అన్నదాతలపై ఎగవేత ముద్ర
పంట రుణం తీసుకుని తిరిగిచెల్లించని రైతులను బ్యాంకులు ఎగవేతదారుల జాబితాలో చేరుస్తున్నాయి. ఇలా చేర్చిన రైతుల సంఖ్య గత మార్చి నాటికే 3 లక్షలు దాటినట్లు సమాచారం. వీరికి కొత్తగా పంట రుణాలిచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ లెక్కల ప్రకారం 61 లక్షల
వరసగా మూడో సీజన్లో పంట రుణాలు కట్టనివారు ఎన్పీఏ జాబితాలో..
కొత్త అప్పుల మంజూరుకు బ్యాంకుల మొండిచేయి
గత మార్చి నాటికే 3 లక్షల మందికిపైగా బాధితులు
ఈనాడు, హైదరాబాద్: పంట రుణం తీసుకుని తిరిగిచెల్లించని రైతులను బ్యాంకులు ఎగవేతదారుల జాబితాలో చేరుస్తున్నాయి. ఇలా చేర్చిన రైతుల సంఖ్య గత మార్చి నాటికే 3 లక్షలు దాటినట్లు సమాచారం. వీరికి కొత్తగా పంట రుణాలిచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ లెక్కల ప్రకారం 61 లక్షల మంది రైతుల భూమి ఖాతాలున్నాయి. వీరిలో 42 లక్షల మంది 2018 డిసెంబరు 11 నాటికి రుణమాఫీ పథకం కింద బ్యాంకుల్లో రూ.లక్ష వరకూ బాకీ ఉన్న అర్హులని వ్యవసాయశాఖ 2019లో గుర్తించింది. ప్రభుత్వం వడపోత చేపట్టి.. రుణమాఫీకి 36 లక్షల మంది అర్హులని తేల్చింది. వీరంతా వెంటనే బాకీ చెల్లించి కొత్త రుణం తీసుకోవాలని.. వీరి రుణమాఫీ నిధులను బ్యాంకులకు ప్రభుత్వం వాయిదా పద్ధతిలో విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గతంలో ప్రకటించారు. ‘‘దీంతో కొందరు రైతులు తమ బాకీని ప్రభుత్వం కడుతుందని భావించి చెల్లించడం లేదు. కొత్త రుణం తీసుకోవడం లేదు. దీంతో నిబంధనల ప్రకారం వీరు ఎగవేతదారుల జాబితాలోకి చేరుతున్నారని’’ ఓ బ్యాంకు సీనియర్ అధికారి ‘ఈనాడు’కు తెలిపారు. బ్యాంకుల పరిభాషలో దీనిని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్(ఎన్పీఏ)గా వ్యవహరిస్తారని వివరించారు. ఇచ్చిన రుణం బ్యాంకులకు తిరిగి రాని పరిస్థితి ఉంటే ఇలా నిరర్థక ఆస్తిగా పరిగణిస్తారని తెలిపారు.
ఏడాదిలోపు కట్టేది 30 శాతంలోపే..
రైతు పంట రుణం తీసుకున్న తేదీ నుంచి సరిగ్గా ఏడాదిలోగా బ్యాంకుకు తిరిగిచెల్లిస్తే కేవలం పావలా(4 శాతం) వడ్డీ మాత్రమే పడుతుంది. ఉదాహరణకు 2021 మే 26న తీసుకున్న పంట రుణాన్ని 2022 మే 25కల్లా కచ్చితంగా తిరిగికట్టేయాలి. ఇలాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీని రాయితీగా చెల్లిస్తుంది. ఏడాదిలోపు తిరిగిచెల్లిస్తే బ్యాంకు 7 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఇలాంటి రైతుల జాబితాను రిజర్వు బ్యాంకుకు పంపితే 3 శాతం వడ్డీని రాయితీ కింద కేంద్ర ప్రభుత్వం రైతు ఖాతాలో వేస్తుంది. ఇలా కేంద్రం నుంచి వడ్డీ రాయితీ పొందుతున్న రైతులు రాష్ట్రంలో 10 నుంచి 12 లక్షల మంది మాత్రమే ఉంటున్నారని అంచనా. మొత్తం రుణాలు తీసుకున్నవారిలో ఏడాదిలోగా పంట రుణం తిరిగికడుతున్న రైతులు 30 శాతంలోపే ఉంటున్నారు. మిగతా 70 శాతం మందికి కేంద్రం రాయితీ అందడం లేదు. వారి రుణాలపై 12 శాతానికిపైగా వడ్డీ పడుతోంది. పైగా వరసగా మూడో సీజన్ దాకా పంట రుణం తిరిగిచెల్లించకపోతే ఎన్పీఏ జాబితాలో చేరుతున్నారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకుని ఇప్పటిదాకా తిరిగిచెల్లించని రైతులందర్నీ బ్యాంకులు ఎన్పీఏ జాబితాలో చేరుస్తున్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 76 వేల మందికి పంట రుణాలివ్వగా వీరిలో 20 వేల మంది ఎగవేతదారుల జాబితాలోకి చేరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష మంది వరకూ ఈ జాబితాలో ఉన్నారు. వీరెవరికీ బ్యాంకులు కొత్తగా పంట రుణాలిచ్చే అవకాశం లేదు. దీంతో పెట్టుబడికి ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓ సీనియర్ వ్యవసాయాధికారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.