కళ తప్పిన పసుపు!
రాష్ట్రంలో పసుపు పంట సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకవైపు వర్షాలతో తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడులు తగ్గుతుండగా, ఇదే సమయంలో మార్కెట్లో పంటకు ధరలు తగ్గడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
పడిపోతున్న ధర
రైతుకు నష్టాల భారం
అధిక వర్షాలు, తెగుళ్లతో దెబ్బతిన్న పంట
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పసుపు పంట సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకవైపు వర్షాలతో తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడులు తగ్గుతుండగా, ఇదే సమయంలో మార్కెట్లో పంటకు ధరలు తగ్గడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం క్వింటా కొత్త పసుపు ధర రూ.300 దాకా తగ్గి రూ.8411కి చేరింది. కనిష్ఠ ధర క్వింటాకు రూ.4501 మాత్రమే ఇచ్చారు. ఎక్కువ మంది రైతులకు సగటు ధర రూ.5333 చొప్పున వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లకు వస్తున్న కొత్త పసుపు పంటలో తేమ అధికంగా ఉంటోందని వ్యాపారులు ధర బాగా తగ్గించేస్తున్నారు. రాష్ట్రంలో పసుపు సాగవుతున్న కొన్ని జిల్లాల్లో సాధారణంకన్నా 30 నుంచి 50 శాతం అదనంగా కురిసిన వర్షాలతో నేలలో తేమ పెరిగి దుంపకుళ్లు తెగులు వ్యాపించింది. ఈ కారణంగా పంట దిగుబడి 20 శాతానికి పైగా తగ్గవచ్చని ‘భారత పసుపు వ్యాపారుల సంఘం’(ఐటీఏ) అంచనా వేసింది. సాధారణంగా తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్ర మార్కెట్లలో ధరలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం అక్కడే తక్కువగా ఉంది. క్వింటా ధర రూ.9 వేలకుపైగా ఉంటేనే రైతుకు గిట్టుబాటవుతుందని రాష్ట్ర ఉద్యానశాఖ అంచనా. ‘‘సాధారణంగా పసుపు సాగుకు ఎకరాకు రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ధరలు పుంజుకోకపోతే పెట్టుబడుల్లో సగం కూడా వచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ ఉద్యానశాఖ కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదు. ‘‘ఈ పంటకు ఎంత ధర ఇవ్వాలనేది వ్యాపారుల ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటోంది. ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్రకన్నా ఎప్పుడూ క్వింటాకు రూ.వెయ్యి నుంచి 3 వేల దాకా తక్కువ చెల్లిస్తున్నారు. అందుకే ఏటా పంట విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది’’ అని రైతులు వాపోతున్నారు.
వేచిచూస్తే ధరలు పెరగొచ్చు
‘‘వర్షాలతో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ పంట దిగుబడులు తగ్గాయి. 2020లో దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లకు 97 లక్షల బస్తాల పసుపు వచ్చింది. ఒక్కో బస్తా 50 కిలోలుంటుంది. ఈ ఏడాది 94.20 లక్షల బస్తాలకు మించి రాకపోవచ్చని భారత పసుపు వ్యాపారుల సంఘం అంచనా. ఇందులో తెలంగాణలోనే అత్యధికంగా 25.90 లక్షల బస్తాలుండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మళ్లీ పసుపు వినియోగం పెరిగి ఎగుమతులు పుంజుకునే అవకాశాలున్నాయి. రాష్ట్ర రైతులు కొత్త పసుపు పంటను ఈ నెలాఖరు నుంచి మార్కెట్లకు తేవడం ఆరంభిస్తారు. వారు వేచిచూస్తే కొంతకాలానికి ధరలు పెరిగే అవకాశాలున్నాయి’’ అని ఐటీఏ ప్రతినిధులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలి
లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలని కోరుతూ తెలంగాణ మాదిగ దండోరా, మాదిగ జేఏసీ ప్రతినిధులు దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఐదు జతల ప్రత్యేక రైళ్లను మరికొద్దిరోజులు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి
బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గురువారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. -
సంక్షిప్త వార్తలు
ఫోన్ ట్యాపింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్, నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్