గెజిట్ అమలు పురోగతి ఎంతవరకు వచ్చింది?
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల అప్పగింత, నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉందని కేంద్ర జల్శక్తిశాఖ ఆరా తీసింది. శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ గురువారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) ఛైర్మన్లతో ఆన్లైన్ వేదికగా సమీక్ష నిర్వహించారు
కృష్ణా, గోదావరి బోర్డులతో కేంద్ర జల్శక్తిశాఖ సమీక్ష
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల అప్పగింత, నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉందని కేంద్ర జల్శక్తిశాఖ ఆరా తీసింది. శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ గురువారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) ఛైర్మన్లతో ఆన్లైన్ వేదికగా సమీక్ష నిర్వహించారు. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్, కార్యదర్శి బీపీ పాండే, జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, కార్యదర్శి రాయ్పురే హైదరాబాద్లోని బోర్డుల ప్రధాన కార్యాలయాల నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. గతేడాది జులైలో కృష్ణా, గోదావరి నదులపైఉన్న పలు ప్రాజెక్టులను బోర్డులపరిధిలోకి చేర్చుతూ నోటిఫికేషన్ జారీ, దాని అమలు, పురోగతిపై పంకజ్కుమార్ వివరాలు అడిగినట్లు తెలిసింది. గెజిట్లో పేర్కొన్న వాటిలో కొన్నింటికి సంబంధించిన సమాచారాన్నే రెండు రాష్ట్రాలు అందజేశాయని, ప్రాజెక్టుల స్వాధీనానికి అభ్యంతరాలు లేవనెత్తుతున్న తీరు, సీడ్మనీపై ప్రభుత్వాల అభిప్రాయాలను బోర్డుల ఛైర్మన్లు వేర్వేరుగా వివరించినట్లు తెలిసింది.
శ్రీశైలం.. సాగర్లను బోర్డులకు అప్పగించండి
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని, దీనికి సంబంధించిన చర్చలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ రెండు రాష్ట్రాలకు సూచించారు. మూడో అపెక్స్ కౌన్సిల్కు సంబంధించి ఎజెండా రూపకల్పన సమావేశంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో గత నెల 28న ఈ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే సమావేశపు మినిట్స్ను గురువారం కేంద్రం విడుదల చేసింది. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సంబంధించి రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాంతాన్ని బోర్డులకు అప్పగించాలని, నిర్వహణకు సీడ్ మనీ, వనరులను కేటాయించాలని కూడా ఆయన రాష్ట్రాలకు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ: సుప్రీంకోర్టులో కేసును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. నదీ జలాల సమస్య పరిష్కారానికి కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 పరిధిలోకి తేవడమా లేదా కొత్త ట్రైబ్యనల్ ఏర్పాటు చేయడమా అనేది పరిశీలించాలి. సీడ్ మనీ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటాం. కేడబ్ల్యూడీటీ-1 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేటాయింపులు, నీటి విడుదల లెక్కలను తేల్చాల్సి ఉంది. దీంతోపాటు కృష్ణా బోర్డు రెండురాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకుంటుండగా గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రాధాన్యం కూడా అదే స్థాయిలో ఉండాలి. అనుమతులు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ సీఎం 2021 సెప్టెంబరులోనే కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్: అనుమతి పొందని జాబితాలోని ప్రాజెక్టుల విషయాన్ని సమీక్షించాలి. ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వచ్చిన తరువాత కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలను ఏర్పాటు చేయాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను అందించగానే అనుమతులిచ్చేలా చూడాలి. ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం,సాగర్ల పరిధిలోని కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించడంపై ఏపీ ఇప్పటికే జీవో జారీ చేసింది. తెలంగాణ చర్యలకు అనుగుణంగా ఇది అమల్లోకి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా