ప్రణాళిక ఉంటే ప్రకృతిపైనా విజయం
వాతావరణ మార్పులతో కరవు పరిస్థి తులేర్పడినా రైతులకు శిక్షణ ఇచ్చి తగిన పంటలను సాగుచేయిస్తే వారి ఆదాయం 35 శాతం పెరిగిందని జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రిడా) శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. వాతావరణ మార్పులకు
శాస్త్రవేత్తల సూచనలతో పెరిగిన కరవు రైతుల ఆదాయం
వెల్లడించిన జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ
వాతావరణ మార్పులతో కరవు పరిస్థి తులేర్పడినా రైతులకు శిక్షణ ఇచ్చి తగిన పంటలను సాగుచేయిస్తే వారి ఆదాయం 35 శాతం పెరిగిందని జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రిడా) శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా గతంలో కొన్ని ప్రాంతాల్లో కరవు ఏర్పడినప్పుడు పంటల సాగులో తమ ఆదాయం 54, పాడిపై 40 శాతం ఆదాయం తగ్గినట్లు ఆ రైతులు చెప్పారని వివరించింది. తమ సంస్థకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని వాతావరణ మార్పులు, కరవును అధిగమించేలా పంటల సాగు, పాడిపశువుల పెంపకంలో చేపట్టిన మార్పులతో ఆదాయం పడిపోకుండా చూడవచ్చని నిరూపించారని వివరించింది. వీరు నిర్వహించిన అధ్యయనంపై వెలువరించిన పరిశోధన పత్రంలోని ముఖ్యాంశాలు...
* రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని పల్లెలతో పాటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నంద్యాలగూడెం, బోరింగుతండా, సూర్యాపేట గ్రామీణ మండలం కసరాబాద్ గ్రామాల్లో 2019-20లో పంటల సాగుపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
* ఈ గ్రామాలు తీవ్ర వర్షాభావ ప్రాంతాలు. ఇక్కడ ఏడాదికి సగటు వర్షపాతం 750-850 మిల్లీమీటర్లు. అధ్యయనానికి ఎంచుకున్న మొత్తం 750 ఎకరాల పంటభూముల్లో 80 శాతం వర్షాధారంగా సాగయ్యేది.
* ఒక్కో గ్రామం నుంచి 60 రైతు కుటుంబాలను శాస్త్రవేత్తలు సమగ్రంగా పరిశీలించారు. వారికున్న భూమి, వయసు, విద్య, పంటల సాగుతీరు, ఆదాయం, పాడి పశువుల వివరాలన్నీ నమోదు చేశారు. వాతావరణ మార్పుల వల్ల వారి ఆదాయంపై ఎంత ప్రభావం పడుతుందో శాస్త్రీయంగా విశ్లేషించారు.
* ఈ గ్రామాల్లో 80 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతులు ఎక్కువగా 44-46 ఏళ్ల మధ్యవయస్కులు. వారిలో 50 శాతం మంది అక్షరాస్యులు. ఈ కుటుంబాలకున్న సగటు కమత విస్తీర్ణం 2.27 హెక్టార్లు. వీరిలో సగానికి పైగా 2 హెక్టార్లలోపు భూమి కలిగిన చిన్నకారు రైతులు. ఈ కుటుంబాల్లో ఎస్సీలు 17, ఎస్టీలు 7, బీసీలు 75 శాతమున్నారు.
* ఒక రైతు కుటుంబానికి సాధారణ వాతావరణ పరిస్థితుల్లో సాగు, పాడి, ఇతర పనులతో ఏడాదికి రూ.2,36,196 ఆదాయం రాగా కరవు ఏడాదిలో అది రూ.1,70,153కి పడిపోయినట్లు తేలింది. పెద్ద కమతం ఉన్న రైతుల ఆదాయంలో 1.70 శాతమే తగ్గుదల కనిపించగా, చిన్న, సన్నకారు రైతుల ఆదాయం గరిష్ఠంగా 50.70 శాతం వరకూ పడిపోయింది.
* అత్యధికంగా మిరప పంటలో 44.35 శాతం, మొక్కజొన్నలో 41.67, మల్బరీలో 32.32, కందిలో 34.70, పత్తిలో 30.41, వరిలో 28.81 శాతం పంట దిగుబడి తగ్గింది.
* ఈ కాలంలో రైతులకు ఉపాధి దొరికే రోజుల సంఖ్య 29 శాతం తగ్గింది. కానీ వ్యవసాయేత పనులకు, సాగునీటి వసతి ఉన్న ఇతర గ్రామాలకు కూలీలుగా రైతులు వెళ్లడం వల్ల ఉపాధి ఎక్కువగా దొరికింది.
* కరవు రోజుల్లో వ్యవసాయంపై తమ ఆదాయం తగ్గిపోయినట్లు 48 శాతం రైతు కుటుంబాలు తెలిపాయి. పశుగ్రాసమూ దొరకడం లేదన్నారు.
శిక్షణతో మార్పు
* శిక్షణ ఇవ్వడంతో రైతులు విభిన్న రకాల పంటలను సాగుచేశారు. వానాకాలంలో వరి, పత్తి, కంది వేశారు. యాసంగిలో మిరప, మొక్కజొన్న మల్బరీ, కూరగాయలు వంటివి సాగుచేయడమే కాకుండా పాడిపశువుల పెంపకం చేపట్టారు. వీటితో ఈ కుటుంబాల వార్షిక సగటు ఆదాయం రూ.2,14,327 వచ్చింది. అంతకు ముందు కరవు రోజుల్లో ఈ ఆదాయం రూ.1.70 లక్షలు.
* రైతులకున్న తక్కువ భూమిలోనే విభిన్న రకాల పంటల సాగు వల్ల వారి ఆదాయం పెరిగింది. పంటల సాగు, పాడి పశువుల పెంపకమే కాకుండా రైతు కుటుంబ సభ్యులు టైలరింగ్, చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇతర పొలాల్లో కూలి పనులకు సైతం వెళుతూ వేతనాలు పొందారు.
* వాతావరణంలో తరచూ వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికబద్ధంగా సిద్ధం కావాలి. కరవు ఏర్పడుతుందనే ముందస్తు అంచనాలివ్వడం, సకాలంలో దాన్ని అధిగమించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సాయపడటం, విపత్తు నిర్వహణ ప్రణాళిక, సామూహికంగా అందరినీ సిద్ధం చేయడం వంటివి అవసరం అని పరిశోధన పత్రంలో తెలిపారు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు