TS Exams 2022: వచ్చేసింది గ్రూపు-1
తెలంగాణలో గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పోస్టులకు ఇదే
503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ వచ్చాక.. తొలి ప్రకటన
ఇంటర్వ్యూల్లేవు.. రాత పరీక్షలే..
మే 2 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
ప్రిలిమ్స్ : వచ్చే జులై లేదా ఆగస్టులో
మెయిన్స్ : వచ్చే నవంబరు లేదా డిసెంబరులో
ఈనాడు, హైదరాబాద్:తెలంగాణలో గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పోస్టులకు ఇదే తొలి ప్రకటన. ఇందులో పది ప్రభుత్వశాఖల్లోని 503 పోస్టులను భర్తీ చేస్తామని కమిషన్ వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినా, ఇంత భారీసంఖ్యలో గ్రూపు-1 పోస్టులు భర్తీ చేయడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. మే నెల రెండో తేదీ నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వేగవంతంగా పోస్టుల భర్తీ, పారదర్శకత కోసం ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించింది. రాతపరీక్షలతోనే ఎంపిక చేయనున్నారు. తెరాస ప్లీనరీకి ముందే నోటిఫికేషన్ జారీ చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు మంగళవారం రాత్రి కమిషన్ దీన్ని సిద్ధం చేసింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్రెడ్డి, సభ్యులు ధన్సింగ్, లింగారెడ్డి, అరుణకుమారి, సుచిత్ర, కారం రవీందర్రెడ్డి, చంద్రశేఖరరావు, సత్యనారాయణ, కార్యదర్శి అనితారామచంద్రన్లు నోటిఫికేషన్ను విడుదల చేశారు. పరీక్షల విధానం, సిలబస్ తదితర సమాచారం కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ www.tspsc.gov.in ను అభ్యర్థులు చూడవచ్చు.
ఇవీ ముఖ్యాంశాలు
* ప్రాథమిక (ప్రిలిమ్స్) పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నలతో (ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్) ఓఎంఆర్ విధానంలో, ప్రధాన (మెయిన్స్) పరీక్ష సంప్రదాయ (కన్వెన్షనల్) పద్ధతిలో జరగనున్నాయి. తొలిసారిగా ఉర్దూభాషలోనూ ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు.
* ప్రిలిమ్స్ క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. మెయిన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ప్రతి బహుళజోన్లో ప్రిలిమ్స్లో ఎంపికైన అభ్యర్థులను 1:50 చొప్పున మెయిన్స్కు ఎంపిక చేస్తారు. దీనికి కుల రిజర్వేషన్, లింగం, ఈడబ్ల్యూఎస్, క్రీడలు, దివ్యాంగ కోటాలను పరిగణనలోకి తీసుకుంటారు.
* కొత్త జోనల్ విధానాల మేరకు అభ్యర్థులు విధిగా టీఎస్పీఎస్సీ ఓటీఆర్లో నమోదు చేసుకోవాలి.
* ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండాలి.
* తొలిసారిగా ఈడబ్ల్యూఎస్, క్రీడా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.
* ప్రధాన పరీక్షకు ముద్రిత ప్రశ్నపత్రానికి బదులు ఎలక్ట్రానిక్ ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. కంప్యూటర్ తెరపై కనిపించే ఈ-ప్రశ్నపత్రం చూసి, మాన్యువల్ (తెల్లకాగితాలపై) విధానంలోపరీక్ష రాయాల్సి ఉంటుంది.
* ఎంపిక ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు వీలుగా డిజిటల్ మదింపు (ఎవాల్యుయేషన్) విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు.
* గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూపు-1 జాబితాలో ఆరు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారుల పోస్టులున్నాయి. తాజా జాబితాలో వాటికి బదులు పురపాలక గ్రేడ్ -2 కమిషనర్ పోస్టుల సంఖ్యను మరో ఆరు పెంచారు.
* ఆన్లైన్లో సమర్పించే దరఖాస్తులకు మే 31వ తేదీ రాత్రి 11.59 వరకు రుసుము చెల్లించవచ్చు.
* ప్రిలిమ్స్ నాటికి ప్రభుత్వ శాఖల నుంచి అదనంగా ఖాళీలు వస్తే వాటిని కూడా జాబితాకు కలుపుతారు.
* డీఎస్పీ, ఏఈఎస్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు పురుష అభ్యర్థులైతే 167.6 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఛాతీ కొలత 86.3 సెం.మీ. ఉండాలి. మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 45.5 కిలోల బరువు
కలిగి ఉండాలి. హైదరాబాద్ సరోజినిదేవి, ఉస్మానియా కంటి ఆసుపత్రుల్లోని ఆఫ్తాల్మిక్ సర్జన్ ద్వారా దృష్టి పరీక్షల ధ్రువీకరణపత్రం ఉండాలి.
* వయోపరిమితిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల మినహాయింపు ఉంటుంది. ఎన్సీసీ, మాజీ సైనికులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.
* మొత్తం 33 జిల్లాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలుంటాయి. మెయిన్స్ పరీక్షలు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ( హెచ్ఎండీఏ) పరిధిలో నిర్వహిస్తారు.
విద్యార్హతలివే..
డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీవో, డీపీవో, జిల్లా రిజిస్ట్రార్, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్, పురపాలక కమిషనర్లు, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, ఉపాధి అధికారి, ఏవో, ఎంపీడీవో పోస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి.
* ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులకు మెకానికల్/ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లేదా అందుకు సమానమైన డిగ్రీ పొంది ఉండాలి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు కార్మిక సంక్షేమానికి సంబంధించిన సామాజిక సేవ (సోషల్ వర్క్)లో పీజీ పట్టా కలిగిన వారికి ప్రాధాన్యమిస్తారు.
* సాంఘిక సంక్షేమ ఏడీ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత. సోషియాలజీ, సామాజిక సేవలో డిగ్రీ పొందిన వారికి ప్రాధాన్యమిస్తారు.
* సహాయ ట్రెజరీ అధికారి పోస్టులకు కామర్స్/ఎకనామిక్స్/ గణితశాస్త్రం డిగ్రీల్లో కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ