కేంద్రం రైతుల రక్తం పీల్చమంటోంది..
ప్రస్తుత పరిస్థితులను చూసి నా దేశం ఎందుకిలా ఉందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్నపని కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సి వస్తోంది. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి
ప్రాణం పోయినా ఆ పనిచేయం
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నాం
అన్నదాతకు మేలు చేయడం వారికి నచ్చట్లేదు
గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కోసం పోరాడండి
మద్దతిచ్చే వారికే ఎన్నికల్లో అండగా ఉందాం
చండీగఢ్ సభలో సీఎం కేసీఆర్ పిలుపు
ప్రస్తుత పరిస్థితులను చూసి నా దేశం ఎందుకిలా ఉందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్నపని కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సి వస్తోంది. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి మూలాలు ఎక్కడున్నాయనే అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాలని దేశ పౌరుడిగా కోరుకుంటున్నాను. ప్రతి దేశంలోనూ సమస్యలుంటాయి. కానీ మనదగ్గరున్నట్టు ఎక్కడా ఉండవు.
తెలంగాణ ఏర్పడకముందు మా రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉండేది. ఒక్కోరోజు పది, ఇరవై మంది ఆత్మహత్యలు చేసుకునేవారు. విద్యుత్తు ఎప్పుడొచ్చి పోతుందో తెలియదు. రాత్రిళ్లు మోటార్లు పెట్టడానికి వెళ్లి ఎంతో మంది రైతులు పాముకాట్లకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. దేవుడి దయతో మేం విద్యుత్తు సమస్యను పరిష్కరించాం. ఇళ్లు, వ్యాపారాలు, రైతులు, పరిశ్రమలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నాం.
- సీఎం కేసీఆర్
ఈనాడు, దిల్లీ: ‘మేం సాగుకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నాం. కానీ దిల్లీలో మా నెత్తిన కూర్చున్న సర్కారు.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టమంటూ ఒత్తిడి చేస్తోంది. రైతుల నుంచి డబ్బు వసూలు చెయ్... వారి రక్తం పీల్చు అంటోంది. కానీ ప్రాణం పోయినా ఫర్వాలేదు మీటర్లు మాత్రం పెట్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అసెంబ్లీ సాక్షిగా తిరస్కరించాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. సాగు చట్టాల రద్దుకు ఉద్యమించి విజయం సాధించిన రైతులు చట్టబద్ధమైన గిట్టుబాటు ధర కోసం దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు తల్చుకుంటే అధికార పీఠాలు తారుమారైపోతాయని అన్నారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన 693 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున, గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన నలుగురు సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం తరఫున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి.. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన 25 మంది రైతుల కుటుంబాలకు సాయం చెక్కులు పంపిణీ చేశారు. మిగిలినవి అధికారుల ద్వారా ఆయా కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
మీ బాధను పంచుకోవడానికే వచ్చా
‘కేంద్ర ప్రభుత్వం చేసిన సాగు చట్టాలపై పోరాటంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. కేంద్రం మెడలు వంచి చట్టాలు రద్దు చేసేంతవరకూ ఉద్యమించిన రైతులు, రైతు నేతలందరికీ నమస్కరిస్తున్నా. అమరులైన వారిని తిరిగి తీసుకురాలేం. కానీ మీ బాధను పంచుకుని.. దేశమంతా మీ వెంట ఉందని భరోసా ఇవ్వడానికే ఇక్కడికొచ్చా. స్వాతంత్య్ర సమరంలో ఇక్కడి ప్రజలు చేసిన ప్రాణత్యాగాలను చరిత్ర ఎన్నటికీ మరవదు. దేశమంతా అన్నం కోసం ఆందోళన చెందుతున్నప్పుడు ఇక్కడి రైతులు నెత్తురును చెమటగా ధారపోసి దేశంలో తొలి హరితక్రాంతిని తీసుకొచ్చి అందరికీ తిండి పెట్టారు. ఇది భారతీయ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంటుంది. ఇక్కడ ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు సాయం అందిస్తామని కేజ్రీవాల్కు చెప్పినప్పుడు ఆయన దీన్ని స్వాగతించారు. నాతోపాటు వచ్చిన ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నా.
కేంద్రం జీర్ణించుకోలేకపోతోంది
రైతులకు ప్రయోజనాలు కల్పించడానికి మాతో పాటు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ రాష్ట్రాలు రైతులకు మేలు చేయడం వాళ్లకు (కేంద్రంలోని వారు) ఇష్టం లేదు. అందుకే ముఖ్యమంత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన మీపై ఖలీస్థానీ, దేశద్రోహి అంటూ ఎన్నో ఆరోపణలు చేశారు. కేంద్రం తీరును దృష్టిలో ఉంచుకొని ఈ ఆందోళనను ఇకముందు కూడా కొనసాగించాలి. కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా రైతులంతా ఏకమై పోరాడాలి. దేశానికి అన్నం పెట్టే రైతులకు న్యాయం జరిగి తీరాల్సిందే. వారికి ఎదురవుతున్న బాధాకర పరిస్థితులు తొలగిపోవాలి.
రైతులు తలచుకుంటే పీఠాలు తారుమారు
రైతులు అనుకుంటే అధికార పీఠాలు తారుమారవుతాయి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు, దానికి రాజ్యాంగ రక్షణ కల్పించేంతవరకూ ఆందోళన కొనసాగించాలి. వచ్చే ఎన్నికల్లో దీనికి మద్దతిచ్చే వారికే మనం అండగా నిలవాలి. దేశవ్యాప్తంగా రైతునేతలు ఈ దిశగా ఐక్యతను తీసుకురావాలి. దేశంలోని రైతు అనుకూల ప్రభుత్వాలన్నీ ఏకమై మీ ఆందోళనకు మద్దతు పలుకుతాయి. కేంద్రం రైతుల డిమాండ్లకు తలొగ్గేవరకూ పోరాటం కొనసాగించాలని రైతు నేతలను ప్రార్థిస్తున్నాను’ అని కేసీఆర్ కోరారు.
ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయిత్, తెలంగాణ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్రెడ్డి, సంతోష్కుమార్, వెంకటేష్ నేత, మంత్రి ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కేసీఆర్ దిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి మధ్యాహ్న భోజనం చేశారు. సుమారు రెండుగంటల పాటు అక్కడే గడిపారు. తర్వాత ఇద్దరూ కలిసి విమానంలో చండీగఢ్కు పయనమయ్యారు. అక్కడ కార్యక్రమం ముగిశాక, అందరూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ నివాసంలో మరోసారి సమావేశమయ్యారు.
రైతుల ఆదాయం పెరగాలి: కేజ్రీవాల్
పంజాబ్లో ఆప్ ప్రభుత్వం వచ్చాక.. రైతుల ఆదాయం పెంచడంపై దృష్టి సారించినట్లు ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ తెలిపారు. ‘రైతుల ఆదాయం పెరగనంతవరకు వారు అప్పుల బాధల నుంచి బయటపడలేరు. ముఖ్యమంత్రి భగవంత్మాన్ అధికారం చేపట్టగానే రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. తొలిపంటగా పెసర వేస్తే, కనీస మద్దతు ధరకు కొంటామని చెప్పారు. నేరుగా విత్తనాలు వేసిన రైతులకు ఎకరాకు రూ.2,500 ఇస్తామని ప్రకటించారు. విద్య, వైద్యం, విద్యుత్తు విషయంలో దిల్లీ ప్రభుత్వ కృషిని దేశం మొత్తం చూసినట్లుగానే రాబోయే రోజుల్లో రైతాంగం కోసం పంజాబ్ ప్రభుత్వం చేసే మంచి పనులను చూస్తుంది. పంజాబ్లో రైతుల పిల్లలు రైతులమవుతామని చెప్పుకొనేలా పరిస్థితులను చక్కదిద్దడానికి మేం కంకణబద్ధులమై ఉన్నాం. ఈ నమూనాను దేశం ముందుంచుతాం’ అని కేజ్రీవాల్ తెలిపారు. ‘మా రైతుల బాధను పంచుకోవడానికి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు’ అని పంజాబ్ సీఎం భగవంత్సింగ్ పేర్కొన్నారు. చలి, ఎండ, వానలను తట్టుకొని రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవడం మానవత్వానికి నిదర్శనమన్నారు.
సీఎం కేసీఆర్కు పంజాబ్ ఎరువుల డీలర్ల వినతి
తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను దేశమంతటా అమలు చేసేలా కృషి చేయాలని సీఎం కేసీఆర్కు జాతీయ పురుగుమందులు, ఎరువులు, విత్తనాల డీలర్ల సంఘం పంజాబ్ శాఖ వినతిపత్రం అందజేసింది. ఈ సంఘం ప్రతినిధులు చండీగఢ్లో కేసీఆర్ను కలసి రైతుల సమస్యలను వివరించారని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గౌరీశెట్టి మునీందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 8-11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం
రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. -
గల్ఫ్ కార్మికులకు బోర్డు
గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
వైభవంగా సీతారాములవారి ఎదుర్కోలు ఉత్సవం
సీతారాముల కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల దివ్యక్షేత్రం శోభాయమానంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పారాయణలతో అంతా రామమయమైంది. -
తెలంగాణ వైపు ఏనుగుల మంద!
మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అటవీశాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లో అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
చందా సరిగా కట్టరు.. కార్మికులకు వైద్యసేవలు అందవు..!
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. కార్మికుల వైద్యసేవల బీమా చందా సొమ్ము సక్రమంగా చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనుంది. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
అసామాన్య అనన్య
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
నాటక రంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం రాత్రి వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని త్యాగరాయగానసభలో జరిగిన తెలుగు రంగస్థల దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
కేసుల వివరాలు అందించిన పోలీసులు
భాజపా తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల వివరాలను పోలీసులు అందజేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 22కి వాయిదా
ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి అనుమతిచ్చింది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కల్యాణం జరగనున్న విషయం తెలిసిందే. -
ప్రచార రథంపై చెప్పుల దండ
ఎన్నికల ప్రచార రథాన్ని అడ్డుకొని.. అభ్యర్థి చిత్రపటంపై చెప్పులతో దాడి చేసినందుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. -
18 నుంచి సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్-దానాపూర్ల మధ్య ఏప్రిల్, మే నెలల్లో అన్రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఏప్రిల్ 18 నుంచి జూన్ 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
-
జగన్.. గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు: చంద్రబాబు
-
క్రూడాయిల్ దిగుమతుల బిల్లు తగ్గింది, కానీ..!
-
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
-
ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన కారు.. 10 మంది దుర్మరణం
-
మద్యం నిషేధిస్తానని.. జగన్ సారా వ్యాపారిగా మారారు: పవన్