Govt Jobs: 1,326 వైద్య పోస్టులకు పచ్చ జెండా
రాష్ట్రంలో 1,326 వైద్యుల పోస్టులను భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) ప్రకటనను వెలువరించింది. ఇందులో ప్రజారోగ్య విభాగంలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్
నియామక ప్రకటన వెలువరించిన వైద్య బోర్డు
ఒప్పంద, పొరుగు సేవల్లో వారికి 20 పాయింట్ల వెయిటేజి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 1,326 వైద్యుల పోస్టులను భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) ప్రకటనను వెలువరించింది. ఇందులో ప్రజారోగ్య విభాగంలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వైద్య విద్య సంచాలకుల విభాగంలో 357 ట్యూటర్ పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్/జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నాయి. ఈ నియామక ప్రకటన ద్వారా కొత్తగా నియమితులయ్యే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయరాదంటూ నిబంధనను విధించారు. ఎంబీబీఎస్, తత్సమాన అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 14 సాయంత్రం 5 గంటలలోపు https://mhsrb.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు రుసుం రూ.200 ఆన్లైన్లో చెల్లించాలి. దరఖాస్తు పరిశీలన రుసుం రూ.120 మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ తదితర కేటగిరీలకు చెందినవారు చెల్లించక్కర్లేదు. మిగిలిన వారు పరిశీలన రుసుం చెల్లించాలి. అభ్యర్థులు 18-44 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు(టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్లు, పురపాలికల్లో పనిచేసే వారికి వర్తించదు), ఎక్స్ సర్వీస్మెన్కు మూడేళ్లు, ఎన్సీసీకి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకూ వయోపరిమితిని సడలించారు. ఈ పోస్టులన్నీ మల్టీజోనల్కు చెందినవి. ఇందులో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లు 95 శాతం వర్తిస్తాయి. వంద పాయింట్లను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎంబీబీఎస్లో సాధించిన మార్కులను 80 పాయింట్లకు లెక్కిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రం వారి ఎంబీబీఎస్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. భారత్లో నిర్వహించే ‘ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్(ఎఫ్ఎంజీఈ)లో వారు సాధించిన మార్కులను లెక్కలోకి తీసుకుంటారు.
వెయిటేజికి కనీసం ఆర్నెల్ల నిబంధన
రాష్ట్ర ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 20 పాయింట్లను వెయిటేజిగా నిర్దేశించారు. ఈ పాయింట్లను కూడా ప్రాంతాల వారీగా విభజించారు. గిరిజన ప్రాంతాల్లో 6 నెలల పాటు పనిచేసిన వారికి 2.5 పాయింట్ల చొప్పున.. గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఆర్నెల్లకు 2 చొప్పున కేటాయిస్తారు. కనీసం ఆర్నెల్లు పనిచేసి ఉండాలనే నిబంధన విధించారు. వెయిటేజి ధ్రువపత్రాలను విభాగాధిపతుల నుంచి పొందాలి. ఇలా ఏ పోస్టుకు సంబంధించిన ధ్రువపత్రం పొందితే.. అదే పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.నిర్దేశించిన ప్రొఫార్మాలోనే ధ్రువపత్రాన్ని పొందాలి.వెయిటేజి మార్కులను నియామక ప్రకటన వెలువడిన తేదీ నాటికి లెక్కిస్తారు.
ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన పత్రాల వివరాలు
* ఆధార్ కార్డు
* ఎస్ఎస్సీ లేదా పదోతరగతి ధ్రువపత్రం
* ఎంబీబీఎస్ మార్కుల మెమో
* ఎంబీబీఎస్ సర్టిఫికెట్
* విదేశాల్లో అభ్యసించిన అభ్యర్థులైతే ఎఫ్ఎంజీఈ మార్కుల మెమో, సర్టిఫికెట్
* తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం
* ఒకటి నుంచి ఏడో తరగతి వరకూ విద్యాభ్యాస ధ్రువపత్రం
* ఇక్కడి పాఠశాలల్లో 1-7వ తరగతి వరకూ చదువుకోని అభ్యర్థులు స్థానికత సర్టిఫికెట్
* ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే సంబంధిత కుల ధ్రువీకరణ పత్రాలు
* బీసీలైతే నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్
* ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు తాజా ఆదాయ, ఆస్తుల అంచనా ధ్రువపత్రం
* క్రీడాకారులు సంబంధిత క్రీడా ధ్రువపత్రం
* దివ్యాంగులు సదరం.. ఎక్స్సర్వీస్మెన్, ఎన్సీసీ అయితే సంబంధిత ధ్రువపత్రం
* అభ్యర్థి ఫొటో, సంతకం ఫొటో
* అభ్యర్థులు దరఖాస్తు పత్రంలోని అన్ని కాలమ్స్ తప్పనిసరిగా పూర్తిచేయాలి. అసంపూర్తి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
* తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించిన వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్