Omicron: తగ్గుతోంది కానీ..
ఒమిక్రాన్ బారినపడినా..3-4 రోజుల్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారు. వారం రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్నవారూ ఉన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక శాతం
దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం..
ఒమిక్రాన్లో వేధిస్తున్న ప్రధాన సమస్యలివి
జ్వరం, జలుబు, గొంతునొప్పి తగ్గుముఖం
ఆసుపత్రిలో చేరికలు అతి స్వల్పం
ఈనాడు, హైదరాబాద్: ఒమిక్రాన్ బారినపడినా..3-4 రోజుల్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారు. వారం రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్నవారూ ఉన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక శాతం మందిలో గొంతుకే పరిమితమవుతుండటంతో.. ఆసుపత్రుల్లో చేరికలు కూడా అతి స్వల్పంగా ఉంటున్నాయని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పట్టినా..దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటివి మాత్రం వదలట్లేదు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడడం ద్వారా నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు తీవ్రత పెరిగినా..స్వల్ప దగ్గు కూడా 6-7 రోజులకూ తగ్గకపోయినా.. వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అత్యధిక సందర్భాల్లో గొంతు వరకే పరిమితమైన ఒమిక్రాన్.. స్వల్ప సమయాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశాలున్నాయనీ..దీన్ని తొలిదశలో గుర్తించడం ద్వారా ముప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశముంటుందని వైద్యులు వివరిస్తున్నారు.
రెండోదశ కంటే భిన్నంగా..
కొవిడ్ రెండోదశలో డెల్టా వేరియంట్ విజృంభించినప్పుడు..అధికుల్లో శ్వాసకోశాలపై దుష్ప్రభావం పడింది. ఒమిక్రాన్ బాధితుల్లో పెద్దగా సమస్యలు ఎదురవడం లేదు.శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్కు గురైనవారు కూడా ఒక శాతం కంటే తక్కువ మందే ఉంటున్నారు. ఆసుపత్రిలో చేరేవారు కూడా అతి స్వల్ప సంఖ్యలోనే ఉంటున్నారు.
ఒమిక్రాన్లో కనిపిస్తున్న లక్షణాలివి..
అత్యధికుల్లో తొలుత గొంతులో ఇబ్బంది, దురదతో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో తలనొప్పితోనూ వ్యాధి మొదలవుతోంది. పారాసెటమాల్ ఇచ్చినా తగ్గడం లేదు. తలనొప్పి కొందరికి ఒకవైపే వచ్చి తీవ్రంగా వేధిస్తుంది. ఆ తర్వాత గొంతునొప్పి, జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా ఉంటోంది. కొందరు చలి జ్వరంతోనూ ఇబ్బంది పడుతున్నారు. డెంగీలో వచ్చినట్లుగా ఒళ్లునొప్పులు వస్తున్నాయి. ఉన్నట్టుండి చెమట పడుతోంది. పిల్లల్లో కొందరికి వాంతులు వస్తున్నాయి. కళ్లు కూడా ఎర్రబడుతున్నాయి. కొందరిలో వ్యాధి తగ్గినా కూడా.. 2-3 వారాలైనా దగ్గు తగ్గడం లేదు. దీనికి వేర్వేరు కారణాలుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.సైనస్, గొంతు ఇన్ఫెక్షన్ వల్ల కూడా దగ్గు రావచ్చు. రాత్రివేళ పడుకున్నప్పుడు సైనస్ల నుంచి తెమడ ముక్కులోకి.. అక్కడి నుంచి గొంతులోకి జారుతుంది. దీన్ని బయటకు పంపించే ప్రక్రియలో భాగంగా దగ్గు వస్తుంది.అందుకే రాత్రి పూట ఎక్కువవుతుంది. పారాసెటమాల్ వేసుకున్నా తగ్గకపోతే.. ఇతర మందులు ప్రయత్నించాల్సి ఉంటుంది.
సీటీ స్కాన్లు చేయించడం లేదు
ఇప్పుడొస్తున్న ఇన్ఫెక్షన్లలో 95 శాతానికి పైగా ఒమిక్రానే. వైరస్ గొంతు వరకే పరిమితమవుతోంది. శ్వాసకోశాల్లోకి వెళ్లడం లేదు. గతంలో డీ డైమర్ విపరీతంగా పెరిగి, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు డీ డైమర్ కూడా పెరగడం లేదు. ఎక్స్రే, సీటీ స్కాన్లు కూడా చేయడంలేదు. నిమోనియా వైపు ఎక్కువ కేసులు వెళ్లడం లేదు. చాలా కొద్దిమందిలో..అదీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రమే ఆక్సిజన్ అవసరమవుతోంది. నిమ్స్లో అయితే ఒమిక్రాన్ బాధితుల్లో ఒక్కరు కూడా వెంటిలేటర్ పైకి వెళ్లలేదు. దీనివల్ల ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. చాలామంది పారాసెటమాల్తోనే కోలుకుంటున్నారు. దగ్గు మూణ్నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దగ్గు మందు ద్రావణాన్ని సూచిస్తున్నాం.గొంతునొప్పి మూణ్నాలుగు రోజులైనా తగ్గకపోతే..అజిత్రోమైసిన్ వంటి యాంటిబయాటిక్స్ ఇస్తున్నాం.
- డాక్టర్ పరంజ్యోతి, పల్మనాలజీ విభాగాధిపతి, నిమ్స్
లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రికి
డెల్టాలో సాధారణంగా పొడి దగ్గు వచ్చేది. ఒమిక్రాన్లో తెమడతో కూడా దగ్గు వస్తోంది. లక్షణాలు తక్కువగా ఉండి ఎక్కువ రోజులున్నా కూడా సీఆర్పీ వంటి కొన్ని పరీక్షలు చేయిస్తున్నాం.ఎందుకంటే అంతర్లీనంగా ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించాల్సిన అవసరముంది. నిమోనియా దశకు వెళ్లినప్పుడు ఆయాసం, ఛాతీ పట్టేసినట్లుగా ఉండడం, మానసికంగా అయోమయ స్థితి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంట్లో చికిత్స పొందుతున్న క్రమంలో.. మగతగా ఉండడం..రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువకు పడిపోతుండడం.. నాడి కొట్టుకోవడం 100 దాటుతున్నా..నిస్సత్తువ ఆవహించినా..డీడైమర్, సీఆర్పీ వంటి పరీక్షల్లో ఫలితాలు ఉండాల్సిన దాని కంటే 2-3 రెట్లు అధికంగా ఉన్నా..వెంటనే ఆసుపత్రిలో చేరాలని గుర్తుంచుకోవాలి.
- డాక్టర్ విశ్వనాథ్ గెల్లా, ప్రముఖ శ్వాసకోశ నిపుణులు, ఏఐజీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!