మూఢత్వం... మృత్యుపాశం
నల్గొండ జిల్లా దేవరకొండలో మహంకాళి పాదాల దగ్గర మొండెం లేని తల కనిపించిన ఉదంతం.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో టీసీఎస్ ఉద్యోగి శ్రీకాంత్గౌడ్తోపాటు భార్య, కూతురు నుదుట బొట్లతో విగతజీవులుగా మారిపోయిన వైనం..
అంధ విశ్వాసాలతో అకృత్యాలు
విద్యావంతుల్లోనూ విపరీత ధోరణులు
నల్గొండ జిల్లా దేవరకొండలో మహంకాళి పాదాల దగ్గర మొండెం లేని తల కనిపించిన ఉదంతం.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో టీసీఎస్ ఉద్యోగి శ్రీకాంత్గౌడ్తోపాటు భార్య, కూతురు నుదుట బొట్లతో విగతజీవులుగా మారిపోయిన వైనం.. జగిత్యాల జిల్లాకేంద్రంలో పట్టపగలే నాగేశ్వర్రావుతోపాటు ఆయన ఇద్దరు కొడుకులను బరిసెలతో పొడిచి చంపేసిన ఉన్మాదం.. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కాషాగూడెంలో గోరిమియా కుటుంబంపై కర్రలతో తెగబడిన దురాగతం.. కేవలం పది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెలుగు చూసిన దారుణాలివి. పేదా ధనికా.. తేడా లేదు. అక్షరాస్య, నిరక్షరాస్యులనే భేదం లేదు. ఉన్నదల్లా ఒక్కటే మూఢవిశ్వాసం. అదే వీటికి కారణం.
ఈనాడు, హైదరాబాద్: శాస్త్రసాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మూఢవిశ్వాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఏపీలో మదనపల్లె దురాగతం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో భార్యభర్తలు, కూతుళ్లిద్దరూ విద్యాధికులే. అయినా అంతా కూడబలుక్కుని క్షుద్రపూజలకు బానిసలుగా మారిన వైనం నివ్వెరపరిచింది. ఇలాంటి ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో తరచూ వెలుగుచూస్తున్నాయి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కాదు.. హైదరాబాద్తోపాటు పరిసరాల్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి.
జీనోమ్వ్యాలీ లాంటి అత్యాధునిక హంగులున్న శామీర్పేటలో రెండేళ్ల కిందట మంత్రాల నెపంతో కాలుతున్న చితిలోనే ఓ వ్యక్తిని పడేసి సజీవదహనం చేసిన దారుణం విస్తుపోయేలా చేసింది. రంగురాళ్లతో జాతకం మార్చేస్తామంటూ సర్వం దోచుకెళ్లే దొంగబాబాల లీలలు సాధారణమయ్యాయి. పాతబస్తీలో ఇలాంటి బురిడీబాబాల ఆగడాలు ఇప్పటికీ రాజ్యమేలుతూనే ఉన్నాయి. గత ఏడాది ఖమ్మం జిల్లా మధిర, ఆసిఫాబాద్ జిల్లా ధనోరా(పి), జగిత్యాల జిల్లా కేంద్రం టీఆర్నగర్, కొడిమ్యాల, సూర్యాపేట జిల్లా యర్కారం, మోతె, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలలో పలు దారుణాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి దురాచారాలను రూపుమాపే దిశగా చిత్తశుద్ధితో కూడిన కృషి జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్లో అత్యధికం
జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మంత్రాలు చేస్తున్నారనే నెపంతో 2020లో దేశవ్యాప్తంగా 88 హత్యలు జరిగాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 17, ఛత్తీస్గఢ్లో 16, ఝార్ఖండ్లో 15, ఒడిశాలో 14 చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్, బిహార్ల్లో 4 చొప్పున, గుజరాత్, మహారాష్ట్రల్లో 3 చొప్పున, మేఘాలయాలో 2, తెలంగాణ, రాజస్థాన్ల్లో ఒక్కోటి వెలుగుచూశాయి.
నిర్మూలన చట్టం ఊసెక్కడ?
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రజావైద్యుడు, మూఢనమ్మకాల వ్యతిరేక పోరాట నాయకుడు డా.నరేంద్ర ధబోల్కర్ను గతంలో మతోన్మాదులు హత్య చేశారు. అనంతరం ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహానికి తలొగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో మూఢమ్మకాల నిర్మూలన చట్టం చేసింది. 2017లో కర్ణాటక, 2018లో అసోంల్లోనూ ఈ తరహా చట్టాలు అమల్లోకి వచ్చాయి. అంతకుముందు బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్ల్లోనూ ఈ చట్టాలున్నాయి. కానీ తరచూ దారుణాలు వెలుగుచూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చట్టాలు రూపుదాల్చడం లేదు. ఫలితంగా మంత్రతంత్రాల పేరిట ఫిర్యాదులొస్తున్నా కఠినచర్యలు లేవు. మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రావడం లేదు.
ఎలాంటి సంఘటనలంటే..
* వ్యక్తులు మరణించినా సరే బతికొస్తారన్న నమ్మకంతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం.
* అనారోగ్యంతో ఎవరైనా మరణిస్తే మంత్రాలే కారణమని అనుమానితులపై దాడులు చేయడం.
* మృతుడిని బతికించేందుకు క్షుద్రపూజలు చేయాలని అనుమానితుడిని ఒత్తిడి చేయడం.
* క్షుద్రపూజలతో నరబలి ఇస్తే అతీంద్రియశక్తులు వశమవుతాయని నమ్మడం.
* ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చిన్నారుల్ని బలి ఇవ్వడం.
వైజ్ఞానిక దృక్పథం లేకనే..
చదువుల్లో వైజ్ఞానిక దృక్పథం లోపించడంతోనే అక్షరాస్యుల్లోనూ మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రజల్ని పాలకులు మద్యం మత్తు, మూఢనమ్మకాల్లోనే ముంచుతున్నారు. జాతకాలు, రంగురాళ్లు, వశీకరణం పేరిట టీవీల్లో ప్రజల్ని మభ్యపెట్టే ప్రచారపర్వం పెరిగింది. మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలి.
- రమేశ్, అధ్యక్షుడు, విజ్ఞానదర్శిని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా