ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు!
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తోంది. దీనికి సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్?
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తోంది. దీనికి సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం దీనికి ప్రతిబంధకంగా మారనుంది. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. జనాభా లెక్కల సేకరణ 2021 మే నాటికి పూర్తి కావలసి ఉండగా కొవిడ్ వల్ల వాయిదా పడింది. అది ఎప్పటికి పూర్తవుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనను అధిగమించి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎలా ముందుకు వెళుతుంది? ఏమైనా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోందా? అన్న విషయంలో స్పష్టత రావలసి ఉంది. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన. అయితే అరకు లోక్సభ నియోజకవర్గం భౌగోళికంగా చాలా విస్తారమైనది కావడంతో... దాన్ని రెండు జిల్లాలుగా చేయాలన్న ఆలోచన ఉంది. ఆ ప్రకారం రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాల్ని... 26 జిల్లాలుగా చేయాలన్నది ప్రతిపాదన. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా చేసే క్రమంలో... కొన్నిచోట్ల ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న నగరంలో కొంత భాగం కొత్తగా ఏర్పడే జిల్లాల్లోకి వెళ్లనుంది. అంటే ఒక నగరం లేదా, పట్టణంలోని కొంత భాగం ఒక జిల్లాలోను, మరికొంత భాగం మరో జిల్లా పరిధిలోను ఉంటుంది. ఇలాంటి సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారన్న విషయంలోనూ స్పష్టత రావలసి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె