Vaccination: 18 ఏళ్లు పైబడినవారికి రేపటి నుంచి మూడో డోసు
దేశంలో 18 ఏళ్లు దాటిన వారంతా ఇక కొవిడ్ టీకా ముందుజాగ్రత్త (మూడో) డోసు తీసుకోవచ్చు. ఈనెల 10వ తేదీ (ఆదివారం) నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వారంతా టీకాలు పొందవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన
ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అందుబాటులోకి..
దిల్లీ: దేశంలో 18 ఏళ్లు దాటిన వారంతా ఇక కొవిడ్ టీకా ముందుజాగ్రత్త (మూడో) డోసు తీసుకోవచ్చు. ఈనెల 10వ తేదీ (ఆదివారం) నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వారంతా టీకాలు పొందవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన తర్వాత ముందుజాగ్రత్త డోసు తీసుకోవడానికి అర్హులవుతారని తెలిపింది. అన్ని ప్రైవేటు టీకా కేంద్రాల్లోనూ మూడో డోసు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇది అదనపు రక్షణ కవచంలా ఉంటుందని సంబంధిత శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. తొలి రెండు డోసుల కింద ఏ వ్యాక్సిన్ను పొందారో మూడో డోసుగా కూడా దాన్నే తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా 18 ఏళ్లు పైబడిన వారికి ముందుజాగ్రత్త డోసు వ్యాక్సినేషన్కు సంబంధించి తుది మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.దేశంలో 15 ఏళ్లు దాటినవారిలో ఇంతవరకు 96% మంది కనీసం ఒక డోసు తీసుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది. 83% మంది రెండు డోసులూ పొందినట్లు తెలిపింది. అలాగే ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి 2.4 కోట్లకు పైగా ముందుజాగ్రత్త డోసులు అందించినట్లు వెల్లడించింది. 12-14 ఏళ్ల వారిలో 45 శాతం మంది తొలి డోసు తీసుకున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో.. మొదటి, రెండో డోసులు; ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ముందుజాగ్రత్త డోసులు వేసే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించింది.
కొవిషీల్డ్ ధర రూ. 600
కొవిషీల్డ్ ముందుజాగ్రత్త డోసు ధరను రూ. 600గా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. టీకా తీసుకునేవారు ఈ ధర చెల్లించాల్సి ఉంటుందని, ఆసుపత్రులకు రాయితీ ధరకు అందజేస్తామని ఎస్ఐఐ సీఈవో అదార్ పూనావాలా ఓ ప్రకటనలో తెలిపారు.
స్వల్పంగా పెరిగిన కేసులు
దిల్లీ: దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య శుక్రవారం స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉ. 8గంటల వరకు) కొత్తగా 1,109 మంది కొవిడ్ బారిన పడగా.. 43 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే 76 కేసులు పెరిగాయి. క్రియాశీలక కేసుల సంఖ్య 11,492 (0.03%)కి చేరింది. దేశవ్యాప్తంగా గురువారం 4,53,582 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో కొత్తగా 35 కొవిడ్ కేసులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 35 కొవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,91,461కి పెరిగింది. తాజాగా మరో 36 మంది కోలుకున్నారు. ఈ నెల 8 సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్