113 గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్
హైదరాబాద్ ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణం కార్యరూపంలోకి తీసుకువచ్చేదిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణ అధికారుల నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేయడంతో మరో ముందడుగు పడింది. రహదారి ఉత్తరభాగం వెళ్లే గ్రామాల ప్రాథమిక జాబితాతో కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
భూములు గుర్తించాక గ్రామాల తుది జాబితా ఖరారు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణం కార్యరూపంలోకి తీసుకువచ్చేదిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణ అధికారుల నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేయడంతో మరో ముందడుగు పడింది. రహదారి ఉత్తరభాగం వెళ్లే గ్రామాల ప్రాథమిక జాబితాతో కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగ్దేవ్పూర్- భువనగిరి- చౌటుప్పల్ మీదుగా ఉత్తరభాగం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ భాగం 158.645 కిలోమీటర్ల మేర సాగుతుంది. భారత్మాల పరియోజన కింద కేంద్ర నిధులతో హరిత రహదారిగా నిర్మించనున్న దీనికి భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. నిర్మాణం మొత్తం కేంద్ర నిధులతో సాగుతుంది. పూర్తి ఎక్స్ప్రెస్ వేగా, రెండు భాగాలుగా నిర్మించే 344 కిలోమీటర్ల మార్గంలో.. ఉత్తర భాగానికి కేంద్రం గత ఏడాది ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దక్షిణ భాగానికి తాత్కాలిక జాతీయ నంబరు కేటాయించాల్సి ఉంది.ఉత్తర భాగం భూసేకరణకు అనుమతి లభించినందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూములను గుర్తించనున్నారు.
భూములను గుర్తించిన తరువాత ఆ వివరాలతో మరో దఫా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో 113 గ్రామాలను పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో 34 గ్రామాలు, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 35, సిద్దిపేటలో 24, సంగారెడ్డి జిల్లాలో 20 గ్రామాల మీదుగా ఈ మార్గం వెళ్లనుంది. అధికారులు క్షేత్రస్థాయిలో భూసేకరణ ప్రక్రియ చేపట్టిన తరువాత సాంకేతికంగా జారీ చేసే నోటిఫికేషన్లో గ్రామాల తుది జాబితా ఖరారవుతుందని అధికారిక సమాచారం.
యాదాద్రి-భువనగిరి జిల్లా...
చౌటుప్పల్ ఆర్డీవో పరిధిలోని గ్రామాలు: చిన్నకొండూరు, చౌటుప్పల్, లింగోజిగూడెం, పంతంగి, నేలపట్ల, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగడపల్లి (చౌటుప్పల్ మండలం), వర్కట్పల్లి, గోకారం, పొద్దుటూరు, వలిగొండ, సంగెం, పహిల్వాన్పూర్, కంచనపల్లి, టేకుల సోమారం, రెడ్లరేపాక (వలిగొండ మండలం).
భువనగిరి ఆర్డీవో పరిధి: రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికలపహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్నగర్, ఎర్రంబల్లి, నందనం (భువనగిరి మండలం).
యాదాద్రి-భువనగరి అదనపు కలెక్టర్ పరిధి:: మల్లాపురం, దాతార్పల్లి (యాదగిరిగుట్ట మండలం). గంధమల్ల, వీరారెడ్డిపల్లి, కొండాపూర్/కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయిపల్లి, వేల్పుపల్లి (తుర్కపల్లి మండలం).
సిద్దిపేట జిల్లా...
గజ్వేల్ ఆర్డీవో పరిధి: బేగంపేట, ఎల్కల్ (రాయపోల్ మండలం). బంగ్లా వెంకటాపూర్, మక్తామాసాన్పల్లి, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముట్రాజ్పల్లి, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లె, పాములపర్తి (గజ్వేల్ మండలం). మజిద్పల్లి, నెంటూరు, జబ్బాపూర్, మైలారం, కొండాయిపల్లి (వర్గల్ మండలం). మర్కూక్, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి (మర్కూక్ మండలం). ఆలిరాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లె (జగ్దేవ్పూర్ మండలం).
మెదక్ జిల్లా...
తూప్రాన్ ఆర్డీవో పరిధి: వట్టూరు, జండపల్లి, నాగులపల్లి, ఇస్లాంపూర్, దాతర్పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్, వెంకటాయిపల్లి, కిష్టాపూర్, తుప్రాన్, నర్సంపల్లి, (తూప్రాన్ మం). నర్సాపూర్ ఆర్డీవో పరిధి: వెంకటాపూర్ (కౌడిపల్లి). లింగోజిగూడ, పాంబండ, పోతులబొగుడ, కొంతాన్పల్లి, గుండ్లపల్లి, ఉసిరికపల్లి, రత్నాపూర్, కొత్తపేట(శివ్వంపేట్ మం.). నాగులపల్లి, మూసాపేట, మహ్మదాబాద్/జానకంపేట, రెడ్డిపల్లి, ఖాజీపేట, తిరుమలాపూర్, గొల్లపల్లి, అచ్చంపేట, చిన్నచింతకుంట, పెద్దచింతకుంట, సీతారాంపూర్, రుస్తుంపేట, మంతూర్, మల్పర్తి, తుజాల్పూర్ (నర్సాపూర్).
సంగారెడ్డి జిల్లా...
సంగారెడ్డి ఆర్డీవో పరిధి: సంగారెడ్డి, నాగాపూర్, ఇరిగిపల్లి, చింతలపల్లి, కల్పగూర్, తాళ్లపల్లి, కుల్పగూర్ (సంగారెడ్డి మండలం). పెద్దాపూర్(సదాశివపేట మండలం). కాసాల, దేవులపల్లి, హత్నూర, దౌల్తాబాద్ కొత్తపేట, సికిందర్పూర్(హత్నూర్ మండలం).
ఆందోల్-జోగిపేట ఆర్డీవో పరిధి: శివంపేట, వేండికోల్, అంగడికిష్టాపూర్, లింగాపల్లి, కోర్పోల్(చౌటకూర మండలం). గిర్మాపూర్, మల్కాపూర్ (కొండాపూర్ మండలం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల