అన్నీ ఒమిక్రాన్ కేసులే
రాష్ట్రంలో ఒమిక్రాన్ స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా గత డిసెంబరుతో పోల్చితే జనవరిలో రెట్టింపునకు మించి ఈ కేసులు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత నెల 17 నుంచి ఈ నెల 6 వరకూ మొత్తంగా 119
గత నెలతో పోల్చితే భారీగా వ్యాప్తి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా గత డిసెంబరుతో పోల్చితే జనవరిలో రెట్టింపునకు మించి ఈ కేసులు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత నెల 17 నుంచి ఈ నెల 6 వరకూ మొత్తంగా 119 నమూనాల్లో జన్యుక్రమ విశ్లేషణ జరిపారు. ఇందులో 17న సేకరించిన 32 నమూనాల్లో మొత్తం అన్నీ డెల్టా వేరియంట్గానే నిర్ధారణ అయ్యాయి. అంటే నెల క్రితం ఒమిక్రాన్ వేరియంట్ తెలంగాణలో దాదాపుగా లేనట్లేనని తేలుతోంది. అయితే.. గత నెల 29న 27 నమూనాలను పరీక్షించగా.. ఇందులో మాత్రం 21 డెల్టా.. 6 ఒమిక్రాన్గా తేలాయి. ఇదే క్రమంలో జనవరి 4న 60 నమూనాలను పరీక్షించగా.. ఇందులో 25 డెల్టా.. 35 ఒమిక్రాన్గా నిర్ధారణ అయ్యాయి. అంటే ఒమిక్రాన్ కేసులు ఏకంగా 58 శాతానికి పెరిగాయి. తర్వాత నుంచి ఒమిక్రాన్ ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. తాజాగా ఈనెల 20న 91 నమూనాల్లో జన్యుక్రమ విశ్లేషణ జరపగా.. కేవలం రెండు నమూనాల్లోనే డెల్టా కనిపించింది. మిగిలిన 89 నమూనాల్లోనూ ఒమిక్రాన్ వేరియంటే ఉన్నట్లు ప్రయోగశాలలో నిర్ధారించారు.
* ఒమిక్రాన్లోనూ ప్రధానంగా మూడు రకాల ఉప వేరియంట్లను గుర్తించారు. ఇందులో ‘బిఎ.1’ ఉప విభాగంలో 68.. ‘బిఎ.2’ ఉప విభాగంలో 236.. ‘బి.1.1.29’ ఉప విభాగంలో 5 చొప్పున ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఒమిక్రాన్ ఉప విభాగం ‘బిఎ.2’ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్లుగా వైద్యవర్గాలు ధ్రువీకరించాయి.
* ఈనెల 7 నుంచి 20 వరకూ సేకరించిన నమూనాలను గాంధీ ఆసుపత్రి ప్రయోగశాలలో జన్యుక్రమ విశ్లేషణ జరిపితే.. ఒమిక్రాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మొత్తం 273 నమూనాలను పరీక్షించగా.. ఇందులో కేవలం 14(5శాతం) నమూనాల్లో మాత్రమే డెల్టాను కనుగొన్నారు. మిగిలిన 259(95 శాతం) నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు నిర్ధారించారు.
* జిల్లాల వారీగానూ ఒమిక్రాన్ విశ్లేషణను జరపగా జీహెచ్ఎంసీ పరిధిలో అది విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. జిల్లాల్లోనూ ఈ వేరియంట్ ప్రభావం గణనీయంగా ఉన్నట్లు స్పష్టమైంది.
మాస్కు, టీకాలే రక్ష
ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తున్నా.. దీనితో స్వల్ప లక్షణాలే కనిపిస్తుండడం ఊరటనిచ్చే అంశమే. ఇప్పటి వరకూ రోజుకు 4వేలకు పైగా కేసులు నమోదవుతున్నా.. రాష్ట్రంలో 31వేల క్రియాశీల కేసులు ఉన్నా.. ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగానే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,076 మంది.. ప్రైవేటుగా 2,036 మంది కొవిడ్తో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తంగా 56,524 పడకలు అందుబాటులో ఉండగా.. 3,112(5.5 శాతం) నిండిపోయాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని మాత్రం ఇంటి వద్దే చికిత్స పొందాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. మాస్కు ధరించడం ద్వారా వైరస్ను సమర్థంగా కట్టడి చేయొచ్చనీ, అర్హులందరూ టీకాలను పొందాలని సూచిస్తున్నారు. వచ్చే 2-3 వారాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగొచ్చని, ప్రజలంతా తప్పక కొవిడ్ నిబంధనలను పాటించాలని వైద్యశాఖ విజ్ఞప్తి చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం