మా లక్ష్యం.. ఉజ్వల భారతం
‘సహజ సిద్ధమైన ప్రకృతి సంపద, మానవ వనరులు, అత్యుత్తమ భౌగోళిక పరిస్థితులున్న భారత్ను మనసు పెడితే అమెరికాను మించిన ఆర్థిక సామర్థ్యమున్న దేశంగా మార్చవచ్చు. ఇలాంటి ఉజ్వల హిందుస్థాన్ను ఆవిష్కరించేందుకు ఎంతైనా శ్రమిస్తామని’ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మూడు నెలల్లో సంచలన వార్తను ప్రకటిస్తాం
దేవేగౌడతో సమావేశానంతరం కేసీఆర్ ప్రకటన
దేశంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నది ముఖ్యం కాదు.. ఎవరు ప్రధాని అయ్యారన్నదీ కీలకం కాదు.. ప్రస్తుత పాలనలో దేశం స్వాతంత్య్రానికి పూర్వంలాగే ఉంది. మనతో పాటు స్వాతంత్య్రాన్ని పొందిన దేశాలన్నీ ఎంతో పురోగతి సాధించాయి. ప్రస్తుతం దేశ ప్రజలకు ఉజ్వల భారత్ అవసరం ఎంతైనా ఉంది.
- సీఎం కేసీఆర్
ఈనాడు, బెంగళూరు: ‘సహజ సిద్ధమైన ప్రకృతి సంపద, మానవ వనరులు, అత్యుత్తమ భౌగోళిక పరిస్థితులున్న భారత్ను మనసు పెడితే అమెరికాను మించిన ఆర్థిక సామర్థ్యమున్న దేశంగా మార్చవచ్చు. ఇలాంటి ఉజ్వల హిందుస్థాన్ను ఆవిష్కరించేందుకు ఎంతైనా శ్రమిస్తామని’ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన గురువారం బెంగళూరులో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్తమాన రాజకీయాలు, ఆర్థిక స్థితిగతులపై చర్చించారు. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ చర్చల తర్వాత సీఎం కేసీఆర్.. కుమారస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేవేగౌడతో జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఈ చర్చలు దేశాన్ని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దే దిశగా కొనసాగాయని చెప్పారు. రెండు, మూడు నెలల్లో సంచలన వార్తను వినిపిస్తామని ప్రకటించారు.
అమెరికాను మించిపోతాం..
మనకంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ప్రస్తుతం 16 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక సామర్థ్యాన్ని సాధిస్తే మనం ఐదు ట్రిలియన్ డాలర్ల వద్దనే నిలిచిపోయామని కేసీఆర్ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో సమర్థమైన యువశక్తి, మానవ వనరులు, వేలాది టీఎంసీల నీటిలభ్యత, సౌర విద్యుత్తు అందుబాటులో ఉన్నా నేటికీ తాగునీరు, విద్యుత్తు కోసం ఇబ్బంది పడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. ‘పరిశ్రమలు మూతపడ్డాయి, జీడీపీ తగ్గింది. ద్రవ్యోల్బణం పెరిగి, రూపాయి విలువ పడిపోయింది. రైతులు, దళితులు, గిరిజనులే కాదు ఎవ్వరూ సంతోషంగా లేరు. ఇది భారత్కు అవమానకరమైన సందర్భం. మాధ్యమాలు, బుద్ధి జీవులు నవ భారత నిర్మాణంలో చేతులు కలపాలి’ అని పిలుపునిచ్చారు. సంచలన వార్తలపై దృష్టి సారించకుండా నిర్మాణాత్మక సమాజాన్ని సాధించాలన్నారు. అందరి సహకారంతో దేశంలో మార్పు తథ్యమన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా దేశానికి ఓ శుభవార్త అందిస్తామని ప్రకటించారు. దేవేగౌడ, కేసీఆర్ల చర్చలు దేశానికి సమగ్ర పాలన అందించే దిశగా సాగాయని ఆయన తెలిపారు. ఈ భేటీలో ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవేగౌడతో భేటీ నిమిత్తం బెంగళూరుకు వచ్చిన కేసీఆర్కు స్వాగతం పలుకుతూ పలు వీధుల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. గురువారం ఉదయం 11 గంటలకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్ మధ్యాహ్నం 1:35 గంటలకు పద్మనాభనగరలోని దేవేగౌడ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్గౌడలు కేసీఆర్కు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ రాక సమాచారాన్ని అందుకున్న స్థానిక వ్యాపారవేత్తలు, తెరాస అభిమానులు పెద్ద ఎత్తున దేవేగౌడ నివాసానికి తరలి వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్