయొచ్చు.
కిరాయి : నెలకు రూ.2వేలు-రూ.5 వేల వరకు (యంత్ర సామర్థ్యాన్ని బట్టి)
మార్కెట్ ధర: రూ.35 వేలు-రూ.1.50 లక్షల వరకు. (కంపెనీ ఆధారంగా.. సామర్థ్యాన్ని బట్టి సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ ధర: రూ.15 వేలు-రూ.1.75 లక్షల వరకు
డిజిటల్ రక్తపోటు యంత్రం
ఎందుకంటే : గతంలో బీపీ తనిఖీకి వైద్యుడి వద్దకే వెళ్లేవారు. ఇప్పుడు ఈ పరికరంతో ఎవరైనా ఇంట్లో పరీక్షించుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది : యంత్రానికి ఉన్న పైపు వస్త్రాన్ని చేతికి చుట్టినప్పుడు గుండె ధమనుల్లో ప్రవహించే రక్త వేగాన్ని ఈ యంత్రం గుర్తించి రక్తపోటు స్థాయిని తెలుపుతుంది.
సాధారణ స్థాయి : 120/80 (సిస్టాలిక్.. 120, డయాస్టాలిక్.. 80) ఉండాలి. కొంత హెచ్చుతగ్గులున్నా ఫరవాలేదు.
ప్రమాద స్థాయి: సిస్టాలిక్, డయాస్టాలిక్కంటే బాగా తక్కువ ఉంటే లోబీపీ, సిస్టాలిక్ 140 కంటే ఎక్కువ ఉంటే హైబీపీగా నిర్ధారిస్తారు.
మార్కెట్ ధర : రూ.1,100-రూ.3 వేల వరకు (కంపెనీ ఆధారంగా సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ ధర : రూ.800-రూ.3,500 వరకు
వేపరైజర్లు (ఆవిరి పట్టే పరికరాలు)
ఎందుకంటే: ఈ పరికరాలతో ఆవిరి పట్టుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇందులో వేడినీళ్లు పోసి జిందాతిలిస్మాత్ వేస్తే వచ్చే ఆవిరితో వైరస్ నశిస్తుందని నిపుణులంటున్నారు. ముక్కు, చెవులు, గొంతు మార్గాల్లో వైరస్, బ్యాక్టీరియా నాశనమవుతుంది. ఎక్కువ ఆవిరి పట్టడం మంచిది కాదు.
మార్కెట్ ధర : రూ.200- రూ.3,000 వరకు. (కంపెనీ ఆధారంగా సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ ధర: రూ.200- రూ.800 వరకు
ర్యాట్ (ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్) కిట్
ఎలా పనిచేస్తుంది : ఈ కిట్లో 2 గీతలుంటాయి.ఒకటి కంట్రోల్. రెండోది టెస్ట్ గీత. ముక్కు, గొంతులో నుంచి తీసిన నమూనాను వీటీఎం - వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియా (ద్రావణం)లో కలపాలి. దీన్ని కిట్లో వేయాలి. శరీరంలో వైరస్ ఉంటే ఈ ద్రావణంలోనూ వైరస్ బతికే ఉంటుంది.
ఇలా తెలుస్తుంది: 2 గీతలు కనిపిస్తే పాజిటివ్.. 1 గీత కనిపిస్తే నెగెటివ్. (కంట్రోల్ గీత కనిపిస్తేనే కిట్ పనిచేస్తున్నట్లు)
మార్కెట్ ధర: రూ.200-రూ.3 వేల వరకు (కంపెనీ ఆధారంగా సర్జికల్ దుకాణం ధర)
ఆన్లైన్ ధర: రూ.200-రూ.4 వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్