దృఢ సంకల్పంతో సంస్కరణలు తెచ్చాం
దృఢమైన రాజకీయ సంకల్పంతో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా దేశం ఇప్పుడు ఎన్నో రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్థిర ప్రభుత్వాల కారణంగా గత మూడు దశాబ్దాల్లో సంస్కరణలను పట్టుదలగా అమలు చేయలేకపోయారని
2014 తర్వాత దేశంలో అనూహ్య మార్పులు
ఎన్నో రంగాల్లో భారత్ ఇప్పుడు అగ్రగామి
విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలకు దేశ ప్రయోజనాలను జోడించాలి
ఐఎస్బీ స్నాతకోత్సవ సభలో ప్రధాని మోదీ
ఈనాడు, హైదరాబాద్: దృఢమైన రాజకీయ సంకల్పంతో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా దేశం ఇప్పుడు ఎన్నో రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్థిర ప్రభుత్వాల కారణంగా గత మూడు దశాబ్దాల్లో సంస్కరణలను పట్టుదలగా అమలు చేయలేకపోయారని ఆయన తెలిపారు. 2014 తర్వాత ఈ పరిస్థితి మారిందని, అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చినట్లు వివరించారు. గురువారం హైదరాబాద్లో ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ద్విదశాబ్ది వేడుకలు, 2022 పీజీపీ బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవ సభలో ప్రధాని ప్రసంగించారు. భారత్, జీ 20 దేశాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశమని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కుప్పకూలినా, భారత్ మాత్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతోందని తెలిపారు.
ఇవీ మన ఘనతలు
‘గత ఏడాదిలో రికార్డుస్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించాం, స్మార్ట్ఫోన్ డేటా వినియోగంలో ప్రపంచంలోనే మొదటి స్థానం మనది. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో, గ్లోబల్ రిటైల్ ఇండెక్స్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం. మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థ మనదే’ అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘భారత్ అంటే వ్యాపారం’ అని ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయని వివరించారు. ‘సంస్కరణ- సాధన- మార్పు’ అనే మంత్రంతో సమర్థ పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. ‘ఫిన్టెక్ విభాగంలో ఎటువంటి మార్పులొచ్చాయో చూస్తున్నాం. ఒకప్పుడు బ్యాంకింగ్ అనేది సామాన్యులకు అందని ద్రాక్ష. కానీ ఇప్పుడు సామాన్యుల చెంతకే బ్యాంకింగ్ లావాదేవీలు దిగివచ్చాయ’ని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం డిజిటల్ లావాదేవీలు మనదేశంలో జరుగుతున్నాయని తెలిపారు. కరోనా టీకా కోసం విదేశాల వైపు చూసే పరిస్థితి నుంచి, దేశ ప్రజలందరికీ సొంత టీకా ఇవ్వటమే కాకుండా వందకు పైగా దేశాలకు ఎగుమతి చేసిన ఘనత మన సొంతమని వివరించారు. దేశంలో వైద్య కళాశాలల సంఖ్యను 380 నుంచి 600కు పైగా పెంచినట్లు తెలిపారు.
రాబోయే 25 ఏళ్లు కీలకం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకొంటూ, వచ్చే పాతికేళ్లలో ఏం చేయాలనే అంశంపై దృష్టి సారించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. ఇందులో యువత భాగస్వామ్యం ముఖ్యమని, ఐఎస్బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి వచ్చిన మేనేజ్మెంట్ విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. ఐఎస్బీ దేశానికి గర్వకారణమని, ఇరవై ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించిన ఈ సంస్థ వేలమంది మెరికల్లాంటి విద్యార్థులను దేశానికి అందించిందని అన్నారు. ఆసియాలోని అగ్రగామి విద్యాసంస్థల్లో ఒకటిగా స్థానం సంపాదించిన ఐఎస్బీ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు, తమ వ్యక్తిగత లక్ష్యాలను దేశ ప్రయోజనాలతో జోడించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా