వైద్యుల పనివేళలపై నిఘా
ప్రాథమిక వైద్య కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా కఠిన చర్యలు చేపట్టాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని బస్తీ దవాఖానాలు, గ్రామీణ,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయనున్నారు.
ప్రాథమిక వైద్య కేంద్రాల్లో సీసీ కెమెరాలు
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
వచ్చే నెల 1 నుంచి అన్ని పీహెచ్సీల్లో అమలు
ఈనాడు-హైదరాబాద్: ప్రాథమిక వైద్య కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా కఠిన చర్యలు చేపట్టాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని బస్తీ దవాఖానాలు, గ్రామీణ,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయనున్నారు. అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఈసీఐఎల్ సంస్థ అందించనుంది. కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చే వారంలో ప్రయోగాత్మకంగా అమలు చేసి, వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలోని అన్ని బస్తీ దవాఖానాలు, పీహెచ్సీల్లోనూ ఆచరణలోకి తేనున్నారు. ఇటీవల వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆరోగ్య మంత్రి హరీశ్రావు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో..అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సేవలందిస్తున్నాయి. అత్యధిక చోట్ల సమయపాలన పాటించడం లేదని గుర్తించిన సర్కారు ఈ ఏర్పాట్లు చేయనుంది. ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను పెట్టి వాటిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణకు అనుసంధానం చేస్తారు. సమయపాలనను పరిశీలించడమే కాకుండా..ఓపీ ఎంతుంది? ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నీషియన్లు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా? తదితర అంశాలను కూడా పరిశీలించ వచ్చని, ఓపీ నమోదు అవకతవకలపై కూడా దృష్టిసారించవచ్చని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు వివిధ పథకాల నేపథ్యంలో కొన్ని పీహెచ్సీల్లో ఎక్కువ మంది సిబ్బంది ఉండగా.. మరికొన్ని చోట్ల కొరత ఏర్పడింది. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
సంక్షిప్త వార్తలు
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?