ఉచిత హామీలు తీవ్ర సమస్యే!
ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలను అమలుచేస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాంటి పార్టీల ఎన్నికల గుర్తును
వాగ్దానాల వ్యయం అసలు బడ్జెట్ను మించిపోతోంది
రాజకీయ పార్టీలను నియంత్రించడం ఎలా?
కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
ప్రతిస్పందనకు నాలుగు వారాల గడువు
దిల్లీ: ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలను అమలుచేస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాంటి పార్టీల ఎన్నికల గుర్తును నిలిపివేయడం లేదా ఆ పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలన్న పిటిషన్పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ధర్మాసనంలో జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీ సభ్యులు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉచిత హామీల బడ్జెట్ సాధారణ బడ్జెట్ను మించిపోతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడుతూ ఉచిత హామీలు ఇస్తున్నాయి. నిస్సందేహంగా ఇది తీవ్రమైన అంశమే. అయితే, దీనిని నియంత్రించడం ఎలా? ఎన్నికల ప్రక్రియలో ఇది అసమానమైన విధానాన్ని సృష్టిస్తోంది. ఈ అంశంలో కోర్టు పరిధి పరిమితమే. కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాలని గతంలోనే ఎన్నికల సంఘాని(ఈసీ)కి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది’ అని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. కోర్టు తీర్పు తర్వాత ఉచిత హామీల అంశంపై ఈసీ ఒకే ఒక సమావేశం నిర్వహించిందని, మార్గదర్శకాలు రూపొందించినా వాటిలో పసలేదని పిటిషనర్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ‘అధికారాన్ని నిలుపుకోడానికి ఎన్నికల ముందు ప్రజాధనంతో అనుచిత ఉచిత హామీల అమలుకు యత్నించే పార్టీల గుర్తింపును రద్దు లేదా ఎన్నికల గుర్తుల నిలిపివేత, అవసరమైతే ఈ రెండు చర్యలు కలిపి తీసుకునేందుకు కేంద్రం చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘కొంత సమయం వేచిచూద్దాం. ప్రస్తుతం ఈ పిటిషన్పై స్పందించాల్సిందిగా కేంద్రం, ఈసీకి నోటీసులు ఇస్తున్నాం’ అని తెలిపింది. ఎన్నికల్లో పోటీపడి హామీలిస్తున్న పార్టీలనూ ఈ వ్యాజ్యంలో కక్షిదారులుగా చేర్చాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్ లేవనెత్తాలనుకున్న విషయం తీవ్రమైనది కాబట్టి కేంద్రానికి, ఈసీకి నోటీసు జారీచేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
పిటిషన్లో ఏముంది?
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ వేర్వేరు పార్టీలు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ భాజపా నేత, న్యాయవాది అశ్వనీ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ ...18ఏళ్ల వయసు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామంటే.. ప్రతి మహిళకు రూ.2వేలు ఇవ్వనున్నట్లు శిరోమణి అకాలీదళ్ వాగ్దానం చేసిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో గృహిణికి నెలకు రూ.2 వేలు, ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కళాశాలకు వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటీ, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.20 వేలు, 10వ తరగతి పాసయ్యాక రూ.15 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కోసం ప్రత్యేకంగా.. 12వ తరగతి చదివే అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీలు గుప్పించిందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉచిత, నిర్హేతుక వాగ్దానాలు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘనగా ప్రకటించాలని అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ కోరారు. ఒక్కో పౌరుడిపై సుమారు రూ.3 లక్షలు రుణ భారం ఉన్న రాష్ట్రాలూ ఉన్నాయని.. అయినా ఇంకా ఉచితాలను అందిస్తున్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.