అంతర్రాష్ట్ర మార్గాలు మరింత సుగమం
దేశంలోని వివిధ రాష్ట్రాలతో తెలంగాణ రహదారి అనుసంధానత మరింత విస్తరించనుంది. వివిధ రాష్ట్రాల మధ్య సరకు, ప్రజారవాణాను మరింత పెంచేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో తెలంగాణలోని అయిదు జాతీయ రహదారుల విస్తరణకు మార్గం సుగమమైంది
తెలంగాణలో 848 కిలోమీటర్ల మేర అనుసంధానత
రూ. 24,053 కోట్లతో రహదారుల విస్తరణ
పీఎం గతిశక్తి పథకంలో అయిదు దారులు
ఈనాడు - హైదరాబాద్
దేశంలోని వివిధ రాష్ట్రాలతో తెలంగాణ రహదారి అనుసంధానత మరింత విస్తరించనుంది. వివిధ రాష్ట్రాల మధ్య సరకు, ప్రజారవాణాను మరింత పెంచేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో తెలంగాణలోని అయిదు జాతీయ రహదారుల విస్తరణకు మార్గం సుగమమైంది. ఈ దిశగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా వివిధ రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఉన్న రహదారులను ఎక్స్ప్రెస్వేలుగా మార్చనుంది. ఆయా మార్గాల్లో సరకు రవాణా ఇప్పటికే భారీగా సాగుతోంది. ఈ రహదారుల విస్తరణతో రవాణా సదుపాయాలు మెరుగవనున్నాయి. కేంద్రం అధ్యయనం చేసి దేశంలో సరకు రవాణా పెద్ద ఎత్తున సాగే అయిదు మార్గాలను ఎంపిక చేసింది. వాటన్నిటినీ నాలుగు/ఆరు వరుసలకు విస్తరించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రెండు నుంచి నాలుగు వరుసల రహదారులున్నాయి.
ఆర్థిక కారిడార్లు
పీఎం గతిశక్తి పథకానికి ఎంపిక చేసిన మార్గాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా 848 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. వీటి వ్యయ అంచనా రూ. 24,053 కోట్లు. వాటిలో నాగ్పుర్-విజయవాడ కారిడార్ కీలకం. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దునున్న విజయవాడ రహదారిలో ఇది విలీనమవుతుంది. అయిదు ప్యాకేజీలుగా ఈ విస్తరణ పనులు పూర్తి చేయనున్నారు. వరంగల్-ఖమ్మం, ఖమ్మం-విజయవాడ మార్గాల విస్తరణ ప్రణాళిక తుది దశలో ఉంది. ఈ కారిడార్లోని మంచిర్యాల-రేపల్లెవాడ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు గతంలో చేపట్టిన విస్తరణ పనులను ఈ పథకంలో కలిపారు. సుమారు 95 కిలోమీటర్లున్న ఈ మార్గం పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. మిగిలిన మూడు ప్యాకేజీల సవివర నివేదికలు త్వరలో కొలిక్కి రానున్నాయి. హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్లోని 59 కిలోమీటర్లున్న సూర్యాపేట-ఖమ్మం రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఖమ్మం నుంచి దేవరపల్లి రహదారి విస్తరణకు వీలుగా భూ సేకరణ కసరత్తు సాగుతోంది. తెలంగాణలోని బెల్లంపల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మేర విస్తరణకు వీలుగా అలైన్మెంటును కన్సల్టెన్సీ సంస్థ సిద్ధం చేస్తోంది. ఇండోర్-హైదరాబాద్ మార్గాన్ని మూడు ప్యాకేజీలుగా సిద్ధం చేస్తున్నారు.
ఎకనామిక్ కారిడార్
ఆర్థికంగా విస్తృత అవకాశాలున్న మార్గాలను కేంద్రం ఎకనామిక్ కారిడార్గా గుర్తించింది. రానున్న అయిదేళ్ల వ్యవధిలో ఈ మార్గాల్లో 25 శాతం మేర సరకు రవాణా పెరుగుతుందని అంచనా. తొలిదశలో దేశవ్యాప్తంగా తొమ్మిది వేల కిలోమీటర్ల మేర రహదారులను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణలోని 548 కిలోమీటర్లను ఎంపిక చేసింది.
ఇంటర్ కారిడార్ రూట్
రెండు రాష్ట్రాలు లేదా రెండు కారిడార్ల మధ్య భారీగా ట్రాఫిక్ రద్దీ ఉన్న వాటిని ఇంటర్ కారిడార్ రూట్లుగా కేంద్రం గుర్తించింది. ఇందులో దేశవ్యాప్తంగా ఎనిమిది వేల కిలోమీటర్ల రహదారులను గుర్తించింది. తొలిదశలో ఆరు వేల కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణలోని మూడు వందల కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేసింది.
మార్చి నాటికి ప్రాంతీయ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు అవతల నుంచి నిర్మించనున్న ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి గుత్తేదారును ఎంపిక చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలన్న యోచనలో ఉంది. ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను రెండు భాగాలుగా నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 158 కిలోమీటర్ల ఉత్తర భాగాన్ని తొలుత నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆ మేరకు భూసేకరణ నోటిఫికేషన్లు సైతం ఒకదాని తరవాత మరొకటి జారీ అవుతున్నాయి. తెలంగాణలో వచ్చే మార్చి నాటికి మొత్తం 715 కిలోమీటర్లకు సంబంధించిన రహదారుల విస్తరణ పనులు చేపట్టాలన్నది జాతీయ రహదారుల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతో సహా పది మార్గాలున్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి సుమారు రూ.28,615 కోట్ల వ్యయం అవుతుందన్నది అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు