మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం
కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు) పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా శనివారం
భాజపాతో దేశానికి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం
సీపీఎం మహాసభలో ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ఈనాడు, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు) పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఆన్లైన్ మహాసభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారానే ఇది సాధ్యం. పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో పార్టీశాఖలు నిర్ణయం తీసుకుంటాయి. కలిసి పోరాడితే ప్రజల్ని ఓడించగలిగేవారు లేరనేది ఇటీవల రైతు ఉద్యమం చాటిచెప్పింది. ప్రధాని మోదీ దిగిరాక తప్పలేదు. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, మత సామరస్యంపైన జరుగుతున్న దాడులను, దోపిడీని ఎదుర్కోవాలంటే ప్రజా ఉద్యమాలే సరైన మార్గం. దీనికోసం ఎలాంటి ఎత్తుగడ అనుసరించాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. దేశంలో అందరికీ రెండు డోసులు వ్యాక్సిన్ వేస్తే ప్రజలు కరోనా నుంచి బయటపడే అవకాశం ఉన్నా కేంద్రం చేతులు ఎత్తేసింది. దేశ సంపదంతా లూటీ అవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. దేశంలో కోటీశ్వరుల వద్ద ఉన్న సంపద విలువ 55.5 శాతం దేశ ప్రజల సంపదతో సమానం. ప్రపంచ స్థాయి ప్రమాణాల ప్రకారం దేశంలో ఆకలి, పేదరికం సూచీలు పడిపోతున్నాయి. ఎనిమిదేళ్లలో సామూహిక అత్యాచారాలు, మహిళలపై దాడులు, హత్యలు చోటుచేసుకున్నా సరైన నివారణ చర్యలు లేవు. వ్యవసాయం, విద్య, సహకార, విద్యుత్ తదితర వ్యవస్థలపై రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. పార్లమెంటును రబ్బరు స్టాంపుగా మార్చారు. సీబీఐ, ఈడీలను స్వార్థానికి వాడుకుంటూ ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారు’’ అంటూ సీతారాం ఏచూరి విమర్శించారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ మాట్లాడుతూ.. పోరాటాలతోనే ఏదైనా సాధ్యమనేది అంతా గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీతారాములు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పలు అంశాలపై చర్చ, తీర్మానాలు
భారత కమ్యునిస్టు పార్టీ(మార్క్సిస్టు) రాష్ట్ర మూడో మహాసభలు మంగళవారం వరకు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో నిర్వహించనున్న ఈ సభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారాట్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు కేంద్ర కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభల్లో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నారు.
ప్రజా తెలంగాణయే సీపీఎం లక్ష్యం
తెలంగాణ ఆవిర్భావం తరువాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాలకులు బంగారు తెలంగాణ నిర్మిస్తామని వాగ్దానం చేసినా నెరవేర్చలేదు. ప్రజా తెలంగాణ సాధించడం ఎలా అనేదానిపై పార్టీ ఆలోచన చేస్తోంది. కేంద్రంపై యుద్ధం ప్రకటించకపోతే ప్రజల ప్రయోజనాలకు రక్షణ కష్టం. కాంగ్రెస్ సరైన తీరులో స్పందించడం లేదు.
- బీవీ రాఘవులు, పొలిట్బ్యూరో సభ్యుడు
రాష్ట్రంలో విషసర్పంలా భాజపా
రాష్ట్రంలో భాజపా విషసర్పంలా ఎదుగుతోంది. దేశంతో పాటు ఈ రాష్ట్రంలోనూ సీపీఎంకు భాజపాయే ప్రధాన రాజకీయ శత్రువు. మరోమారు ప్రజాతంత్ర శక్తులను సమీకరిస్తాం. భాజపా దాడి కేవలం కమ్యునిస్టులపైనే కాదు తెరాసపైనా ఉంది. అయినా సీఎం కేసీఆర్ పోరాటం చేయడం లేదు. భాజపాతో బేరసారాలు ఆడుకోవడానికి అధికారాన్ని వాడుకుంటున్నారు. ఆయనతో ఎన్నికల పొత్తు పెట్టుకోం.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?