Microsoft: హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా కేంద్రం
ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలో తన నాలుగో డేటా కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. దీనికోసం దశల వారీగా 15 ఏళ్ల కాలంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సోమవారం హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల
ఈనాడు - హైదరాబాద్
ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలో తన నాలుగో డేటా కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. దీనికోసం దశల వారీగా 15 ఏళ్ల కాలంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సోమవారం హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు ఈ వివరాలను తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక, వస్తున్న అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదొకటని వివరించారు. మైక్రోసాఫ్ట్ దేశంలో అతి పెద్ద డేటా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందున, స్థానికంగా ఎన్నో వ్యాపారాల అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు వీలవుతుందన్నారు. డేటా, నెట్వర్క్ సెక్యూరిటీ, నెట్వర్క్ ఇంజినీరింగ్ నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు. గత ఏడేళ్లలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కేంద్ర ఉద్యోగుల సంఖ్య 3 రెట్లు పెరిగి 9,000కు చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వం క్లౌడ్ సేవలను వినియోగించుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఎంతో సహకరిస్తోందన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పుణె, ముంబయి, చెన్నైలలోని తమ డేటా కేంద్రాల సామర్థ్యాన్ని రెట్టింపు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ డేటా కేంద్రం తొలిదశ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తొలుత ఇది తక్కువ సామర్థ్యంతోనే ప్రారంభమైనా, దశల వారీగా అతి పెద్ద డేటా కేంద్రంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. పెట్టుబడులూ అందుకు తగ్గట్టుగానే ఉంటాయన్నారు. ఈ కొత్త కేంద్రం క్లౌడ్ను మరింత శక్తిమంతం చేయడంతో పాటు, అంకుర సంస్థలకు సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఐడీసీ నివేదిక ప్రకారం మైక్రోసాఫ్ట్కు దేశంలో ఉన్న 3 డేటా కేంద్రాల ద్వారా 2016-20 మధ్య 9.5 బిలియన్ డాలర్ల ఆదాయం (సుమారు రూ.71,000 కోట్లకు పైగా) ఆర్థిక వ్యవస్థకు చేరిందని, 1.50 లక్షల ఉద్యోగాలు, 1.69 లక్షల మంది నిపుణుల తయారీకి ఇవి తోడ్పాటునందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రిఫ్మాన్, రాష్ట్ర ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ పాల్గొన్నారు.
రెండేళ్లలో 120 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు
దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మైక్రోసాఫ్ట్ డేటా కేంద్రాలు ఎంతో తోడ్పాటునందిస్తాయని, దీర్ఘకాలిక పెట్టుబడులకు వీలు కల్పిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 80 కోట్ల వరకూ ఉందని, రెండేళ్లలో ఈ సంఖ్య 120 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటలీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని, అన్ని ప్రభుత్వ విభాగాలు యాప్ల ద్వారా సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
రూ.276 కోట్లతో స్థలాల కొనుగోలు
మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న డేటా కేంద్రం కోసం మూడు స్థలాలను రూ.276 కోట్లతో కొనుగోలు చేసిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. పొత్తూరు సమీపంలోని మేకగూడలో 22 ఎకరాలు, షాద్నగర్లో 41 ఎకరాలు, చందనవెళ్లిలో 52 ఎకరాలు సమకూర్చుకున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ స్థిరాస్తి సేవల సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఈ లావాదేవీలను పూర్తి చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!