Telangana News: దిల్లీలో ధాన్యం మంటలు
ధాన్యం సేకరణ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు నిరంజన్రెడ్డి, కమలాకర్, అజయ్, ప్రశాంత్రెడ్డిలు సమావేశమైనప్పటికీ విషయం కొలిక్కిరాలేదు. పైగా రాజకీయంగా మంటలు రాజేసింది. తెలంగాణలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులను తప్పుదారి పట్టిస్తోందని గోయల్ ఆరోపించగా..
కొలిక్కిరాని ధాన్యం సేకరణ వ్యవహారం
పరస్పరం ఆరోపణలకు దిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ధాన్యం సేకరణ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు నిరంజన్రెడ్డి, కమలాకర్, అజయ్, ప్రశాంత్రెడ్డిలు సమావేశమైనప్పటికీ విషయం కొలిక్కిరాలేదు. పైగా రాజకీయంగా మంటలు రాజేసింది. తెలంగాణలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులను తప్పుదారి పట్టిస్తోందని గోయల్ ఆరోపించగా...తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటుచేయండంటూ కేంద్రమంత్రి అవమానించారని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. కేంద్రానికి వ్యవసాయ ఆత్మ లేదని, అది పక్కా వ్యాపారాత్మక ప్రభుత్వమని విమర్శించారు. వ్యవసాయాధారిత దేశాన్ని పాలించే ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలు దానికి లేకపోవడం దౌర్భాగ్యమని నిప్పులు చెరిగారు.
ఒప్పందం మేరకు బియ్యం తీసుకుంటాం
రాష్ట్రాలు తాము సేకరించిన బియ్యాన్ని స్థానిక అవసరాలకు తగినంత వాడుకొని మిగిలింది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేలా అన్ని రాష్ట్రాలతో ఒప్పందం జరిగింది. అందుకు సంబంధించిన ఒప్పందపత్రం నా చేతుల్లో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ముడి బియ్యాన్ని మాత్రమే అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. సొంత అవసరాలకుపోను మిగిలిన బియ్యాన్నంతా ముడిరూపంలో కొనుగోలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇచ్చిన మాటకు మేం కట్టుబడి ఉన్నాం. అయితే కొంతమంది అక్కడి నేతలు నిరాధారమైన ఆరోపణలుచేస్తూ రైతులను తప్పుదోవపట్టిస్తున్నారు. దానిని తక్షణం ఆపాలి.
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయాలట
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాతో చులకనగా, హేళనగా మాట్లాడారు. తెలివి తన సొంతమన్నట్లు.. గతంలో చెప్పానుగా అంటూ తేలికగా మాట్లాడారు. బియ్యం మాత్రమే తీసుకుంటాం అన్నారు.. యాసంగి పంటలో మా దగ్గర నూక వస్తుందని చెబితే మీ ప్రజలకు నూకలు అలవాటు చేయండంటూ తెలంగాణవారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. బియ్యం కొనం... మీ ఖర్మ అన్నట్లు వ్యవహరించారు. ఈ పరాభవాన్ని ఎవరూ మర్చిపోరు. మరింత కసిగా పని చేస్తాం.. ప్రధానమంత్రిని ఇంటికి పంపే రోజు వస్తుంది. రాష్ట్ర రైతులను ఎలా ఆదుకోవాలో.. ఏం చేయాలో సీఎం కేసీఆర్కు తెలుసు. ఇక్కడి విషయాలను సీఎంకు తెలిపి ఆయన సూచనల మేరకు ముందుకు వెళతాం.
-వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
ఆద్యంతం.. చిటపటలే...!
ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రుల మధ్య వాగ్వాదం..
ఈనాడు, దిల్లీ: తెలంగాణలో పండిన ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం మధ్య జరిగిన సమావేశంలో చర్చ ఆద్యంతం చిటపటలు.. మాటల యుద్ధంలానే సాగినట్లు సమాచారం.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసిన వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధాన్యం సేకరణపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలు.. మంత్రి కేటీఆర్తో కలిసి తాము వచ్చినప్పుడు అంశాలను వివరిస్తుండగానే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎదురుదాడి ప్రారంభించారు. పారాబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను చూపుతూ ఎందుకు మాటతప్పుతున్నారంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్రెడ్డి అంతే దీటుగా ఆయనకు బదులిచ్చారు. సమస్యను మీరు అర్థం చేసుకోవాలని.. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన తీరును, అందుకు రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టాన్ని తెలుసుకోవాలన్నారు. మిగతా రాష్ట్రాల్లో లేని సమస్య.. మీ రాష్ట్రంలో ఎందుకు వస్తోంది? మీరు రాజకీయ ప్రయోజనాలకు ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి అనడంతో.. ఆ అవసరం తమకు లేదని.. రైతు ప్రయోజనాల కోసమే తాము ప్రయత్నిస్తున్నామంటూ రాష్ట్ర మంత్రులు బదులిచ్చారు. పంజాబ్లో మాదిరే పంట అంతా కొనాలని రాష్ట్ర మంత్రులు కోరగా.. అక్కడ ఒక్కటే పంట అని పీయూష్ అన్నారు. మా దగ్గర యాసంగి ధాన్యం మర ఆడిస్తే నూక అవుతుందని రాష్ట్ర మంత్రులు తెలపగా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఈ సమయంలో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని కేంద్రమంత్రి అనగా.. మీరు కేంద్రంలో చెప్పే మాటలకు.. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో చెప్పే మాటలకు పొంతన లేదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
మీరు ధాన్యం కొనలేమంటారని.. మీవాళ్లు అక్కడ కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీలు ఇస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, ప్రశాంత్రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ధాన్యం సేకరణలో ఇప్పుడున్న విధానాన్ని ప్రజలకోసం మార్చాలని ప్రశాంత్రెడ్డి కోరగా మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మార్చండని పీయూష్ అన్నారు. భగవంతుడు దయతలిస్తే తప్పకుండా అధికారం చేపడతామని, మీరు కూడా ఇద్దరితో మొదలై ప్రభుత్వం ఏర్పాటుచేసే వరకు వచ్చారుకదా? అని ప్రశాంత్రెడ్డి బదులిచ్చారు. మొత్తమ్మీద 40 నిమిషాలకుపైగా సాగిన సమావేశంలో చర్చ ఆద్యంతం మాటలయుద్ధంగానే సాగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా