వంటింటి దినుసులతో ఒమిక్రాన్ నుంచి ఉపశమనం
రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. బాధితుల్లో అత్యధికులకు ఒమిక్రాన్ సోకుతోందని ఇటీవల ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఒమిక్రాన్లో ఎగువ శ్వాసకోశ సంబంధిత సాధారణ
సాధారణ లక్షణాలున్న వారికి ఆయుర్వేద చిట్కాలు
ఇంట్లోనే ఉంటూ కోలుకునే వెసులుబాటు
రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. బాధితుల్లో అత్యధికులకు ఒమిక్రాన్ సోకుతోందని ఇటీవల ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఒమిక్రాన్లో ఎగువ శ్వాసకోశ సంబంధిత సాధారణ ఇబ్బందులే తలెత్తుతున్నాయి. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించడం లేదు. అధిక శాతం బాధితులు ఇంటి వద్దే కోలుకుంటున్నారు. ఇలాంటి వారు వంటింటి దినుసులను ఉపయోగించుకుని కూడా కొంత ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతులో గరగర, గొంతు నొప్పి తదితర సాధారణ సమస్యలను ఇంట్లో వాడే పదార్థాలతోనే సాంత్వన పొందొచ్చని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.ఉమాశ్రీనివాస్ తెలిపారు. 14 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ వైద్యం ఉపయోగపడుతుందన్నారు. ఆ చిట్కాలు ఆయన మాటల్లోనే...
* జ్వరం, జలుబు, దగ్గు: అమృత (గుడూచి) ఆకులను దంచి రసాన్ని తీసి, టీస్పూన్ చొప్పున మూడు పూటలా తీసుకోవాలి. ఇలా అయిదు రోజులు చేస్తే.. జ్వరం, గొంతు నొప్పి తగ్గుతాయి. లేదా మహాలక్ష్మి విలాసరస్, లక్ష్మి విలాసరస్ మాత్రలు ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున 5 రోజులపాటు వేసుకోవచ్చు.
* దగ్గు: నాలుగు మిరియాలు దంచి తులసి ఆకుల రసంలో కలిపి ఉదయం, సాయంత్రం టీ స్పూన్ వంతున నాలుగు రోజులు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. గొంతునొప్పి పోవాలంటే పాలల్లో 5-6 గ్రాముల మిరియాల పొడి వేసి 5-7 రోజులపాటు తాగాలి.
* తలనొప్పి: శొంఠి అరగదీసి కణతలపై ఉదయం, సాయంత్రం పూసుకోవాలి.
* జలుబు, దగ్గు: పుదీనా ఆకు, తమలపాకుల రసం తీసి ఉదయం, సాయంత్రం టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. దీంతో పాటు ఒక లవంగ మొగ్గను నోట్లో వేసుకొని చప్పరించాలి.
* గొంతు నొప్పి: త్రిఫల చూర్ణాన్ని టీ స్పూన్ వంతున గ్లాసుడు గోరు వెచ్చటి నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం పుక్కిలించాలి.
పొడి దగ్గు: కరక్కాయ ముక్కను నోట్లో పెట్టుకొని రసం వచ్చేలా చప్పరిస్తూ ఉండాలి. ఇలా 3-5 రోజుల పాటు చేయాలి.
* మొండి దగ్గు: వాస (అడ్డసరం)ఆకు రసం తీసి టీ స్పూన్ వంతున ఉదయం, సాయంత్రం 5 రోజులపాటు తీసుకోవాలి.
* గొంతు గరగర: చిటికెడు పచ్చి పసుపును వేడి పాలలో వేసుకొని తాగాలి.
* ఇవి కాకుండా మహా సుదర్శన మాత్రలను ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున 5 రోజులు తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. చిత్రక హరిత లేహ్యం చెంచా వంతున ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి బయట పడవచ్చు.
* సాధారణ లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఈ చిట్కాల్లో అందుబాటులో ఉన్నవి ఎంచుకుని వినియోగించవచ్చు. తీవ్రమైన లక్షణాలతో పాటు ఆక్సిజన్ తగ్గిపోవడం, అయిదు రోజులు దాటినా తగ్గని జ్వరం, తీవ్ర నీరసం, వాంతులు, విరేచనాలు, అపస్మారక స్థితి, పల్స్ తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే ఆసుపత్రిలో చేరాలి.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్