TRS: తెరాస రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
తెరాస రాజ్యసభ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దీవకొండ
ఈనాడు, హైదరాబాద్: తెరాస రాజ్యసభ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటిరో ఛైర్మన్ బండి పార్థసారథిరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా తెరాస నేత, గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను అభ్యర్థులుగా ఆయన ప్రకటించారు. బుధవారం ప్రగతిభవన్లో వారికి బి-ఫారాలను అందజేశారు. వీరిలో ఎమ్మెల్సీగా ఎన్నికై రాజీనామా చేసిన బండా ప్రకాశ్ స్థానం కోసం జరగనున్న ఉపఎన్నికకు ఈ నెల 19న వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ వేయనున్నారు. రెండేళ్ల పదవీ కాలం ఉంది. గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ప్రకాశ్ సైతం వరంగల్ జిల్లా వారే. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ల పదవీ విరమణతో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు దామోదర్రావు, పార్థసారథిలు నామినేషన్లు వేయనున్నారు. ఈనెల 24 నుంచి 31 వరకు గడువు ఉంది. మూడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా కేసీఆర్ ముమ్మర కసరత్తు చేశారు. ఉద్యమ సహచరుడైన దామోదర్రావు, పారిశ్రామికవేత్త పార్థసారథిరెడ్డి, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రలను ఎంపిక చేశారు.
అభ్యర్థి : బండి పార్థసారథిరెడ్డి
పుట్టిన తేదీ : 1954, మార్చి6
స్వగ్రామం : ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు
విద్యాభ్యాసం : ఆర్గానిక్ కెమిస్ట్రీ (ఓయూ)లో ఎంఎస్సీ, సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ
కుటుంబం : భార్య, కుమారుడు
వృత్తి జీవితం: సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పార్థసారథిరెడ్డి డిగ్రీ అనంతరం ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూనే హెటిరో సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని టాప్ 10 కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. 18 వేల మంది యువతకు ఉద్యోగాలిచ్చింది. హెటిరో సంస్థ బాధ్యతలను నిర్వహిస్తూనే.. భారత ప్రభుత్వానికి చెందిన డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్, బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2017లో ఇచ్చిన బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు పొందారు. సాయి స్ఫూర్తి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు.. గ్రామీణ నీటిసరఫరా కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి కేటీఆర్కు సన్నిహితుడు.
అభ్యర్థి : దీవకొండ దామోదర్రావు
పుట్టిన తేదీ : 1958 ఏప్రిల్ 1
స్వగ్రామం : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు
విద్యాభ్యాసం : ఎల్ఎల్బీ (ఉస్మానియా)
కుటుంబం : భార్య, కుమార్తె, కుమారుడు
వృత్తి జీవితం : కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆయన వెంట నడిచిన వ్యక్తుల్లో ఒకరు. 2001 నుంచి తెరాసలో పలు హోదాల్లో పని చేశారు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికల వ్యవస్థాపనలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ పబ్లికేషన్స్ (నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు)కు ఛైౖర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా వ్యవహరిస్తున్నారు.
అభ్యర్థి : వద్దిరాజు రవిచంద్ర
పుట్టిన తేదీ : 1964, మార్చి 22
స్వగ్రామం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి
విద్యాభ్యాసం : బీకాం
కుటుంబం : భార్య, కుమార్తె, కుమారుడు
వృత్తి జీవితం : గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర మున్నూరు కాపు ఆల్ అసోసియేషన్ జేఏసీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. తన సొంతూరులో బడి, గుడి, రహదారి, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలను కల్పించారు. మేడారం ఆలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సాయం చేశారు. రవిచంద్ర గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత తెరాసలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల