కృష్ణా, గోదావరి బోర్డుల పాపం కాంగ్రెస్దే..
కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. వాటి ప్రస్తావనతో కాంగ్రెస్ ప్రాజెక్టులకు ఉరి వేస్తే.. నేటి భాజపా ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందని మంత్రి హరీశ్రావు
రాష్ట్రం ఫిర్యాదుతోనే రాయలసీమ లిఫ్టుపై కోర్టు స్టే ఇచ్చింది
శాసనసభలో మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. వాటి ప్రస్తావనతో కాంగ్రెస్ ప్రాజెక్టులకు ఉరి వేస్తే.. నేటి భాజపా ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. గోదావరిపై ఆరు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను ఆరు నెలల క్రితమే గోదావరి బోర్డుకు ప్రభుత్వం ఇచ్చింది. రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతోనే రాయలసీమ ఎత్తిపోతలపై కోర్టు స్టే విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సారెస్పీ పూర్తిచేయడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కరవు తాండవం చేసింది. ఎంతోమంది వలస పోయేవారు. కాంగ్రెస్ పాలనలో బొంబాయి.. దుబాయి.. బొగ్గుబాయి గాక మరేముంది? కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో నిర్మించాం. గోదావరి, కావేరి అనుసంధానం పెద్ద జోకు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయ్యాకనే అనుసంధానం విషయం ఆలోచిస్తామని సీఎం ఎన్నోసార్లు చెప్పారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు రూ. 77,852 కోట్లు వ్యయం చేశాం. పాదయాత్రలో మల్లన్నసాగర్తోపాటు మిగిలిన జలాశయాలు కూడా భట్టి విక్రమార్క సందర్శించొచ్చు. ఆ నీటిని నెత్తినపోసుకుంటే కాంగ్రెస్ పాలనలో చేసిన పాపాలైనా పోతాయి’’ అని అన్నారు.
భావితరాల బాగు కోసమే అప్పులు
భావితరాల అవసరాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం క్యాపిటల్ వ్యయానికే అప్పులు చేస్తున్నాం. ఏటా ఎఫ్ఆర్బీఎంను కేంద్రం, ఆర్బీఐ పరిమితులు, నిబంధనల మేరకు సవరించుకోవడం ప్రహసనంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఏడాదికి ముందుగానే పెంచుకునేందుకు చట్టాన్ని సవరించుకుంటున్నాం. దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితాలో కింది నుంచి పైకి నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది. దేశం అప్పుల శాతం 62.6 కాగా తెలంగాణది 27 శాతం మాత్రమే. అప్పులు విషయంలో కాంగ్రెస్ ఆందోళన అర్థం లేనిది. వాస్తవానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పంజాబ్ (మొన్నటి వరకు) 49.1, ఛత్తీస్గఢ్ 28.6, రాజస్థాన్ 42.6 శాతం అప్పులు చేశాయి. దేశంలో అనేక రాష్ట్రాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. మనం చేసిన అప్పులతో ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు, మౌలిక వసతులు కల్పించుకుంటున్నాం. అని మంత్రి హరీశ్రావు తెలిపారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎ.ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆయా పద్దులపై సమాధానాలు ఇచ్చారు.
పలు బిల్లులకు ఆమోదం
ఎఫ్ఆర్బీఎం సవరణ బిల్లు, మార్కెట్ కమిటీల్లో పాలకవర్గ సభ్యుల సంఖ్య, కాలపరిమితి పెంపు బిల్లులను సభ ఆమోదించింది. సాగునీటి పారుదల, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, రహదారులు-భవనాలు, ఇంధనశాఖ, న్యాయశాఖ, ప్రణాళిక-ఆర్థిక శాఖల పద్దులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్