సాదాబైనామా.. బాధలు తీరేనా!
తెల్లకాగితాలపై జరిగిన భూ విక్రయాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు మోక్షం లభించడం లేదు. రాష్ట్రంలో 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు రెండు విడతలుగా సాదాబైనామా దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. మొత్తం 8.13 లక్షల మంది దరఖాస్తు
రిజిస్ట్రేషన్లకు మార్గదర్శకాలు లేవంటున్న అధికారులు
2020 నవంబరు నుంచి ఎదురుచూపుల్లో ప్రజలు
తెల్లకాగితాలపై ఒప్పందాల చెల్లుబాటు ఎన్నడో
కలెక్టర్ల లాగిన్లోని అనర్హుల దరఖాస్తుల తిరస్కరణ
ఈనాడు, హైదరాబాద్: తెల్లకాగితాలపై జరిగిన భూ విక్రయాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు మోక్షం లభించడం లేదు. రాష్ట్రంలో 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు రెండు విడతలుగా సాదాబైనామా దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. మొత్తం 8.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే సందర్భంలో రెవెన్యూ చట్టం మారడంతో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై అనిశ్చితి ఏర్పడింది. ఆ సమయంలో పాత ఆర్వోఆర్ చట్టం ప్రకారం దరఖాస్తులను పరిష్కరించేందుకు రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకున్నా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు. ఒక దశలో ఆర్డినెన్స్ తెచ్చి చట్టంలో మార్పులు చేయాలని మంత్రివర్గం చర్చించింది. కానీ, అమలుకు నోచుకోలేదు.
క్షేత్రస్థాయిలో గందరగోళం
2014 జూన్2కు ముందు సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూమిని క్రమబద్ధీకరించేందుకు 2016లో అవకాశం ఇచ్చారు. 11.19 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 6.18 లక్షల మంది సాదాబైనామాలను క్రమబద్ధీకరించారు. సరైన సమాచారం లేక, ఆధారాలు లేక నాడు చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని ఎమ్మెల్యేలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీలు, ప్రజా సంఘాలు కూడా పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. దీంతో 2020లో సర్కారు మరోసారి అవకాశం కల్పించింది. ఇప్పటికీ ఆ దరఖాస్తుల పరిస్థితిపై రెవెన్యూశాఖ స్పష్టత ఇవ్వడం లేదని బాధితులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం తిరస్కరణకు గురయ్యాయని రెవెన్యూ సిబ్బంది చెబుతుండటంతో హతాశులవుతున్నారు.
ధరణిలో సమాచారం ఉంటేనే సాధ్యం
సాదాబైనామా ఒప్పందంతో జరిగిన భూ విక్రయంలో యజమాని పేరు రెవెన్యూ దస్త్రాల్లో మారదు. తెల్లకాగితంపై యజమానుల పేర్లు మార్చుతూ రాసుకున్న ఒప్పందం మాత్రమే బాధితుల వద్ద ఉంటుంది. ప్రస్తుతం ధరణి ఆధారంగా యాజమాన్య హక్కుల మార్పిడి కొనసాగుతున్న నేపథ్యంలో పాత రైతుల పేర్లు మాత్రమే పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. సాదాబైనామా క్రమబద్ధీకరణ చేయాలంటే ధరణిలో పాత రైతు పేరు స్థానంలో ప్రస్తుత రైతు పేరు చేర్చాలి. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయి పరిశీలన కీలకం. ఆర్వోఆర్ చట్టం సెక్షన్-11 ప్రకారం కొనుగోలుదారుడికి, సెక్షన్-12 ప్రకారం విక్రయదారుడికి తహసీల్దారు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ భూమి సరిహద్దు రైతుల వాంగ్మూలం నమోదు చేయాలి. కొనుగోలు చేసిన రైతు ఎన్నేళ్లుగా సాగులో ఉన్నారో నిర్ధారించాలి. ఇంత ప్రక్రియ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో విచారణ కూడా సాగడం లేదు. లక్షల సంఖ్యలో ఉన్న దరఖాస్తుల పరిష్కార బాధ్యత ఎప్పటికైనా రెవెన్యూశాఖదే.
భారీగా ఆదాయం.. అనర్హులపై వేటు!
సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేపడితే ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వస్తుంది. తెల్లకాగితాలపై ఒప్పందాలను గుర్తిస్తే ఆ భూముల లావాదేవీల సందర్భంలో ఆదాయం వచ్చే అవకాశముంది. భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో స్టాంపు డ్యూటీ కూడా సర్కారుకు ఎక్కువ మొత్తంలోనే వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 4.04 లక్షల దరఖాస్తులను కలెక్టర్ల లాగిన్కు రెవెన్యూశాఖ పంపగా వాటిని ఆన్లైన్లోనే పరిశీలించి అర్హతలేని 2 లక్షల దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిసింది. ఈ సమాచారం దరఖాస్తుదారులకు అధికారికంగా తెలియజేయడం లేదని, కార్యాలయాల్లో సిబ్బందిని కలిసిన సమయంలో మాటమాత్రంగా చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్