CM KCR: విపక్ష రాష్ట్రాలపై వివక్ష
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతూ త్వరలోనే భాజపాయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని తెలంగాణ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, హేమంత్ సోరెన్లు
భాజపా రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యం..
దీనిపై ఎదురుదాడి చేయాల్సిందే
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల అభ్యర్థి ప్రతిపాదన
ముఖ్యమంత్రి కేసీఆర్, ఝార్ఖండ్ సీఎం సోరెన్ల భేటీలో చర్చ
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతూ త్వరలోనే భాజపాయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని తెలంగాణ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, హేమంత్ సోరెన్లు నిర్ణయించినట్లు తెలిసింది. భాజపా పాలిత రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యమిస్తుందని.. ఇతర పార్టీలు అధికారంలో ఉన్నచోట అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని వారు చర్చించుకున్నట్లు సమాచారం. దీనిపై భాజపాయేతర రాష్ట్రాలు ఏకమై కేంద్రాన్ని ఎదిరించాల్సిందేనని మాట్లాడుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల తరఫున అభ్యర్థిని నిలిపి, సత్తా చాటాలని చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం హైదరాబాద్ వచ్చిన ఝార్ఖండ్ సీఎం సోరెన్... సాయంత్రం ప్రగతిభవన్కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, భవిష్యత్తు కార్యాచరణ సహా ఇతర అంశాలపై ఇరువురూ చర్చించారు. గత నెల 4న ఝార్ఖండ్ రాజధాని రాంచీలో కేసీఆర్ పర్యటించి సోరెన్తో భేటీ అయిన విషయం తెలిసిందే.
భాజపా వ్యతిరేక వైఖరే ఎజెండా
ఈ సందర్భంగా కేంద్రంలోని భాజపా వైఖరి గురించి విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నారని, దేశంలోని ఇతర పార్టీలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, నిధులు, ప్రాజెక్టుల విషయంలోనూ దారుణంగా వివక్ష చూపుతున్నారని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రధాని హోదాను మరిచి రాష్ట్రాలను బద్నాం చేసేందుకు ప్రయత్నించడం గతంలో దేశ చరిత్రలో ఎప్పుడూ లేదని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ల ద్వారా పెత్తనం చెలాయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘దేశహితం కోసం గాకుండా ప్రధాని సొంత ఎజెండాను పార్టీ ఎజెండాగా తెరమీదికి తెచ్చి దేశంలో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఏ ఒక్క నిర్ణయం జాతికి అనుకూలంగా లేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వెళ్లి తమ పార్టీ గెలవాలనే సంకల్పంతో రూ.వేల కోట్లతో పనులు చేపడుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. సెస్ల రూపంలో ప్రజలపై పెనుభారం వేశారు. నిజాన్ని అంగీకరించకుండా రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని చెప్పడం సిగ్గుచేటు. యూపీ, సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఇంధన ధరలు పెరగకపోవడానికి నిజమైన కారణాలను మోదీ జాతికి సమాధానం చెప్పాలి. రైతుల బాగు గురించి మోదీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణలో ధాన్యం రైతుల సమస్య సందర్భంగా రుజువైంది’’ అని పేర్కొన్నట్లు తెలిసింది. హేమంత్ మాట్లాడుతూ ‘‘మోదీలో అధికార కాంక్ష తప్ప మరొకటి కనిపించడం లేదు. ఇలాంటి ప్రధాని ఉండడం దేశానికి మేలు చేయదు. కేంద్రం మద్దతు వల్ల భాజపా పాలిత రాష్ట్రాల్లో మతపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి’ అని పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రాలను నష్టపరుస్తున్న కేంద్రం వైఖరిపై ఎదురుదాడి చేయాలని.. దీనిపై సమగ్ర కార్యాచరణ అవసరమని, భాజపాయేతర రాష్ట్రాలు గళం విప్పితేనే కేంద్రం దుందుడుకు విధానాలు, చర్యలకు అడ్డుకట్ట పడుతుందనే భావాన్ని ఇద్దరూ వ్యక్తంచేసినట్లు సమాచారం. ఎన్డీయేకు సంపూర్ణ మెజారిటీ లేదు. విపక్షాల బలమే ఎక్కువగా ఉందని, తామందరం రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే భాజపా కంగుతింటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. భాజపాయేతర సీఎంల సమావేశంపై త్వరలోనే ఆయా సీఎంలతో మాట్లాడాలనే అభిప్రాయం వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురించి చర్చ జరిగినట్లు తెలిసింది. దేశ పరిణామాలపై కాంగ్రెస్ అనుకున్న రీతిలో స్పందించడం లేదని, సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. అంతకు ముందు హేమంత్ ప్రగతిభవన్కు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. పోచంపల్లి శాలువాతో సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె