చారిత్రక తప్పులను సరిదిద్దుతున్నాం
స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది చేసిన త్యాగాలను తుడిచేసే ప్రయత్నం గతంలో జరిగిందని, ఇప్పుడు తాము ఆ తప్పులను సరిదిద్దుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆజాద్ హింద్ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్
ఎంతో మంది త్యాగాలను గత ప్రభుత్వాలు విస్మరించాయి
నేతాజీ నివాస సందర్శన అనుభూతిని మాటల్లో చెప్పలేను
సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణలో మోదీ
ఈనాడు, దిల్లీ: స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది చేసిన త్యాగాలను తుడిచేసే ప్రయత్నం గతంలో జరిగిందని, ఇప్పుడు తాము ఆ తప్పులను సరిదిద్దుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆజాద్ హింద్ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఇండియాగేట్ వద్ద 28 అడుగుల ఎత్తైన గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం దాని హాలోగ్రామ్ విగ్రహాన్ని డిజిటల్ రూపంలో ఆవిష్కరించి, ప్రసంగించారు.
విజయాలే మన సంకల్ప శక్తికి సాక్ష్యాలు
‘‘2047కి ముందే సరికొత్త భారత దేశాన్ని నిర్మించుకోవాలన్న లక్ష్యం మన ముందిప్పుడు ఉంది. ఈ లక్ష్యాన్ని చేరకుండా ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. మన విజయాలే మన సంకల్ప శక్తికి సాక్ష్యాలు. మన యాత్ర సుదీర్ఘమైంది. ఎన్నో శిఖరాలు అధిరోహించాల్సి ఉంది. భారత్కున్న గుర్తింపును, ప్రేరణలను పునరుజ్జీవింపజేయాలి. స్వాతంత్య్రం తర్వాత దేశ సంస్కృతితోపాటు, ఎంతోమంది మహానుభావులు చేసిన యోగదానాలను తుడిచేసే పని జరిగింది. దశాబ్దాల తర్వాత దేశం ఆ తప్పులను సరిదిద్దుతోంది. అంబేడ్కర్తో ముడిపడిన పంచతీర్థ్కున్న ప్రాధాన్యం ఆధారంగా ఈ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐక్యతా విగ్రహ రూపంలో ప్రపంచం మొత్తం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కీర్తిని చూస్తోంది.
ఆయన ప్రతి అంకాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది
సుభాష్ చంద్రబోస్తో ముడిపడిన ప్రతి అంకాన్ని దేశం పూర్తి గౌరవంతో గుర్తు చేసుకుంటోంది. నేతాజీ ద్వారా అండమాన్లో త్రివర్ణ పతాకం ఎగిరిన 75వ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి ఒక ద్వీపానికి ఆయన పేరు పెట్టాం. కోల్కతాలో నేతాజీ పుట్టిన ఇంటికి వెళ్లే భాగ్యం గత ఏడాది నాకు దక్కింది. ఆయన చదువుకున్న గది, ఆ ఇంటి గోడలు, మెట్లను దర్శించుకున్న అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. ఎర్రకోటలోనూ ఆజాద్ హింద్ ఫౌజ్కు సంబంధించిన స్మారకం ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేతాజీ జీవితంతో ముడిపడిన దస్త్రాలను బహిర్గతం చేసే అవకాశం మా ప్రభుత్వానికి లభించింది. బోస్ ఏదైనా సంకల్పిస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేకపోయేవారు. అందుకే మనం నేతాజీ నుంచి కెన్ డు, విల్ డూ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలి. నేతాజీ కలలుగన్న భారత్ను తీర్చిదిద్దడంలో మనం సఫలమవుతామన్న నమ్మకం నాకుంది’’ అని మోదీ పేర్కొన్నారు. సందర్శకుల కోసం ఇండియాగేట్ వద్ద డిజిటల్ తెర ఏర్పాటు చేశారు. డిజిటల్ దీపాల వెలుగులో రాత్రిళ్లు మాత్రమే దీనిపై విగ్రహం కనిపిస్తుంది. దీని ఎత్తు 28 అడుగులు. వెడల్పు ఆరు అడుగులు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి నివాళి
నేతాజీ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ‘పరాక్రమ్ దివస్’ శుభాకాంక్షలు తెలిపారు. నేతాజీ ఆదర్శాలు, త్యాగాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతాయని కోవింద్ చెప్పారు. బోస్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఫొటోను మోదీ ట్విటర్లో పంచుకున్నారు. ఆయనకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులోని నేతాజీ చిత్రపటానికి ప్రధాని పుష్పాంజలి ఘటించారు. ప్రతి భారతీయుడి హృదయంలో స్వరాజ్య ఉద్యమంపై సరికొత్త ఉత్సాహాన్ని నింపిన మహోన్నత జాతీయవాది సుభాష్ చంద్రబోస్ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. స్వరాజ్య సంగ్రామంలో ఉన్నత పాత్రను పోషించిన వారికి దేశం రుణపడి ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM