మరో రెండు పారిశ్రామిక నడవాలు
తెలంగాణ ప్రభుత్వం మరో రెండు కొత్త పారిశ్రామిక నడవా(కారిడార్)ల ఏర్పాటుకు నిర్ణయించింది. హైదరాబాద్- విజయవాడ(277కిలోమీటర్లు), హైదరాబాద్- బెంగళూరు(575 కిలోమీటర్లు) మార్గంలో వీటిని ప్రతిపాదించింది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
వీటికి నిధులు కేటాయించండి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో రెండు కొత్త పారిశ్రామిక నడవా(కారిడార్)ల ఏర్పాటుకు నిర్ణయించింది. హైదరాబాద్- విజయవాడ(277కిలోమీటర్లు), హైదరాబాద్- బెంగళూరు(575 కిలోమీటర్లు) మార్గంలో వీటిని ప్రతిపాదించింది.
ఇప్పటికే హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నాగ్పుర్ నడవాలను ప్రతిపాదించిన తెలంగాణ నలువైపులా నడవాల కోసం కొత్తగా విజయవాడ, బెంగళూరు మార్గాలను ఎంచుకుంది.. వచ్చే కేంద్ర బడ్జెట్లో కొత్త నడవాలు ఒక్కోదానికి రూ.1500 కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక పారిశ్రామిక ప్రాజెక్టులు ఔషధనగరి, జహీరాబాద్ నిమ్జ్, నేషన్ డిజైన్ సెంటర్ల వ్యవస్థాపక, మౌలిక వసతులకు సైతం నిధులు కేటాయించాలన్నారు. జాతీయ రక్షణ పారిశ్రామిక ఉత్పత్తుల నడవాలో హైదరాబాద్ను చేర్చాలన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఆమెకు లేఖ రాశారు.
అందులోని ముఖ్యాంశాలు..
‘‘పారిశ్రామిక నడవాలు ప్రగతికి దోహదపడతాయి. వాటి ప్రాధాన్యాన్ని గుర్తించి హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నాగ్పుర్ నడవాలను ప్రతిపాదించాం. వీటికి రూ.ఆరు వేల కోట్లు కావాలి. హైదరాబాద్-నాగ్పుర్ కారిడార్లో మంచిర్యాల మార్గాన్ని కొత్తగా చేర్చాలి. హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- విజయవాడ నడవాలను జాతీయ పారిశ్రామిక నడవాల కార్యక్రమంలో చేపడతాం. హుజూరాబాద్, జడ్చర్ల- గద్వాల్- కొత్తకోట రహదారులను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తాం. వీటికి రూ.మూడు వేల కోట్లు ఇవ్వాలి.
ఔషధ రంగంలో అద్భుత ప్రగతి
ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ] పరిశ్రమల సమూహం ఔషధనగరి. ఈ రంగంలో అద్భుతమైన ప్రగతికి కేంద్రంగా హైదరాబాద్ మారుతోంది. ఇప్పటికే దీనికి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్) హోదాను ఇవ్వడంతో పాటు జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.64వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 5.6 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి లభిస్తుంది. ప్రాజెక్టు బృహత్తర ప్రణాళిక కోసం రూ.50 కోట్లు, రోడ్ల అనుసంధానం, నీటి, విద్యుత్ సరఫరా, రైల్వే అనుసంధానం, మౌలిక వసతుల కోసం రూ.1399 కోట్లు, వ్యర్థాల శుద్ధి కేంద్రానికి రూ.3554 కోట్లు మొత్తంగా ఔషధనగరికి రూ.5003 కోట్లు ఇవ్వాలి. తెలంగాణ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అత్యంత సులువు. ప్రముఖ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రెండు జాతీయ నడవాల పరిధిలో హైదరాబాద్ను చేర్చాలి. జహీరాబాద్ నిమ్జ్లో వైమానిక సమూహాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం.
జాతీయ ఆకృతి కేంద్రానికి..
మీ సూచన మేరకు జాతీయ ఆకృతి కేంద్రాన్ని(ఎన్డీసీని) హైదరాబాద్లోని జాతీయ నిర్మాణ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. దీనికి 8 సంవత్సరాల పాటు కేంద్రం నుంచి నిర్వహణ ఖర్చు ఇవ్వాలి. ప్రాజెక్టు వ్యయంలో 25శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
నోవార్టిస్ భారీ సామర్థ్య కేంద్రం ఎక్కడుంది?
నెటిజన్లకు ట్విటర్లో కేటీఆర్ ప్రశ్న
ఈనాడు, హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ నోవార్టిస్కు ప్రపంచంలోనే భారీదైన సామర్థ్య కేంద్రం ఎక్కడుందో తెలుసా? అని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విటర్లో ప్రశ్నించారు. ఆ సంస్థకు అతిపెద్ద డేటా సైన్స్, అనలిటిక్స్, ఔషధ అభివృద్ధి, సాంకేతిక, ఆర్థిక కార్యకలాపాల కేంద్రం ఎక్కడ నడుస్తోంది? అని ఆయన అడుగుతూ.. హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని నోవార్టిస్ భవన సముదాయం ఫొటోలను ట్వీట్కు జత చేశారు. ఇటీవల హైదరాబాద్లోని ప్రపంచస్థాయి కేంద్రాలపై ఆయన నెటిజన్లను ట్విటర్ ద్వారా ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది.