
ముంపునకు హద్దుల్లేవు..!
రాష్ట్రంలో నాల్గోవంతు చెరువులకూ ఎఫ్టీఎల్ ఎల్లలు కరవు
ఈనాడు, హైదరాబాద్: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చెరువుల సమీపంలోని నివాస ప్రాంతాల వారికి వణుకు మొదలవుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం(ఎఫ్టీఎల్) ప్రాంతంలో నిర్మించుకున్న వారికి నిద్రే ఉండదు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి ముంపు చోటుచేసుకుంటున్నా.. ఆ చెరువుల ఎఫ్టీఎల్ గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన అధికారులకు రావడం లేదు. ఇదే అదనుగా ముంపు ప్రాంతాల్లో వెంచర్లు వెలుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఎఫ్టీఎల్లను నిర్ధారించాలని ప్రభుత్వం ఆదేశించింది. 25 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టినప్పటికీ హద్దు రాళ్లు వేసింది పావుభాగమైనా లేవు. ప్రధానంగా కాలనీలు, పట్టణాలు, మండల కేంద్రాలను ఆనుకుని ఉండే చెరువులు చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. మచ్చుకు కొన్ని..
* వరంగల్లో దాదాపు 12 చెరువుల ఎఫ్టీఎల్ ఆక్రమణకు గురైంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ చాలా చెరువులకు ఇదే పరిస్థితి
* నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఊర చెరువులో పది ఎకరాలకుపైగా కబ్జా జరిగింది.
* మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట చెరువులో ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో కడ్డీలు పాతి మరీ ఆక్రమణలు జరిగినా.. వాటిని పూర్తిగా తొలగించడం లేదు.
* హెచ్ఎండీఏ పరిధిలో సంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని మండలాల్లో 361 చెరువుల శిఖం ప్రాంతంలో ఎఫ్టీఎల్ హద్దులు తేల్చాల్సి ఉంది.
* హైదరాబాద్ నగరంలో పట్టుమని వంద చెరువులకైనా హద్దులు లేవంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు.
* ఇంకా చాలాచోట్ల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కోర్టుల్లోనూ వ్యాజ్యాలు ఉన్నాయి.
ఏదీ సన్నద్ధత..: ఏటా వర్షాకాలంలో చెరువులకు వరద వచ్చి శిఖం ప్రాంతాలు ముంపునకు గురయినప్పుడే యంత్రాంగం హడావుడి చేస్తోంది. చెరువుల్లోకి నీటిని తీసుకొచ్చే పాటుకాల్వలే కాక.. నీటిని బయటకు పంపే వాటిపైనా ఆక్రమణల తొలగింపును పూర్తిగా చేపట్టక ప్రతిసారీ కాలనీల్లోకి వరద వచ్చి చేరుతోంది. హైదరాబాద్, వరంగల్ నగరాలతోపాటు జిల్లా కేంద్రాల్లో చాలాచోట్ల ఈ పరిస్థితి పునరావృతమవుతోంది. హైదరాబాద్లో వరద నీటి తరలింపునకు ప్రత్యేక డ్రైనేజీ నిర్మాణాలు మొదలుపెట్టినా పనులు కొలిక్కి రాలేదు. మరోవైపు వర్షాకాలం సమీపిస్తోంది. ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన చర్యలపై యంత్రాంగం ఎలాంటి సన్నద్ధత ప్రకటించలేదు. రెండేళ్ల క్రితం వచ్చిన వరదలతో రాష్ట్రవ్యాప్తంగా భారీనష్టమే వాటిల్లింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తం కావాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్లో పడిన రష్మి.. జిమ్లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- Congress: తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపిన యశ్వంత్సిన్హా పర్యటన
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
- IND vs ENG: యువరాజ్ సింగ్ను గుర్తుచేసిన బుమ్రా
- Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ