EPFO: ఈపీఎఫ్ వడ్డీలో కోత
వేతన జీవులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) షాక్ ఇచ్చింది. ఈపీఎఫ్ నిల్వలపై ఏటా ఇచ్చే వడ్డీని 0.4 శాతం తగ్గించింది. గువాహటిలో సమావేశమైన ఈపీఎఫ్వో ట్రస్టీ బోర్డు 2021-22 ఏడాదికి వడ్డీ రేటుని 8.1 శాతంగా నిర్ణయించింది.
భవిష్య నిధిపై వడ్డీరేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు
ప్రతి రూ.లక్షపై రూ. 432 తగ్గనున్న ఆదాయం
1977-78 తర్వాత ఇదే అతి తక్కువ
ఈనాడు, హైదరాబాద్: వేతన జీవులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) షాక్ ఇచ్చింది. ఈపీఎఫ్ నిల్వలపై ఏటా ఇచ్చే వడ్డీని 0.4 శాతం తగ్గించింది. గువాహటిలో సమావేశమైన ఈపీఎఫ్వో ట్రస్టీ బోర్డు 2021-22 ఏడాదికి వడ్డీ రేటుని 8.1 శాతంగా నిర్ణయించింది. గత ఏడాది 8.5 శాతమే అతి తక్కువ వడ్డీరేటని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ ఏడాదికి మరింత తగ్గించడం విశేషం. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మంది చందాదారులపై ప్రభావం చూపనుంది. దాదాపు 44 ఏళ్ల తరువాత ఇదే అత్యంత తక్కువ వడ్డీరేటు కావడం గమనార్హం. ఈపీఎఫ్ పథకం 1952లో అమల్లోకి వచ్చింది. ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తిచేసుకోనుంది. ఈపీఎఫ్వోకు వచ్చిన చందా సొమ్మును షేర్లు (ఈక్విటీ), బ్యాంకుల్లో పెట్టుబడిగా పెట్టి, ఆ మొత్తంపై వచ్చే లాభాన్ని వడ్డీగా చందాదారుల ఖాతాల్లో జమచేస్తోంది. గతంలో ఈపీఎఫ్వో బోర్డు సొంతంగా నిర్ణయాలు తీసుకుని వడ్డీ ఇచ్చేది. గత పదేళ్లుగా ఆర్థికశాఖ సూచన మేరకు వడ్డీరేట్లు ఖరారవుతున్నాయి. చిన్నమొత్తాల పొదుపు వడ్డీరేట్లతో పోలిస్తే ఈపీఎఫ్వో ఇచ్చే వడ్డీ రేటు ఎక్కువగా ఉండటంతో వేతన జీవులు పీఎఫ్ ఖాతాల్లో స్వచ్ఛంద భవిష్యనిధి (వీపీఎఫ్) కింద అదనంగా జమ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని నియంత్రించేందుకు అదనపు పెట్టుబడులు (ఈపీఎఫ్, వీపీఎఫ్ కలిపి) రూ.2.5 లక్షలు దాటితే ఆ మొత్తంపై వడ్డీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు.
1977-78లో 8 శాతం వడ్డీ
1977-78లో పీఎఫ్ వడ్డీరేటు 8 శాతంగా ఉంటే, ప్రస్తుతం 8.1 శాతంగా నిర్ణయించారు. గత 44 ఏళ్లలో ఎప్పుడూ పీఎఫ్ వడ్డీరేటు ఈస్థాయిలో తగ్గలేదు. ఈపీఎఫ్ వడ్డీరేట్లను చిన్నమొత్తాల పొదుపు వడ్డీరేట్లతో సమానంగా తీసుకురావాలన్నలక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కోత ఎందుకంటే...
‘‘ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 8.1 శాతానికి సిఫార్సు చేశాం. మేం ఇప్పుడు నష్టభయం అధికంగా ఉండే వాటిలో పెట్టుబడులు పెట్టలేం. సామాజిక భద్రతను, మార్కెట్ స్థిరత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి’’ అని ఈపీఎఫ్వో ట్రస్టీ బోర్డు సభ్యుల సమావేశం అనంతరం కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.
విమర్శించిన ప్రతిపక్షాలు
ఈపీఎఫ్వో వడ్డీ రేటు తగ్గింపును కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు వడ్డీరేటు తగ్గింపు రూపంలో భాజపా తిరుగు బహుమతి ఇచ్చిందని విమర్శించింది. వామపక్షాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్నివ్యతిరేకించాయి. ఎన్నికల్లో గెలుపు తర్వాత ప్రజలపై భాజపా ప్రతీకార దాడులను పెంచిందని సీపీఎం ఆరోపించింది. వడ్డీ రేటును పెంచాల్సింది పోయి.. తగ్గిస్తారా అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీపీఐ లేఖ రాసింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అభ్యర్థించింది.
ఎంత తగ్గుతుందంటే?
ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి, యజమాని వాటా, ఈపీఎస్ పేరిట మూడు ఖాతాలు ఉంటాయి. ఈపీఎస్ అనేది భవిష్యత్తులో ఇచ్చే పింఛను నిధి. ఈ నిధిపై ఎలాంటి వడ్డీ లభించదు. ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో వేతనం నుంచి చెల్లించే నిర్బంధ చందాతో పాటు స్వచ్ఛందంగా చెల్లించే వీపీఎఫ్ చందా కలిపి ఉంటాయి. యజమాని వాటాలో ఈపీఎస్ చందా తీసివేయగా మిగతా మొత్తాన్ని యజమాని ఖాతా కింద చూపిస్తారు. ఉద్యోగి, యజమాని ఖాతాల్లోని మొత్తానికి కలిపి ఈపీఎఫ్వో వడ్డీ చెల్లిస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో ఉద్యోగి, యజమాని చందా మొత్తం రూ.లక్ష ఉంటే.. 2020-21 ఏడాది వడ్డీరేటు 8.5% ప్రకారం ఏడాదికి రూ.8,839 వడ్డీ జమవుతుంది. 2021-22 ఏడాదికి వడ్డీరేటు 8.1 శాతంగా నిర్ణయించడంతో రూ.8,407 వడ్డీ మాత్రమే వస్తుంది. అంటే ప్రతి లక్షకు వచ్చే వడ్డీ రూ.432 తగ్గుతుంది.ఈ లెక్కన పీఎఫ్ ఖాతాలో ఎంతనగదు ఉంటే.. ఆ మేరకు వచ్చే వడ్డీ తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు