Telangana News: నేను కాంగ్రెస్లో చేరినా తెరాసకు ఐప్యాక్ సేవలు
తాను కాంగ్రెస్లో చేరినా తన ఐప్యాక్ సంస్థ తెరాస కోసం యథాతథంగా పనిచేస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్కిశోర్ ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ను కలుపుకొనివెళ్లే...
జాతీయస్థాయి ప్రత్యామ్నాయ వేదికలో కాంగ్రెస్కు చోటివ్వాలి
అన్ని శక్తులూ ఏకమైతేనే భాజపాను గద్దె దించగలం
కొందరు ఎమ్మెల్యేలను మార్చాలి
సీఎం కేసీఆర్తో ప్రశాంత్కిశోర్
భాజపా, కాంగ్రెస్లకు దూరంగా ఉంటామని కేసీఆర్ స్పష్టీకరణ
ఈనాడు - హైదరాబాద్
తాను కాంగ్రెస్లో చేరినా తన ఐప్యాక్ సంస్థ తెరాస కోసం యథాతథంగా పనిచేస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్కిశోర్ ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ను కలుపుకొనివెళ్లే విషయంపై ఆలోచించాలని కోరారు. భాజపా వ్యతిరేకశక్తులన్నీ ఏకమైతేనే ఆ పార్టీని గద్దె దింపగలమని వెల్లడించారు. అయితే, తాము భాజపా, కాంగ్రెస్లతో సమదూరం పాటిస్తామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీలు లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు సాధ్యమేనని ఆయన అన్నట్లు సమాచారం. ఆదివారం రెండో రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు సీఎం కేసీఆర్తో పీకే సమావేశమయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భాజపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలనే లక్ష్యంతో ఆ పార్టీని ఎంచుకున్నానని పీకే పేర్కొన్నట్లు తెలిసింది. తాను కాంగ్రెస్లో చేరినా... తమ సంస్థ ఐప్యాక్ తెరాసకు రాజకీయ సలహా సేవలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా తెరాస, ఇతర పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై నిర్వహించిన సర్వే ఫలితాలను సీఎంకు పీకే వివరించినట్లు తెలుస్తోంది.
ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి
భాజపాపై దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని ఇతర పక్షాలన్నీ సొమ్ము చేసుకోవాలని పీకే సూచించినట్లు తెలిసింది. గతంతో పోలిస్తే భాజపాకు లోక్సభ సీట్ల శాతం తగ్గుతుందని, విపక్షాల సీట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాతైనా భాజపా వ్యతిరేక శక్తులు ఏకం కావాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాము భాజపా, కాంగ్రెస్లకు దూరంగా ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని సమాచారం. భాజపా, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమే బలంగా రూపుదిద్దుకుంటుందని అన్నట్లు తెలుస్తోంది. అది సాధ్యం కాకుంటే కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్త జాతీయ పార్టీ పెట్టే అంశంపైనా చర్చించారు. పీకే కాంగ్రెస్లో చేరిన తర్వాత ఐప్యాక్ను స్వతంత్రంగా పనిచేయించాలని, లేకుంటే ఆ సంస్థ సేవలు పొందే పార్టీలన్నీ కాంగ్రెస్తో కలుస్తాయనే అపప్రథ వస్తుందని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
కేంద్రం వైఫల్యాలే.. తెరాసకు ఆయుధాలు
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ రాష్ట్రంపై భాజపా అంతులేని వివక్ష చూపుతోందని, విభజన హామీలను నెరవేర్చడంలో వైఫల్యంతో పాటు ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం చూపడం వంటివి తెరాసకు వచ్చే ఎన్నికల్లో పదునైన ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడతాయని పీకే వివరించినట్లు తెలిసింది. కేంద్రం పక్షపాత ధోరణిపై రాష్ట్ర ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి దీన్ని ఇంటింటికీ తీసుకెళ్లగలిగితే భాజపాను ప్రజలు తిరస్కరించి, తెరాసకు పట్టం కడతారని వెల్లడించినట్లు తెలిసింది. దీనిపై కార్యాచరణను సైతం పీకే నిర్దేశించారు.
కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
రాష్ట్రంలో తాము చేసిన సర్వే సారాంశాన్ని కేసీఆర్కు ప్రశాంత్ కిశోర్ వివరించారు. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉందని, ఈ విషయం తెరాస అధిష్ఠానం దృష్టిలో ఉందని తెలిసినా వారు మారడం లేదని, మరోసారి సిట్టింగులందరికీ సీట్లు వస్తాయనే ధైర్యంతో ఉన్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. జనంలో వ్యతిరేకత ఉన్న వారిని మార్చే విషయం పరిశీలించాలని పీకే సూచించినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీ వారినే వేధిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి సొంత పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేయిస్తూ, మరో పార్టీలోకి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నారనే అంశాన్ని ఉదహరించినట్లు సమాచారం. శ్రేణులకు నిరంతర కార్యక్రమాలను నిర్దేశిస్తేనే పార్టీ బలంగా ఉంటుందని తెలిపారు.
త్రిముఖ పోరుతో తెరాసకు లాభం
వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోరు జరుగుతుందని, ఇది తెరాసకు లాభిస్తుందని పీకే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. భాజపా, కాంగ్రెస్ల పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని తెలిపారు. ప్రశాంత్ కిశోర్కు చెందిన ఐప్యాక్ సేవలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సర్వేలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం, పాత, కొత్త ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహం తదితర విషయాల్లో ఐప్యాక్ సేవలను వినియోగించుకుంటామని చెప్పినట్లు తెలిసింది. తెరాస ప్లీనరీ అనంతరం వీరిద్దరి మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!