క్వాడ్ది నిర్మాణాత్మక ఎజెండా
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చతుర్భుజ కూటమి- ‘క్వాడ్’ నిర్మాణాత్మక ఎజెండాతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ సభ్యదేశాల మధ్య పరస్పర విశ్వాసం, వాటి దృఢ సంకల్పం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులకు నూతనోత్తేజాన్నిస్తోందని పేర్కొన్నారు.
సదస్సులో ప్రధాని మోదీ
సరికొత్త ఫెలోషిప్నకు సభ్యదేశాల శ్రీకారం
నౌకాదళాల మధ్య సహకారం పెంపు, పర్యావరణమార్పులపై పోరుకు సంకల్పం
టోక్యో: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చతుర్భుజ కూటమి- ‘క్వాడ్’ నిర్మాణాత్మక ఎజెండాతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ సభ్యదేశాల మధ్య పరస్పర విశ్వాసం, వాటి దృఢ సంకల్పం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులకు నూతనోత్తేజాన్నిస్తోందని పేర్కొన్నారు. మంచి కోసం పనిచేసే ఈ కూటమి మునుముందు మరింత బలోపేతమవడం ఖాయమని ఉద్ఘాటించారు. జపాన్ రాజధాని టోక్యోలో మంగళవారం క్వాడ్ సదస్సును ఉద్దేశించి మోదీ ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్లతో ఆయన పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. తాజా సదస్సులో భాగంగా క్వాడ్ నేతలు కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. సభ్యదేశాలకు చెందిన విద్యార్థులను శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనల దిశగా ప్రోత్సహించేందుకు కొత్త ఫెలోషిప్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రత్యేక కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. తాజా చర్చల్లో బైడెన్, కిషిద ఉక్రెయిన్పై రష్యా యుద్ధం గురించి ఎక్కువగా మాట్లాడగా.. ఆ విషయాన్ని మోదీ ఏమాత్రం ప్రస్తావించలేదు. క్వాడ్ నేతల తదుపరి ముఖాముఖి సదస్సు ఆస్ట్రేలియాలో 2023లో జరగనుంది.
క్వాడ్ సదస్సులో మోదీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వేదికపై చాలా తక్కువ సమయంలోనే క్వాడ్ తనకంటూ కీలక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కూటమి సభ్యదేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మధ్య పరస్పర విశ్వాసం; వాటి దృఢ సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తినిస్తోంది. మన పరస్పర సహకారంతో ఇండో-పసిఫిక్లో స్వేచ్ఛాయుత రవాణాకు మార్గం సుగమమవుతోంది. కొవిడ్ మహమ్మారి విజృంభణ వేళ కూడా టీకాల సరఫరా, పర్యావరణ మార్పులపై పోరాటం, పటిష్ఠ సరఫరా గొలుసుల ఏర్పాటు వంటి అంశాల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరునాడే సదస్సుకు అల్బనీస్ విచ్చేయడం.. క్వాడ్ పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమంటూ మోదీ కొనియాడారు.
26/11, పఠాన్కోట్ దాడులను ఖండించిన నేతలు
ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించకూడదని క్వాడ్ నేతలు అభిప్రాయపడ్డారు. 26/11 ముంబయి దాడులు, పఠాన్కోట్ ఉగ్రదాడి సహా పలు ముష్కర దాడులను వారు ముక్తకంఠంతో ఖండించారు. ఇతర దేశాలను బెదిరించేందుకు, ఉగ్రవాదులకు శిక్షణనిచ్చేందుకు అఫ్గానిస్థాన్ భూభాగాన్ని ఎవరూ కేంద్రంగా మార్చుకోకూడదన్న ఐరాస భద్రతామండలి తీర్మానం-2593కు తమ మద్దతును పునరుద్ఘాటించారు.
మౌలికవసతుల కల్పనకు ఉమ్మడి కృషి
ఇండో-పసిఫిక్ ప్రాంతం వృద్ధికి అత్యంత కీలకమైన మౌలిక వసతుల రంగంలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని క్వాడ్ సభ్యదేశాలు తీర్మానించుకున్నాయి. ఈ రంగంలో నైపుణ్యాలు, అనుభవాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇండో-పసిఫిక్లో మౌలిక సదుపాయాల కల్పనకు రానున్న ఐదేళ్లలో 5 వేల కోట్ల డాలర్లకు పైగా నిధులను సమకూర్చనున్నట్లు సభ్యదేశాలు వెల్లడించాయి. క్వాడ్ రుణ నిర్వహణ వనరుల పోర్టల్ ఏర్పాటుకూ నిర్ణయించాయి.
ఆరోగ్య వ్యవస్థల పటిష్ఠతకు..
కొవిడ్ మహమ్మారికి ముకుతాడు వేయడంలో ప్రపంచానికి మార్గదర్శనం చేయాలని కూటమి తీర్మానించుకుంది. అంతర్జాతీయంగా ఆరోగ్య వ్యవస్థలను పటిష్ఠపర్చేందుకు కృషిచేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. భారత్లో పలు టీకాల తయారీలో పురోగతిని కూటమి స్వాగతించింది.
చైనాకు హెచ్చరిక!
ఇండో-పసిఫిక్లో ప్రస్తుత పరిస్థితులను బలప్రయోగం ద్వారా మార్చేందుకు.. ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే తాము ఎంతమాత్రమూ సహింపబోమని క్వాడ్ నేతలు ఉద్ఘాటించారు. వివాదాలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రాంతీయంగా చైనా కొన్నేళ్లుగా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఈ హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు- పసిఫిక్ ద్వీపదేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తాము కృషిచేయనున్నట్లు క్వాడ్ నేతలు తెలిపారు.
ఉక్రెయిన్ సంక్షోభం అంతర్జాతీయ సమస్య: బైడెన్
బైడెన్ తాజా చర్చల్లో కొవిడ్ మహమ్మారి, సరఫరా గొలుసుల వంటి అంశాలను కూడా ప్రస్తావించినప్పటికీ.. ఉక్రెయిన్ సంక్షోభం గురించే ఎక్కువగా మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్పై రష్యా పాశవిక యుద్ధం ఘోర విపత్తుకు కారణమవుతోంది. అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం కేవలం ఐరోపాకు సంబంధించిన అంశమేమీ కాదు. అది అంతర్జాతీయ సమస్య. నిజానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం లేదు. సంస్కృతిని నాశనం చేస్తున్నారు. ప్రతి పాఠశాల, ప్రతి సంస్కృతి, ప్రతి చారిత్రక మ్యూజియంను ధ్వంసం చేస్తున్నారు. రష్యా ఈ యుద్ధాన్ని కొనసాగించినంతకాలం.. దాన్ని నిలువరించేందుకు మా భాగస్వామ్య దేశాలతో కలిసి కృషిచేస్తూనే ఉంటాం’’ అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. చేతల కూటమిగా క్వాడ్ను అభివర్ణించారు. సదస్సులో మోదీకి స్వాగతం పలుకుతూ.. ‘మిమ్మల్ని మళ్లీ నేరుగా కలుసుకోవడం అద్భుతంగా ఉంది’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్లో స్వేచ్ఛాయుత రవాణాకు క్వాడ్ నేతలు కట్టుబడి ఉండటం అత్యంత ముఖ్యమని కిషిద పేర్కొన్నారు.
శాంతి పరిరక్షణకు ఐపీఎండీఏ
ఇండో-పసిఫిక్ జలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా సభ్యదేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకుగాను కొత్తగా ‘ఇండో-పసిఫిక్ నౌకాదళరంగ అవగాహన (ఐపీఎండీఏ)’ కార్యక్రమానికి క్వాడ్ శ్రీకారం చుట్టింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలను పరిరక్షించేందుకు ఇది దోహదపడనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విపత్తులను కలిసికట్టుగా, మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకుగాను ‘మానవతా సహాయం, విపత్తు సహాయ చర్యలపై క్వాడ్ భాగస్వామ్యం (హెచ్ఏడీఆర్)’ ఏర్పాటును కూడా తాజాగా ప్రకటించారు.
* మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులపై ఉమ్మడిగా పోరాడేందుకు ‘క్వాడ్ పర్యావరణ మార్పుల సర్దుబాటు, తగ్గింపు ప్యాకేజీ (క్యూ-ఛాంప్)’ కార్యక్రమాన్ని తాజాగా ప్రకటించారు.
* సభ్యదేశాల భవిష్యత్తుతరం శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల మధ్య సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా సరికొత్త ఫెలోషిప్ను ప్రారంభిస్తున్నట్లు క్వాడ్ ప్రకటించింది. దీనికింద ఏటా ఒక్కో సభ్యదేశం నుంచి 25 మంది చొప్పున మొత్తం 100 మంది * * విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్, గణిత (స్టెమ్) విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలు చదివేందుకు ఉపకార వేతనాలు అందించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?